English | Telugu

అఖండ 2 తర్వాత సరికొత్త బాలయ్య..అభిమానుల పిలుపు మారబోతుందా!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna)తన ప్రీవియస్ మూవీ 'డాకు మహారాజ్'(Daaku Maharaaj)హిట్ ఇచ్చిన జోష్ తో తన అప్ కమింగ్ మూవీగా 'అఖండ 2' (Akhanda 2)చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను(BOyapati Srinu)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2021 లో వచ్చిన 'అఖండ' కి సీక్వెల్ కావడంతో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బోయపాటి,బాలయ్య కాంబోలో ఇప్పటి దాకా వచ్చిన మూడు సినిమాలు, ఒక దాన్ని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. దీంతో అఖండ 2 సాధించే రికార్డులపైనే అందరి కళ్ళు ఉన్నాయి. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni)చెప్పిన స్టోరీ బాలకృష్ణకి నచ్చిందని, దీంతో అఖండ 2 తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ తో చేయబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ఫ్యాక్షన్ నేపథ్యంలో వీరసింహారెడ్డి' వచ్చిన విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ యాక్షన్ అండ్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కగా, ఒక సరికొత్త బాలయ్యని అభిమానులకి పరిచయం చేసింది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లలో బాలయ్య ప్రదర్శించిన నటన నభూతో నభవిష్యత్తు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బాలయ్య, గోపీచంద్ కాంబోలో తెరకెక్కే మూవీ ఎలాంటి సబ్జెట్ తో తెరకెక్కుతుందనే ఆసక్తి అందరిలోను మొదలయ్యింది. అన్ని కుదిరితే జూన్ నుంచి షూట్ కి వెళ్లవచ్చని, 2026 సంక్రాంతికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశముందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఈ మూవీని వృద్ధి సినిమాస్ తో కలిసి మరో బడా బ్యానర్ నిర్మించనున్నట్టుగా తెలుస్తుంది. డెబ్యూ ప్రొడక్షన్ సంస్థ అయినటువంటి వృద్ధి సినిమాస్ తమ ఫస్ట్ మూవీగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో 'పెద్ది' నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో 'పెద్ది'(Peddi)ని తెరకెక్కిస్తున్నారు. దీంతో బాలయ్యతో తమ సెకండ్ ప్రాజెక్ట్ ని ఆ సంస్థ ఏ స్థాయిలో నిర్మిస్తుందో చెప్పక్కర్లేదు. గోపీచంద్ మలినేని రీసెంట్ గా హిందీలో సన్నీడియోల్ తో 'జాట్' తెరకెక్కించి భారీ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.