English | Telugu

నాగార్జునకు బ్లాక్‌బస్టర్‌ స్టొరీ కావాలట..!

నాగార్జున కొడుకు అఖిల్ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదుగానీ, దానికి సంబంధించిన రకరకాల వార్తలు మాత్రం బయటకు వెలువడుతూనే వున్నాయి. ప్రస్తుతం నాగార్జున వీవీ.వినాయక్ తో స్టోరీ చర్చలు జరుపుతున్నట్టు టాలీవుడ్ టాక్. అయితే కథ తనకి వంద శాతం సంతృప్తిని ఇచ్చేవరకు ఈ చిత్రాన్ని మొదలు పెట్టకూడదని నాగార్జున నిర్ణయించుకున్నారు. ఎందుకంటే జోష్‌ చిత్రంతో నాగ చైతన్యని పరిచయం చేయడం మిస్టేక్‌ నాగ్ పలుసార్లు చెప్పారు. అఖిల్ విషయంలో అలా జరగకూడదని నాగ్ కేర్ తీసుకుంటున్నారట. అందుకనే అఖిల్ మూవీ గురించి ఇంతవరకు ప్రకటన చేయలేదట. అఖిల్‌ కి మంచి బ్లాక్‌బస్టర్‌ కథ దొరికిన తరువాతే ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికోసం వినాయక్ కూడా మంచి కథను రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.