English | Telugu

ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం.. ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులు

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప: ది రైజ్', 'ఉప్పెన' చిత్రాలు 2023 జాతీయ అవార్డుల్లో సత్తా చాటాయి. ముఖ్యంగా పుష్ప చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ అవార్డులు అందుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా మైత్రి సంస్థ ప్రత్యేక పార్టీని నిర్వహించింది. ఇందులో అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ పలు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "బాలీవుడ్ కి వెళ్ళమని ఈ 20 ఏళ్ళలో దేవిశ్రీప్రసాద్ కి ఎన్నోసార్లు చెప్పాను. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ 'ముందు నువ్వు వెళ్ళు, నీ వెనక నేనూ వస్తా' అనేవాడు. కానీ అది సాధ్యమవుతుందా అని నేను అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు మేమిద్దరం ఒకేసారి పుష్పతో హిందీలో కూడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ళ నుంచి దేవి అంటున్న మాట నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఇద్దరికీ నేషనల్ అవార్డ్స్ రావడం పట్ల మా నాన్న(అల్లు అరవింద్) ఎంతో ఆనందించారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డులు వచ్చినట్టు ఉందన్నారు. ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకునే మేం, ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులు తీసుకుంటామని అనుకున్నావా అని నేను ఆయనతో సరదాగా అన్నాను. ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని అంటుంటారు. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా కోరుకుంటే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ నాకు జాతీయ అవార్డు రావాలని నాకంటే బలంగా సుకుమార్ కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అఛీవర్.. నేను అఛీవ్ మెంట్ మాత్రమే" అని అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.