English | Telugu

'30 ఇయర్స్..' కి బ్రేక్ వచ్చింది

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఖడ్గం సినిమాతో సూపర్ పాపులరైన పృథ్వి.. ఆ తర్వాత ఒకటిన్నర దశాబ్దంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఐతే తను ఆశించిన బ్రేక్ ఎట్టకేలకు లౌక్యం సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ పేరుతో పృథ్వి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రొటీన్ సినిమా అంటూ పెదవి విరిచిన వాళ్లంతా పృథ్వి కామెడీ మాత్రం కేక అంటున్నారు. బాయిలింగ్ స్టార్ చేసిన హంగామా సూపర్ అంటున్నారు. అప్పట్లో దుబాయ్ శీనులో ఎమ్మెస్ నారాయణ వేసిన ఫైర్ స్టార్ సాల్మన్ రాజు క్యారెక్టర్ కు ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు పృథ్వికి బాయిలింగ్ స్టార్ బబ్లూతో అంతే పేరు వస్తోంది. లౌక్యంలో బ్రహ్మానందం కూడా బాగానే నవ్వించినా.. ఆయనకన్నా పృథ్వికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. రొటీన్ గా సాగిన సినిమాను కాపాడింది పృథ్వినే అంటున్నారంతా. ఇటు ప్రేక్షకులు, విమర్శకులు అందరూ పృథ్విపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.