English | Telugu
అపరిచితుడు రీ రిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్!
Updated : May 15, 2024
చియాన్ విక్రమ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ 'అపరిచితుడు'. ప్రముఖ నిర్మాత వి. రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాలో సదా హీరోయిన్ గా నటించింది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథా నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగా మార్చింది. ప్రస్తుతం రీ రిలీజ్ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో అపరిచితుడు సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
ఆస్కార్ సినిమా బ్యానర్పై రూపొందిన అపరిచితుడు చిత్రాన్ని 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయల షేర్ ప్రపంచవ్యాప్తంగా సాధించి పెట్టింది. ఈ చిత్రం ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు హై ఓల్టేజ్ను అందించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. రాము, రెమో, అపరిచితుడుగా విక్రమ్ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అపరిచితుడు సినిమాకు హ్యారీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఆయన స్వరపరిచిన పాటలన్నీ చార్ట్బస్టర్ అయ్యాయి. సాంగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించాయి. అలాంటి సినిమారీ రిలీజ్ అవుతుందంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు అనడంలో సందేహం లేదు. మరోసారి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అపరిచితుడు రీరిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా మంచి స్పందన కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత సరైన సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు.