English | Telugu

తెలంగాణాలో బోణి కొట్టిన ప్రభాస్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)నుంచి రాబోయే తదుపరి మూవీ రాజా సాబ్(raja saab)హర్రర్ కామెడీ అండ్ రొమాంటిక్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా చాలా సంవత్సరాల తర్వాత వింటేజ్ ప్రభాస్ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. పైగా కెరీర్ లో తొలిసారి హర్రర్ జోనర్ ని టచ్ చేస్తుండంతో పాన్ ఇండియా లెవల్లో అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి.

మారుతీ(maruthi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ పది న విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా కూడా ప్రకటించారు. ఇక ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటినుంచే ఈ మూవీ బిజినెస్ కి సంబంధించి తీవ్ర పోటీ నెలకొని ఉందని తెలుస్తుంది.ఈ మేరకు నైజాం ఏరియాకి సంబంధించి రిలీజ్ హక్కులని అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.ఆంధ్ర, సీడెడ్ కి సంబంధించిన హక్కుల విషయంలో కూడా తీవ్ర పోటీ నెలకొని ఉంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వ ప్రసాద్(tj viswa prasad)అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజా సాబ్ లో ప్రభాస్ సరసన నిది అగర్వాల్, మాళవిక మోహనన్, రిది లు హీరోయిన్లు గా చేస్తుండగా సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడు.ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటుండగా ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఆల్రెడీ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ప్రభాస్ లుక్ ఒక రేంజ్ లోనే వైరల్ అయ్యాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.