English | Telugu

వచ్చే ఏడాదే దేవర పార్ట్-2

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన 'దేవర' (Devara) మూవీ ఇటీవల విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాని ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అప్పుడే 'దేవర-2' ఎప్పుడు మొదలవుతుందనే చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే వచ్చే ఏడాది నుంచే 'దేవర-2' షూట్ షురూ కానుందని తెలుస్తోంది. (Devara 2)

ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇప్పటికే 'వార్-2' షూటింగ్ కొంతభాగం పూర్తి చేసిన ఎన్టీఆర్.. త్వరలోనే నీల్ ప్రాజెక్ట్ షూట్ ని కూడా ప్రారంభించనున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ లను వచ్చే ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ కల్లా పూర్తి చేసేలా ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడట. ఈ లోపు కొరటాల కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తాడని, వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి 'దేవర-2' షూట్ మొదలు పెట్టేలా సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. 'దేవర'లో మీరు చూసింది 10 శాతమే అని, 'దేవర-2' ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే కొరటాల చెప్పాడు. ఆయన మాటలను బట్టి చూస్తే.. 'దేవర-2' అత్యంత భారీగా ఉండబోతుందని అర్థమవుతోంది.

అన్ని అనుకున్నట్టు జరిగి 'దేవర-2' వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నుంచి 'ఆర్ఆర్ఆర్', 'దేవర' అనే రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన మునుపటిలా వేగంగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ అడుగులు ఉంటున్నాయి. ఈ ఏడాది దేవరతో పలకరించాడు. 2025 ఆగష్టులో 'వార్-2', 2026 జనవరిలో నీల్ ప్రాజెక్ట్ విడుదల కానున్నాయి. ఇక 'దేవర-2' కూడా 2026 ద్వితీయార్థంలో లేదా 2027 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశముంది. అంటే ఇక మీదట ఎన్టీఆర్ నుంచి ఏడాదికి కనీసం ఒక సినిమా రానుంది అన్నమాట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.