English | Telugu

ధురంధర్ మూవీ డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్

-ఎవరు ఆ హీరోయిన్
-ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
-రికార్డు కలెక్షన్స్


ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 'ధురంధర్'(Dhurandhar)తన ప్రభంజనాన్ని యధావిధిగా కొనసాగిస్తోంది. డిసెంబర్ 5 న సెల్యులాయిడ్ పై అడుగుపెట్టగా ఇప్పటి వరకు నాలుగువందల కోట్లకి పైగా సాధించి ఐదువందల కోట్ల మార్కుకి చేరువలో ఉంది. ప్రేక్షకులతో పోటాపోటీగా సినీ, రాజకీయ, క్రికెట్ సెలబ్రటీస్ కూడా ధురంధర్ ని వీక్షిస్తుండటంతో ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు 'ఆదిత్య దర్'(Aditya Dhar)కి సంబంధించిన పర్సనల్ న్యూస్ ఒకటి అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

ఆదిత్య దర్ భార్య ప్రముఖ హీరోయిన్ 'యామి గౌతమి'(Yami Gautam). సినిమాల్లోకి రాక ముందు అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించగా 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2011 లో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'నువ్విలా' చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయమవ్వగా, ఆ తర్వాత అల్లు శిరీష్ డెబ్యూ మూవీ 'గౌరవం', తరుణ్ తో యుద్ధం, నితిన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది. పలు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా చేసి తన సత్తా చాటగా, 2024 లో తనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్టికల్ 370 చిత్రంతో సోలో విజయాన్ని అందుకుంది. ఇక 2019 లో ఆదిత్య దర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉరి' అనే చిత్రంలో చేసిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య దర్ మొదటి మూవీ కూడా అదే. జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది.

Also read:థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన టీమిండియా క్రికెటర్లు.. ఫ్యాన్స్ హంగామా

ఈ ఏడాది ఫిబ్రవరి లో ఆదిత్య దర్ నిర్మాతగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ధూమ్ ధామ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ తో హక్ అనే సినిమాలో చెయ్యగా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య దర్ కెరీర్ విషయానికి వస్తే ఉరి తర్వాత ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి చిత్రాలకి రైటర్ గా పనిచేశారు. ఆరు సంవత్సరాల తర్వాత 'ధురంధర్' తో వచ్చి ఇండియా సినిమా తన వైపు చూసేలా చేసుకున్నాడు.



జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.