English | Telugu

ఏం షాకిచ్చావ్ బాల‌య్యా..?!

బాల‌య్య‌... బాల‌య్య‌... బాల‌య్య‌.. అభిమానుల గుండెల్లో నిత్యం మ‌ర్మోగే మంత్ర‌మిది. బాల‌య్య‌ని తెర‌పై చూసుకొంటే చాలు.. కోటి దీపాలు వెలిగిన‌ట్టుంటాయ్ వాళ్ల‌కి. అలాంటి నంద‌మూరి ఫ్యాన్స్‌కి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. నంద‌మూరి బాల‌కృష్ణ త్వ‌ర‌లోనే సినిమాల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్నారు. 100వ సినిమానే బాల‌య్య ఆఖ‌రి సినిమా. ఈ విష‌యాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ అధికారికంగానూ ప్ర‌క‌టించారు.

వందో సినిమా త‌ర‌వాత తాను పూర్తిగా రాజ‌కీయాల‌పై దృష్టిపెడ‌తాన‌ని చెబుతున్నారు బాల‌కృష్ణ‌. అంటే సినిమాల‌కు దూర‌మైన‌ట్టే క‌దా..?! డిక్టేట‌ర్ బాల‌య్య 99వ సినిమా. ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌నుతో సెంచ‌రీ సినిమా పూర్తి చేస్తారు. 2016 నాటికి బాల‌య్య వందో సినిమా పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత పూర్తిగా ఆయ‌న పాలిటిక్స్ లోనే ఉండిపోనున్నారు. అందుకే వీలైనంత త్వ‌ర‌గా త‌న న‌ట‌వార‌సుడు మోక్షజ్ఞ‌ని వెండి తెర‌పై చూసుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. ఇందుకోసం కూడా రంగం సిద్ధ‌మ‌వుతోంది.

మోక్ష‌జ్ఞ‌కు స‌రిప‌డా క‌థ సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే బాల‌య్య‌కు `మంత్రి` ప‌ద‌వి ద‌క్క‌బోతోంద‌న్న ప్ర‌చారం కూడా మ‌రోవైపు ఉదృతంగా న‌డుస్తోంది. మంత్రిగా ప‌ద‌వీ స్వీకారం చేశాక కూడా సినిమాలు, షూటింగులూ అంటూ ఆలోచిస్తే కుద‌ర‌దు. అందుకే బాల‌కృష్ణ ఈ నిర్ణ‌యం తీసుకొన్నార‌ని చెప్పుకొంటున్నారు. బాల‌కృష్ణ సినిమాల‌కు దూర‌మ‌వ్వాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం అభిమానుల‌కు నిజంగా షాకింగ్ న్యూసే. కానీ.. రాజ‌కీయాల‌తో ప్రత్య‌క్షంగా ప్ర‌జ‌ల‌కు ట‌చ్‌లో ఉంటారు కాబ‌ట్టి... కొంత‌లో కొంత స‌ర్దుక‌పోవ‌చ్చు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.