English | Telugu

Dacoit Teaser: కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. డెకాయిట్ టీజర్ అదిరింది!

విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడివి శేష్. ఆయన నటించిన సినిమా అంటే.. అందులో కంటెంట్ బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంటుంది. అలాంటి శేష్ నుంచి.. 2022లో వచ్చిన 'మేజర్', 'హిట్-2' తర్వాత హీరోగా సినిమా రాలేదు. శేష్ ప్రేక్షకులను పలకరించి మూడేళ్లు అయిపోయింది. ఆ లోటుని భర్తీ చేసేలా.. 2026లో 'డెకాయిట్', 'గూఢచారి-2' సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ 'డెకాయిట్'. శనియేల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఉగాది కానుకగా 2026 మార్చి 19న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

నిమిషంన్నర నిడివితో రూపొందిన 'డెకాయిట్' టీజర్ ఆకట్టుకుంటోంది. 'ఒక ప్రేమ కథ' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నప్పటికీ.. ఇందులో రొమాన్స్ కంటే కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండనున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. జైలు నుంచి వచ్చిన క్రిమినల్ పాత్రలో శేష్ కనిపిస్తున్నాడు. మృణాల్ తో కలిసి శేష్ ఒక రాబరీ చేయడానికి సిద్ధపడటం? అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా? అనే కోణంలో టీజర్ ను కట్ చేశారు.

టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా 'కన్నె పిట్టరో కన్ను కొట్టరో' సాంగ్ రావడం హైలైట్ గా నిలిచింది. ఆ సాంగ్ టీజర్ కి కొత్త లుక్ తీసుకొచ్చింది. అలాగే, టీజర్ లో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ వంటి ప్రముఖ నటులు కనిపించారు. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ మైక్ లో "ఓ..ఓ.." అని హమ్ చేస్తుండగా టీజర్ ఎండ్ అవ్వడం మెప్పించింది.

Also Read: రాజా సాబ్ సాంగ్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్!

'డెకాయిట్'లో అడివి శేష్, మృణాల్ ప్రేమించుకొని విడిపోతారు. ఈ మాజీ ప్రేమికులు ఒక క్రైమ్ వల్ల మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు.. ట్విస్ట్ లు, ఛేజ్ లు, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా నడవనుందని తెలుస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.