English | Telugu

ఐష్ పై మాజీ లవర్ కేసు..??

పెళ్ళైన తర్వాత ఎటువంటి వివాదాస్పద వార్తలకు చోటివ్వని ఐశ్వర్యా రాయ్, తల్లి అయిన తర్వాత సినిమాలకు కూడా దూరమయి మాతృమూర్తిగా తన పూర్తి సమయం ఇంటికే కేటాయిస్తోంది.అడపా దడపా కొన్ని ప్రకటనల్లో తప్ప మరెక్కడా కనిపించని ఐశ్వర్యా సడెన్ గా మీడియా సెన్సేషన్ గా మారింది.ఆమె మాజీ లవర్ ఆమె పై కేసు నమోదు చేసాడు. మాజీ లవర్ అనగానే సల్మాన్ ఖాన్ లేదా వివేక్ ఒబ్రాయ్ ఈ పని చేసాడు అని అనుకుంటే పొరపాటే. ఈతగాడి పేరు నిరోషణ్ దేవప్రియా. శ్రీలంక కు చెందిన ఈ ప్రేమికుడు ఐశ్వర్యా తో తనకు గతంలో ప్రేమానుబంధం ఉందని, ఆమె అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకోవడం వల్ల తానూ ఎంతో మానసిక ఒత్తిడికి గురి అయ్యానని కేసు నమోదు చేశాడు. ఐష్ కి పెళ్లై ఏడేళ్ళు అయ్యాక మనోడికి మానసికంగా బాధ కలగటం విడ్డూరంగానే కాదు, కామెడి గా కూడా ఉందంటున్నారు వార్తా విన్న వారంతా...2007 లో ఈ మాజీ విశ్వ సుందరి వివాహం జరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలు ముక్కలు అయిన మాట వాస్తవమే.కానీ ఏడేళ్ల తర్వాత ఆ బాధను ఇలా కేసు పెట్టి మరి చాటి చెప్పటం చూస్తే ఇదో పబ్లిసిటీ స్టంట్ కాబోలు అనిపించక మానదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.