English | Telugu

ఆ డైరెక్టర్ ఒంట‌రిగా ఆఫీసుకు రమ్మన్నాడు!

శుభసంకల్పం, శుభలగ్నం, మావిచిగురు ఇలా ఎన్నో క్లాసికల్ చిత్రాల్లో నటించింది ఆమని. కె విశ్వనాథ్, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ, బాపు వంటి చిత్రాలన్నింటిలో ఈమె నటించింది. ఇలాంటి దిగ్గజద‌ర్శ‌కుల‌తో పనిచేసిన ఆమని పరిశ్రమలో అగ్ర హీరోల సరసన కథానాయకగా నటించి మెప్పించింది. ఓ దశాబ్ద కాలం ఓ వెలుగు వెలిగింది. ఈమె ఇటీవల మరలా కంబ్యాక్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బాగానే అవకాశాలు అందుకుంటుంది.

టీవీ కాన్సెప్ట్ లో ఆమెని బిజీగా చేస్తున్నాయి. ఆమని కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్లో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలో సినిమా అవకాశాల కోసం నేను ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాను. అక్కడ చాలా రకాల పరిస్థితులు చూశాను. నేను బయటకు ఎక్కడికి వెళ్లినా వెంట మా అమ్మ ఉండేవారు. ఏ సినిమా ఆఫీసుకు వెళ్లిన ఆమె వచ్చేవారు. అలా అమ్మ వెంట రావడం సినీ ఆఫీసుల్లో కొందరికి నచ్చేది కాదు. అమ్మ లేకుండా ఆఫీసుకు ఒంటరిగా రమ్మన్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చేదాన్ని. ఆమె లేకుండా నేను రాను అని ఖ‌రాకండీగా చెప్పేసే దాన్ని.

ఎవరు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారనేది తెలియడానికి కొంత సమయం పట్టింది. అప్పుడే నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆయన మొదటి నుంచి సినిమాలో వైపుకు వెళ్ళద్దని చెప్పేవారు. చెల్లీ పాత్రలో కూతురు పాత్రలు ఆఫర్ చేసేవారు. ఒక సినిమాలో చెల్లెలుగా నటిస్తే అలాగే వ‌రుస‌గా అలాంటి పాత్రలే వస్తాయని తెలుసు. అందువలన హీరోయిన్‌గా కాకుండా వేరే పాత్రలు చేయనని చెప్పేదాన్ని. అలా హీరోయిన్ కావ‌డానికి రెండేళ్ల సమయం పట్టింది అని ఆమని చెప్పుకొచ్చింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.