English | Telugu

చిరు, ప‌వ‌న్‌ల‌తో దిల్‌రాజు సినిమా??

చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాల‌పైనే దృష్టి పెట్టారు. వ‌చ్చే రెండు మూడేళ్లు రాజ‌కీయప‌రంగా స్థ‌బ్దుగా ఉంద‌ని, అందుకే సినిమాల‌పై దృష్టి పెట్టి అభిమానుల్ని అల‌రించాల‌ని కోరుకొంటున్న‌ట్టు చిరు తెలిపారు. అందుకు త‌గిన‌ట్టే ఆయ‌న కోసం క‌థ‌లు రెడీ అవుతున్నాయి. చిరంజీవితో సినిమా చేయాల‌ని నిర్మాత‌లు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. త‌న త‌దుప‌రి చిత్రానికి చ‌ర‌ణ్ నిర్మాత అని చిరు ప్ర‌క‌టించ‌డంతో ఆ బెర్తుపై ఎవ్వ‌రికీ ఆశ‌ల్లేవు. కానీ.. ఆ త‌ర‌వాతి సినిమాల కోసం చిరుని ఒప్పించాల‌ని నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

జాబితాలో ముందుగా వినిపించే పేరు దిల్‌రాజు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఆడియో వేడుక‌లో దిల్ రాజులాంటి నిబ‌ద్ధ‌త క‌ల నిర్మాత‌తో సినిమా చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు చిరు. దాంతో దిల్‌రాజు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఓ సినిమా చేయ‌డానికి తాను స‌న్నాహాలు చేస్తున్నాన‌ని, అన్నీ కుదిరితే ఆ సినిమాలో చిరంజీవి కూడా క‌నిపిస్తార‌ని చెప్పి.. మెగా ఫ్యాన్స్‌ని సంతోష‌పెట్టాడు దిల్‌రాజు.

స‌ర్దార్ త‌ర‌వాత దాస‌రి నిర్మాణంలో ప‌వ‌న్ న‌టించ‌బోతున్నాడు. ఆ త‌ర‌వాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమాలో చిరంజీవి కూడా న‌టిస్తే బాగుంటుంద‌ని, అలాంటి క‌థ కోసం తాను అన్వేషిస్తున్నాన‌ని దిల్ రాజు చెబుతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టి ఇన్నేళ్ల‌యినా చిరంజీవితో క‌ల‌సి న‌టించ‌లేదు. ఆ అవ‌కాశం ఇప్పుడు ఇలా రాబోతోంద‌న్న‌మాట‌. చిరు, ప‌వ‌న్‌ల‌కు స‌రిప‌డ క‌థ‌ని వెదికిప‌ట్టుకోవ‌డం దిల్‌రాజులాంటి మాస్ట‌ర్ బ్ర‌యిన్‌కి పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. చూద్దాం... దిల్‌రాజు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో?

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.