English | Telugu

ఇది మూడడుగుల బుల్లెట్టు

అది ఆరడుగుల బుల్లెట్టు... విడుదల అయిన నాటి నుంచి ఈ సాంగ్ సూపర్ హిట్. దీంతో ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల ద్రుష్టి ఈ బుల్లెట్ టైటిల్ పైన పడింది. ఆ బుల్లెట్ ఇన్స్ పిరేషన్ తో ఇప్పుడు మూడడుగుల బుల్లెట్ అనే సినిమా రాబోతోంది. ఇది ఒక విశేషం అయితే ఆ అర బుల్లెట్ బ్రహ్మానందం అని వార్తలు రావడం మరో విశేషం. ఎన్నో హిట్ చిత్రాలకి బ్రహ్మీ కామెడి సూపర్ టానిక్ గా నిలిచింది. ఇంకా బ్రహ్మానందానికి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ చాలా మంది పెద్ద హీరోలకు కూడా లేదేమో. హీరోల విషయంలో అభిమానులు వేరైనా కామెడికి మాత్రం అందరి బిగ్ హీరో బ్రహ్మానందమే. ఇంత క్రేజ్‌ ఉన్న ఈ స్టార్ క్రేజ్ ని పూర్తిగా వాడుకున్న సినిమా ఇంతవరకు రాలేదు. బ్రహ్మానందం హీరోగా గతంలో పలు సినిమాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేక పోయాయి. అయినా బ్రహ్మీకి హీరోగా ఛాన్స్ లు ఇంకా వస్తూనే వున్నాయి. బ్రహ్మానందం హీరోగా ‘మూడడుగుల బుల్లెట్‌’అనే సినిమా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడితో రూపొందుతున్న ఈ చిత్రం వివరాలు అస్సలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. భారీ లెవల్లో ఒకేసారి ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేయాలని యోచిస్తున్నారట. సినిమాలో అరగంట పాటే ఉన్నా తన కోసం అభిమానులను థియేటర్ కు వచ్చేలా చేయగలిగిన కమెడియన్ బ్రహ్మానందం. ఆయన హీరో వస్తున్నా ఈ మూడడుగుల బుల్లెట్టు చిత్రం ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.