English | Telugu

వరల్డ్ రికార్డు సృష్టించిన దీపికా పదుకునే.. పాండ్యా, రొనాల్డో రికార్డు బద్దలు 

భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'దీపికా పదుకునే'(Deepika padukone). బాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న 'దీపికా' గత ఏడాది ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఏడి' తో తన సత్తా చాటింది.ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో చేస్తుంది. దీపికా క్యారక్టర్ కి సంబంధించి, మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోతో, దీపికా ఒక శక్తీ వంతమైన పాత్రలో కనిపించబోతున్న విషయం అర్ధమవుతుంది.

కొన్ని రోజుల క్రితం ఒక అంతర్జాతీయ హోటల్ చైన్ తో కలిసి ‘ఇట్ మ్యాటర్స్ వేర్ యు స్టే'(It Maaters where you stay)ప్రచారంలో భాగంగా ఒక రీల్ ని దీపికా 'ఇన్ స్టాగ్రామ్'(Instagram)లో పోస్ట్ చేసింది. ఎనిమిది వారాల క్రితం చేసిన ఆ రీల్ ఇప్పటి వరకు 190 కోట్ల వ్యూస్ ని రాబట్టింది. దీంతో ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తరుపున ఉన్న అత్యధిక వ్యూస్ రికార్డుని దీపికా అధిగమించి,ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన రీల్ గా రికార్డు సృష్టించింది. దీపికాకి ఇన్ స్టాగ్రామ్ లో 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

దీపికా ఇటీవల హాలీవుడ్ కి చెందిన 'వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా నిలిచిన విషయం తెలిసిందే. 2006 లో ఉపేంద్ర హీరోగా కన్నడంలో తెరకెక్కిన ఐశ్వర్య మూవీతో దీపికా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2007 లో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh Khan)తో కలిసి చేసిన 'ఓం శాంతి ఓం' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.