English | Telugu

సెలెబ్రిటీ క్రికెట్ లో సౌత్ సూపర్ స్టార్స్ గెలిచారు

సౌత్ సూపర్ స్టార్స్ , బాలీవుడ్ హీరోస్ కీ మధ్య విశాఖపట్టణంలో, వై యస్ రాజశేఖర రెడ్డి స్టేడియమ్ లో జరిగిన సి.సి.యల్. ( సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ )కర్టెన్ రైజర్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో సౌత్ సూపర్ స్టార్స్ నిజంగానే సూపర్ స్టార్స్ అనిపించారు. అంటే ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో సౌత్ సూపర్ స్టార్స్ 36 పరుగుల తేడాతో బాలీవుడ్ హీరోస్ మీద ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ సూపర్ స్టార్స్ నిర్ణీత ట్వంటీ ఓవర్లలో నూటతొంభై మూడు పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని బాలీవుడ్ హీరోస్ ముందుంచింది.

సౌత్ సూపర్ స్టార్స్ కెప్టెన్ వెంకటేష్ బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ చివరి బంతిని సిక్సర్ గా మలచి స్టేడియంలోనూ, టి.వి.ల ముందు వీక్షిస్తున్న అశేష అభిమానులను అలరించారు. సౌత్ సూపర్ స్టార్స్ లో నందమూరి తారకరత్న పదమూడు బంతుల్లోనే ముప్పై పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన బాలీవుడ్ హీరోస్ ని సౌత్ సూపర్ స్టార్స్ కేవలం నూట యాభై ఏడు పరుగులకు మాత్రమే కట్టడి చేయగలిగి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ హీరోస్ కీ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.