English | Telugu
చక్రి భార్య శ్రావణికి ప్రాణహాని వుందా?
Updated : Dec 17, 2014
చక్రి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని వుందని, అందుకే తాను మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించానని చక్రి భార్య శ్రావణి మీడియాకు తెలియజేశారు. చక్రి తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు తనను హింసించారని, ఆస్తికోసం వేధిస్తున్నారని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. అలాగే చక్రి మరణించిన వారి కుటుంబసభ్యులు ప్రవరిస్తున్న తీరు తనకు భయాన్ని కలిగించాయని ఆమె తెలిపారు. చక్రి ఆరోగ్యం విషమంగా ఉన్నవిషయాన్ని చెప్పడానికి తాను ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే ఎవరూ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. దాంతో తాను కనీసం కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా అంబులెన్స్లో చక్రిని ఆస్పత్రికి తీసుకెళ్ళానని అన్నారు. చక్రి చనిపోయిన తర్వాత చక్రి చనిపోయాడన్న బాధ కంటే చక్రి ఆస్తి మీద ఆసక్తి వారిలో ఎక్కువగా కనిపించింది. నేను బాధతో రోదిస్తుంటే చక్రి తరఫు బంధువులెవరూ నన్ను ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం మంచినీళ్ళు అయినా తాగానా లేదా అని కూడా పట్టించుకోలేదు. ఆయన కర్మకాండలు పూర్తి కాకముందే ఆస్తికోసం వీళ్ళ వేధింపులు ఎక్కువయ్యాయి అని ఆమె తెలిపారు.