English | Telugu

వీరమల్లు మూవీ పబ్లిక్ కి నచ్చింది..  రివ్యూ రైటర్లకే మెచ్యూరిటీ లేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మొదటి షో నుంచే మెజారిటీ రివ్యూలు నెగటివ్ గా వచ్చాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో వీరమల్లు మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిలిగింది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు జ్యోతికృష్ణ.. రివ్యూ రైటర్లకు మెచ్యూరిటీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Hari Hara Veera Mallu)

రివ్యూలు అనేది సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతాయని కొందరు మేకర్స్ నమ్ముతుంటారు. అందుకే తమ సినిమాకి నెగటివ్ రివ్యూలు వస్తే.. రకరకాలుగా స్పందిస్తుంటారు. దర్శకుడు జ్యోతికృష్ణ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివ్యూ రైటర్లపై అసహనం వ్యక్తం చేశారు.

"ఇప్పుడు ప్రతి ఒక్కరూ రివ్యూయర్స్ అయిపోయారు. వాళ్ళు సినిమాని సినిమాలా చూడట్లేదు. ఈ సాంగ్ బాగుంది, ఈ ఫైట్ బాగుంది అన్నట్టుగా చూస్తున్నారు. అసలు ఈ కథ ఏంటి? ఎందుకిలా చేశారు? అని చూడట్లేదు. వాళ్లకి అంత మెచ్యూరిటీ లేదు. మేము ఇన్నేళ్లు కష్టపడి ఏదో టైం పాస్ కి సినిమా చేయము కదా. చూసేవాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రావాలి అనిపిస్తుంది. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడం కూడా రావాలి. క్లయిమాక్స్ కమర్షియల్ గా లేదని కొందరు రాశారు. కానీ, పబ్లిక్ కి ఆ క్లయిమాక్స్ నచ్చింది." అని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.