English | Telugu

మురుగ‌దాస్ కి ఫుడ్ పాయిజన్

ప్రముఖ తమిళ దర్శకుడు మురుగ‌దాస్ ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ప్రత్యేక వైద్య బృందం ప‌ర్యవేక్షణ‌లో ఆయన చికిత్స తీసుకొంటున్నారు. మురుగ‌దాస్ ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత౦ విజయ్, సమంతతో ‘కత్తి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.