English | Telugu

లండన్ ఐ దగ్గర జరిగేది స్కాం గేమ్..బి అలెర్ట్ అన్న శ్యామల

యాంకర్ శ్యామల గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెర మీద చలాకీ మాటలతో ఆకట్టుకుంటూనే యాంకరింగ్ చేస్తుంది. అటు సీరియల్స్ లో ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె లండన్ లో విహరించడానికి వెళ్ళింది. అలా లండన్ లో జరిగే విషయాలను వీడియోస్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేస్తూ ఉంది. ఐతే లండన్ లో ఏమేం ఉంటాయి అనే విషయాలు నార్మల్ పీపుల్ కి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం శ్యామల ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటుంది. లండన్ ఐ ఏరియాలో ఉండి అక్కడే ఒక వీడియో చేసింది. అదేంటంటే ఆ లండన్ ఐ ప్లేస్ మొత్తం కూడా చాలా మంది టూరిస్టులతో నిండిపోయి కనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ కొంతమంది ఆ బ్రిడ్జి మీద ఒక మ్యాట్ వేసుకుని దాని మీద మూడు గ్లాసులు పెట్టి దాని కింద ఒక బాల్ పెట్టి గేమ్ ఆడతారు. అచ్చంగా ఎలా అంటే మన ఊళ్ళల్లో, పల్లెటూళ్లలో కాయ్ రాజా కాయ్ పేరుతో ఆడుతూ ఉంటారు కదా సేమ్ అలాగే అన్నమాట.

ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ గేమ్ ఆడేవాడు, పక్కన ఉండి ఆడించేవాడు అందరూ వాళ్లకు సంబందించిన వాళ్ళే ఉంటారట. బయటవాళ్ళెవరూ ఉండరు. అంతా కూడా ఒక టీంగా ఫార్మ్ ఐపోయి టూరిస్టుల అటెంషన్ ని తమ వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కాయ్ రాజా కాయ్ గేమ్. ఐతే టూరిస్టులకు ఇవన్నీ తెలీక డబ్బులు కాస్తూ ఉంటారు. కానీ అలా డబ్బులు కాస్తే మాత్రం బొక్కే కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని అక్కడ జరిగే విషయాన్నీ వీడియో తీసి అప్ లోడ్ చేసి అక్కడికి వెళ్లే టూరిస్టులను అలెర్ట్ చేసింది. ఇక ఈమె పోస్ట్ చేసిన వీడియోకి కామెంట్స్ వెల్లువెత్తాయి. "చాలా త్వరగా ఈ స్కాం గేమ్స్ ని పసిగట్టి అలెర్ట్ చేశారు. పాపం ఇవన్నీ తెలీక చాలా మంది టూరిస్టులు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. మీరు విరూపాక్ష మూవీలో సూపర్ గా చేశారు" అని అన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా లండన్ వెళ్లిన శ్యామల అక్కడి విషయాలను తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.