English | Telugu

తమన్ జపం చేస్తున్న బాలయ్య!

టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు ఎన్నో ఉన్నాయి. పలువురు దర్శకులు హిట్ సెంటిమెంట్ ని కొనసాగిస్తూ వరుసగా ఒకే సంగీత దర్శకుడితో ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ని హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ కి వరుస అవకాశాలు ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో వరుస విజయాలు అందుకున్న బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'NBK 108'తో హ్యాట్రిక్ పై కన్నేశాడు. అయితే బాలయ్య లేటెస్ట్ సక్సెస్ జర్నీలో తమన్ భాగమయ్యాడు. బాలయ్య-తమన్ మొదటిసారి 2016 లో విడుదలైన 'డిక్టేటర్' కోసం చేతులు కలిపారు. 'అఖండ'తో వీరిది సక్సెస్ ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకుంది. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి'తోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న 'NBK 108'కి కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత బాలయ్య చేయనున్న మరో సినిమాకి సైతం సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరించనున్నాడని సమాచారం.

బాలయ్య తన 109 వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్ర ప్రకటన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న రానుంది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా తమన్ పని చేయనున్నాడట. అంతేకాదు దీని తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో రానున్న కొత్త చిత్రానికి సైతం తమన్ సంగీతం అందిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తానికి బాలయ్య కొత్త సినిమా వస్తుందంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫిక్స్ అనేలా పరిస్థితి ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.