English | Telugu

ఎన్టీఆర్ 'దేవర'కు పోటీగా మరో పాన్ ఇండియా మూవీ!

'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడదే సమయంలో మరో పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేష‌న్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే 'దేవర' విడుదలైన వారం రోజులకే 'కంగువా' థియేటర్లలో అడుగుపెట్టనుంది. 'దేవర' విజయం ఎన్టీఆర్ కి కీలకం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ ఇమేజ్ ని 'దేవర'తో నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాడు. మరోవైపు సూర్య మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కానీ, సౌత్ లో 'దేవర' రెండోవారం కలెక్షన్లపై 'కంగువా' ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశముంది. మరి దీనిని దాటుకొని 'దేవర' చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.