English | Telugu

అఖిల్‌కి సోషియా ఫాంట‌సీ స్టోరీ?

వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ ఎంట్రీ ఖ‌రారైపోయి చాలా రోజులైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అన్న‌పూర్ణ కాంపౌండ్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన సంగ‌తులేం బ‌య‌ట‌కు రాలేదు. క‌థ విష‌యంలో ఓ క్లారిటీ ఇచ్చాక‌.. అన్ని వివ‌రాలూ ఒకేసారి మీడియాకు చెప్పేయాల‌ని వినాయ‌క్ - నాగార్జున భావిస్తున్నారు. వినాయ‌క్ ప్ర‌స్తుతం కోన‌వెంక‌ట్‌, గోపీమోహ‌న్ ల‌తో కుస్తీలు ప‌డుతున్నారు. అఖిల్ స్టోరీ విష‌యంలో ఓ క్లూ దొరికింది. ఇదో సోషియో ఫాంట‌సీ క‌థ అట‌. మాయ‌లూ, మంత్రాల నేప‌థ్యంలో సాగే సినిమా అని తెలిసింది. ఈ జోన‌ర్‌లో వినాయ‌క్ ఎప్పుడూ సినిమా చేయ‌లేదు. సో.. త‌న‌కి ఈ లైన్ కొత్త‌గా ఉంటుంద‌ని భావించాడ‌ట‌. అఖిల్ టాలెంట్లు పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించే క‌థ ఇద‌ని అటు నాగార్జున కూడా న‌మ్ముతున్నాడ‌ట‌. అంతే కాదు.. ఈసినిమాలో నాగార్జున కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్ గీతాన్ని రీమిక్స్ చేయాల‌ని టీమ్ భావిస్తోంద‌ని స‌మాచార‌మ్‌. డిసెంబ‌రులో ఈ సినిమాఎట్టిప‌రిస్థితుల్లోనూ సెట్స్‌పైకి వెళ్ల‌డం ఖాయంలా అనిపిస్తోంది. ఈ నెలాఖ‌రులోగా ఈసినిమాకి సంబందించిన పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.