English | Telugu

'ఆగడు' సంచలనాలు ఎలా వుండబోతున్నాయ్?

మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌ హీరోగా వచ్చిన ‘దూకుడు’ పెద్ద హిట్‌ అవడంతో, మళ్ళీ ఆ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆగడు’పై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటేశాయి. ఈ సినిమాతో మహేష్‌ ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తాడన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్.

మహేష్ ఇప్పటి వరకూ 60 కోట్ల క్లబ్‌లో చేరలేదు. అయితే ఇప్పటికే ఖాకీ డ్రస్సులో మహేష్ విసిరిన డైలాగ్ టీజర్ లు రికార్డులు క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఈజీగా 60 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది’ వసూళ్ళలో టాప్‌ ఛెయిర్‌లో వుంది. మరి దసరా పండుగ కంటే ముందుగ వస్తున్న మహేష్, 'ఆగడు' తో అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్లను కూడా దాటి టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డుల్ని తిరగరాస్తాడా? 'ఆగడు' సంచలనాలు ఎలా వుండబోతున్నాయ్? తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.