English | Telugu

'కస్టడీ' ట్రైలర్ అదిరింది.. చైతన్య సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు!

నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కస్టడీ'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ తెలుగు, తమిళ భాషల్లో మే 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

'కస్టడీ' చిత్రం 48 గంటల్లో జరిగే కథ అని ఇప్పటికే మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ఏకంగా సీఎం బండినే ఆపిన కానిస్టేబుల్ శివగా చైతన్య పరిచయమయ్యాడు. అతనికి డ్యూటీ అంటే ప్రాణం, డ్యూటీ కోసం ఏమైనా చేస్తాడు అన్నట్టుగా అతని పాత్రను చూపించారు. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి పెళ్లి.. మరోవైపు పై అధికారులను ఎదిరించి, ప్రత్యర్థుల దాడుల నుంచి రక్షిస్తూ ఓ భయంకరమైన క్రిమినల్ ని కోర్టులో హాజరుపరిచే బాధ్యత.. వీటి నడుమ కథానాయకుడి ప్రయాణం ఎలా సాగిందన్న ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "ఒక్కసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది", "నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది" వంటి డైలాగ్స్ మెప్పించాయి. కతీర్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే చైతన్య ఖాతాలో మంచి విజయం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.