English | Telugu

మెగాహీరోతో ఆ డైరెక్ట‌ర్ మ‌ళ్లీ పెట్టుకొంటాడా?

మురుగ‌దాస్‌.... ఈ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తెలుగులో మ‌రో సినిమా తీయ‌బోతున్నాడ‌న్న‌ది టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్‌. ర‌మ‌ణ‌, గ‌జిని సినిమాల‌తో స్టార్ ద‌ర్శ‌కుడైపోయిన మురుగ‌దాస్ తొలి సారి తెలుగులో స్టాలిన్ తీశాడు. ఆ సినిమా ప‌రాజ‌యం పాలైంది. దానితో పాటు మురుగ‌దాస్‌కి కొన్ని పాఠాలు నేర్పింది. తెలుగులో చిరంజీవిలాంటి స్టార్ హీరోతో సినిమా చేయ‌డం కంటే పెద్ద పొర‌పాటు మ‌రోటి లేద‌ని అర్థ‌మైంది. ఎందుకంటారా...?? ఆ సినిమా కాన్సెప్ట్‌లో, టేకింగ్‌లో చిరు విప‌రీతంగా క‌ల‌గ‌జేసుకొన్నాడ‌ట‌. మురుగ‌దాస్ రాసుకొన్న క‌థ ఒక‌టైతే.. దానికి చిరు భారీ మార్పులూ, చేర్పులూ చేసి, మ‌ధ్య‌లో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ త‌మ తాలుకూ ప‌రిజ్ఞానం జోడించి ఆ క‌థ‌నికి కిచిడీగా మార్చేశార‌ట‌. దాంతో మురుగ‌దాస్ ఆలోచ‌న‌లు తెర‌పై రిఫ్లెక్స్ కాలేదు. ఆ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనూ మురుగ‌దాస్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు కూడా. స్టాలిన్ త‌ర‌వాత తెలుగులో సినిమా చేయ‌కూడ‌ద‌ని మురుగ‌దాస్ గ‌ట్టిగా డిసైడై.. త‌మిళంలోనూ, హిందీలోనూ సినిమాలు తీసుకొంటూ వెళ్లాడు. మ‌హేష్‌బాబు నుంచి క‌బురొచ్చినా... మురుగ‌దాస్ - నో చెప్పాడు. అలాంటిది మ‌ళ్లీ ఇంత‌కాలానికి మురుగ‌దాస్ చేతిలో ఓ తెలుగు సినిమా పెట్ట‌బోతున్నారు.

విజ‌య్ - మురుగ‌దాస్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం క‌త్తి. త‌మిళంలో విడుద‌లై... మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకొంటోంది. ఈసినిమా డ‌బ్ వెర్ష‌న్ తెలుగులో త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. డ‌బ్ కంటే.. ఈ క‌థ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని నిర్మాత‌ల భావన‌. ఎందుకంటే విజ‌య్ సినిమాలు... ప‌వ‌న్‌కి బాగా క‌లిసొచ్చాయి. త‌మిళంలో విజ‌య్ చేసిన సినిమాల్ని తెలుగులో ప‌వ‌న్ చేసి హిట్లు కొట్టాడు. దానికి తోడు ప‌వ‌న్ - మురుగ‌దాస్ కాంబినేష‌న్ అంటే.. ఆ సినిమా క్రేజ్ ఓ స్థాయిలో ఉంటుంది. అందుకే నిర్మాత ఠాగూర్ మ‌ధు ప‌వ‌న్‌ని, మురుగ‌దాస్‌నీ ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ప‌వ‌న్ సైడ్ నుంచి ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోవ‌చ్చు. కానీ మురుగ‌దాస్ మాత్రం ఒప్పుకొంటాడా అనేది అనుమానం. ఎందుకంటే... త‌న ప‌నిలో మ‌రొక‌రి జోక్యాన్ని అంగీక‌రించ‌ని ర‌కం.. మురుగ‌దాస్‌. ఆల్రెడీ అన్న‌య్య తో చేదు అనుభ‌వాన్ని చ‌విచూశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ద‌ర్శ‌కుల ప‌నిలో జోక్యం చేసుకొంటాడ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అందుకే మురుగ ఎలాంటి స్టెప్ తీసుకొంటాడ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఒక వేళ మురుగ‌దాస్ ఈ క‌థ‌ని చేయ‌డానికి ఒప్పుకొన్నా. ''నా ప‌నిలో జోక్యం చేసుకోవ‌ద్దు'' అని కండీష‌న్ పెట్టి మ‌రీ రంగంలోకి దిగే ఛాన్సుంద‌ని టాలీవుడ్ పెద్ద‌లు చెప్పుకొంటున్నారు. చూద్దాం... ఏమ‌వుతుందో...?

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.