English | Telugu

దా...వుడా, ఆ డైరెక్ట్ రా....!

కలెక్షన్ లు కురిపించడం లో రేస్ గుర్రంలా దూసుకెళ్ళే బన్నీ సినిమాలు ఎంచుకోవడంలో ఎప్పుడు మిస్టర్ పర్ఫెక్టే. రీసెంట్ గా రేస్ గుర్రం సినిమాతో మంచి హిట్ సాధించిన ఈ హీరో ఒక కొత్త సినిమాకు ఓకే చెప్పేశాడు. గంగోత్రి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ హీరో ఇప్పటి వరకు అందరు పెద్ద, హిట్ డైరెక్టర్లతోనే పని చేశాడు అని చెప్పాలి. రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, సుకుమార్, సురేందర్ వంటి డైరెక్టర్ లతో మంచి హిట్ లు పొందిన ఈ ఎనర్జీ స్టార్ ఇప్పుడు ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. సిద్దార్థ్, శృతి హాసన్ కలిసి నటించిన ఓహ్ మై ఫ్రెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ల పడిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్. సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ లో టాలెంట్ కి కొదవ లేదని, ఆ నమ్మకంతోనే ఆయనతో సినిమా చేయటానికి అల్లు అర్జున్ సిద్డమయ్యారని తెలుస్తోంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.అందుకే కాబోలు హీరో గారు డైరెక్టర్ ఫ్లాప్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. డైరెక్టర్ ఎలా ఉన్నా, ప్రొడ్యూసర్ సూపర్ హిట్ అని ఓకే అనేసి ఉంటారు.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.