English | Telugu

భ‌జ‌రంగ్ బ‌న్నీ..



బాలీవుడ్‌లో భ‌జ‌రంగ్ భాయ్‌జాన్ విజృంభిస్తోంది. చాలా సున్నిత‌మైన క‌థ‌ని క‌బీర్‌ఖార్ అద్భుతంగా డీల్ చేశాడ‌ని, స‌ల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అని ప్ర‌సంశ‌లు అందుతున్నాయ్‌. ఈ సినిమా వంద‌ల కోట్లు దాటి... సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా సాగిపోతోంది. అయితే ఈ క‌థ‌ని విజ‌యేంద్ర‌ప్రసాద్ చాలామంది హీరోలకు వినిపించారు. అందులో బ‌న్నీ కూడా ఉన్నాడు. బ‌న్నీకి సాఫ్ట్ క‌థ‌లంటే ఇష్ట‌మే. వేదంతో ఓ ప్ర‌యోగం కూడా చేశాడు.

కానీ భ‌జ‌రంగ్ భాయ్‌జాన్ క‌థ విష‌యానికొచ్చిన‌ప్పుడు కాస్త కంగారుప‌డ్డాడ‌ట‌. ఇండియా - పాకిస్థాన్ క‌థ‌గానే ఈ సినిమాని తీర్చిదిద్దితే జ‌నం ఆద‌రిస్తార‌ని.. అలా చేయాలంటే ఈ సినిమాని ఓ పెద్ద స్థాయిలో చేయాల‌ని, బాలీవుడ్ సినిమాకే ఆ స్కోప్ ఉంద‌ని బ‌న్నీ చెప్పాడ‌ట‌. దాంతో చివ‌రికి అటు తిరిగి ఇటు తిరిగి స‌ల్మాన్ ఖాన్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం అది భ‌జ‌రంగ్ భాయిజాన్ గా రూపుదిద్దుకోవ‌డం జ‌రిగిపోయాయి. నిజంగానే క‌థ‌కు టెమ్ట్ అయ్యింటే ఈసినిమా ఫ‌లితం ఏ రేంజులో ఉండేదో.?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.