English | Telugu

కొత్త రకం స్కామ్ బారిన పడ్డ నటి దీపికా 

మానవ మార్కెట్ లోకి రోజుకో కొత్త థియరీ తో స్కాం లు పుట్టుకొస్తుంటాయి. ఆ స్కాం ల బారిన పడి సాధారణ ప్రజలే కాదు కొంత మంది విఐపి లు కూడా విలవిలలాడిపోతుంటారు. తాజాగా ఒక కొత్త రకం స్కాం బయటపడింది. ఒక ఫేమస్ నటీమణి ఆ స్కాం బారిన పడటం సంచలనం సృష్టిస్తుంది.

ససురాల్ సీమర్ కా అనే బాలీవుడ్ సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటి
దీపికా కాకర్. ఎంతో మంది ఆ సీరియల్ ని చూస్తూ ఆమెకి అభిమానులుగా మారారు. తాజాగా ఆమె ఒక స్కాం బారిన పడింది. ఆమె ఎలా స్కాం బారిన పడిందో తన సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. దీపికా కి ఒకసారి ఒక వస్తువు డెలివరీ వచ్చింది. డబ్బులు కట్టి వస్తువు తీసుకుంది. ఆ తర్వాత ఆ వస్తువు తను బుక్ చేసిన ఆర్డర్ కాదని దీపికా కి అర్ధం అయ్యింది. దీపిక కి ఫస్ట్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీ తో ఆన్ లైన్ లో వస్తువుల్ని బుక్ చెయ్యడం అలవాటు. ఇలా తను ఆర్డర్స్ చెయ్యకుండానే కంటిన్యూగా ఆన్ లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ మీద వస్తువులు వస్తున్నాయి.పైగా వచ్చిన పార్సిల్స్ మీద దీపికా ఇంటి అడ్రెస్స్ ఫోన్ నెంబర్ కరెక్టుగా ఉండేవి.

మేము ఆర్డర్ చెయ్యలేదని ఆన్ లైన్ సంస్థకి దీపికా చెప్పినా కూడా సంస్థవాళ్ళు దీపికా తో మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసారు ఒక వేళ మీరు వద్దనుకుంటే మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ రద్దు నెంబర్ చెప్పండి అనేవాళ్ళు. దీంతో ఇదో కొత్త రకం మోసం అని దీపక అర్ధం చేసుకొని మీరు బుక్ చెయ్యకుండా మీ పేరుతో క్యాష్ ఆన్ డెలివరీ మీద వచ్చే పార్సిల్స్ ని తీసుకోవద్దని చెప్తుంది. మీరు నగదు చెల్లించాక వచ్చిన వస్తువు మీది కాదని తెలుస్తుందని ఆ తర్వాత మీరు కట్టిన డబ్బులు వెనక్కి రాకపోవడమే కాకుండా పార్సిల్ ని వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని దీపికా చెప్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.