English | Telugu

సెప్టెంబర్ 26న 'గోవిందుడు..' సెన్సార్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అక్టోబర్ 1న విడుదల చేయాలని పట్టుదలతో వున్నాడు నిర్మాత బండ్ల గణేష్. దీని కోసం చిత్ర యూనిట్ సభ్యులు కూడా బాగా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరినట్లుగా తెలిసింది. రామ్ చరణ్ కూడా పగలు షూటింగ్ లో పాల్గొంటూ రాత్రి పూట డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 26న సినిమా సెన్సార్ బోర్డు ముందుకు వెళ్తుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన కుటుంబకథా చిత్రం తరహాలో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.