English | Telugu

ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో ఫిల్మ్.. విలన్ గా సూర్య!

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వచ్చిన మొదటి చిత్రం 'హనుమాన్' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ యూనివర్స్ లో భాగంగా 'అధీర' అనే చిత్రం రూపొందుతోంది. ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శరణ్ కొప్పి దర్శకుడు. ఆర్.కె.డి స్టూడియోస్ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి 'అధీర'తో హీరోగా గ్రాండ్ డెబ్యూ చేస్తుండగా, విలన్ గా ఎస్. జె. సూర్య కనిపించనున్నారు. (Adhira Movie)

'హనుమాన్' తరహాలోనే 'అధీర' కూడా భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో, గ్రేట్ విజువల్స్‌తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఎస్. జె. సూర్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బ్యాక్‌డ్రాప్‌లో ఒక అగ్నిపర్వతం పేలుడుతో పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. సూర్య కొమ్ములున్న కిరీటం ధరించి, రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఇదే పోస్టర్ లో హీరో కళ్యాణ్ కూడా మోడరన్ అవతార్ లో సూపర్ హీరో లుక్ లో ఉన్నాడు. ఇందులో సూర్య పాత్ర ప్రపంచాన్ని కమ్మేసే అంధకారమైతే, ఆ అంధకారాన్ని తొలగించే వెలుగుగా కళ్యాణ్ పాత్ర కనిపిస్తుంది.

హనుమాన్ ఫేమ్ శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. మరి ఈ సినిమా కూడా హనుమాన్ బాటలో పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.