English | Telugu

కృష్ణ‌వంశీ - ప్ర‌కాష్ రాజ్ - దిల్‌రాజు సినిమా

కృష్ణ‌వంశీ - ప్ర‌కాష్‌రాజ్‌ల మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. కృష్ణ‌వంశీ త‌న సినిమాల్లో ప్ర‌కాష్‌రాజ్‌కి గొప్ప పాత్ర‌ల్ని డిజైన్ చేశాడు. మ‌ధ్య‌లో ఎందుకో.. వీళ్లిద్ద‌రి అనుబంధానికి బ్రేక్ ప‌డింది. గోవిందుడు అంద‌రివాడేలేతో మ‌ళ్లీ ఈ ఫ్రెండ్‌షిప్‌కి చిగుర్లు వేశాయి. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తోంది. అయితే ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్ న‌టుడు కాదు. నిర్మాత‌. త‌న డ్యూయోట్ మూవీస్ ప‌తాకంపై కృష్ణ‌వంశీతో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు ప్ర‌కాష్ రాజ్‌. ఇందులో దిల్‌రాజు కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటారు. అంద‌రూ కొత్త వాళ్లే న‌టించే ఈ సినిమా కోసం క‌థ సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ సినిమా సంగ‌తుల్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఓ గొప్ప ద‌ర్శ‌కుడు, జాతీయ స్థాయి ఉత్తమ న‌టుడు, నిర్మాణ విలువ‌ల‌కు పేరెన్న‌ద‌గిన నిర్మాత క‌ల‌సి రూపొందించే ఈ చిత్రం ఎలా ఉంటుందో...?! ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో..??

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.