English | Telugu

ఎమ్మెస్‌ నారాయణ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

అద్భుతమైన నటుడిని కోల్పోయాం- బాలకృష్ణ

ఎమ్మెస్‌ నారాయణ అద్భుతమైన నటుడు. మంచి మిత్రుడు. పలు సినిమాల్లో కలిసి చేశాం. ఆయన మృతిచెందారన్న వార్త మనసును కలచివేసింది. ఈ మధ్య కూడా ‘లయన్‌’లో కలిసి నటించాం. అలాంటి గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

గొప్ప మానవతావాది.. ఆర్ నారాయణ మూర్తి

ఎమ్మెస్ నారాయణ గొప్ప రచయిత, నటుడు అంతే కాకుండా గొప్ప మానవతావాది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఎమ్మెస్ కోలుకుంటాడని ఆశించానని మూర్తి అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

బాధాకర౦...అలీ

ఎమ్మెస్ నారాయణ మృతి బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు అలీ అన్నారు. తామిద్దరం కలిసి వంద సినిమాలు పైగా కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెస్ రచయితగా వచ్చి, నటుడిగా తన మార్కుని ఏర్పరుచుకున్నారని అలీ తెలిపారు. దూకుడుకు అవార్డు వచ్చినప్పుడు ఎమ్మెస్ సంతోషించారని, ఒక అవార్డు వస్తే నటుడికి సపోర్ట్ గా ఉంటుందని ఆయన అన్నారని అలీ వెల్లడించారు. ఎమ్మెస్ కుటుంబానికి అలీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

షాకింగ్ గా ఉంది.. చంద్రబోస్

ఎమ్మెస్ నారాయణ మృతి చాలా షాకింగ్ గా ఉందని, తట్టుకోలేక పోతున్నాని పాటల రచయిత చంద్రబోస్ తెలిపారు. తన తొలి నాళ్లలో రచయితగా పరిచయం అని ఎమ్మెస్ అద్భుత సంభాషణలు రాశారని గుర్తు చేసుకున్నారు. బోసు.. బోసు అని ఆప్యాయంగా పిలుస్తూ, తనను ఎమ్మెస్ కొడుకులా చూసుకునేవారని చంద్రబోస్ చెప్పారు. ఎమ్మెస్ నారాయణ కుటుంబానికి బోస్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మిత్రున్ని కోల్పోయా..రంగనాథ్

మంచి మిత్రున్ని కోల్పోయానని నటుడు రంగనాథ్ అన్నారు. ఎమ్మెస్ నారాయణ సినిమా రంగంలోకి రాకుముందే తమ మధ్య సాన్నిహిత్యం ఉండేదని రంగనాథ్ తెలిపారు. తన కొడుకు, కూతురు పట్ల శ్రద్ధ తీసుకుని ప్రోత్సహిస్తూ తండ్రిగా కూడా పిల్లలకు న్యాయం చేశారన్నారు. ఎమ్మెస్ కుటుంబానికి రంగనాథ్ సానుభూతిని తెలియజేశారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.