English | Telugu

'భోళా శంకర్' ట్రైలర్.. మెగాస్టార్ విశ్వరూపం!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

'భోళా శంకర్' ట్రైలర్ ఈరోజు(జూలై 27) సాయంత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైంది. చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు 'భోళా శంకర్' ట్రైలర్ సైతం అదే శైలిలో సాగింది. చిరు తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి అలరించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అమ్మాయిల కిడ్నాప్ సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్.. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల మేళవింపుతో పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ లా ఉంది. ట్రైలర్ చూస్తుంటే 'వాల్తేరు వీరయ్య' తరహాలో మెగా ఫ్యాన్స్ కి మరోసారి విందుభోజనం ఖాయమనిపిస్తోంది.

తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. మురళీ శర్మ, రఘు బాబు, వెన్నెల కిషోర్, పి. రవిశంకర్, శ్రీముఖి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.