English | Telugu

23 కి ప్రభాస్ కి సంబంధం ఏంటి!  విషయం తెలియడంతో ఫ్యాన్స్ అభినందనలు   

-ప్రభాస్ అభిమానుల శుభాకాంక్షలు
-పాన్ ఇండియా స్టార్ గా అవతరణ
-తెలుగు సినిమాకి కూడా పాన్ ఇండియా గుర్తింపు
-అప్ కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలు

రెబల్ స్టార్ గా అడుగుపెట్టిన ప్రభాస్(Prabhas)ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఒక రకంగా పాన్ ఇండియా స్టార్ గా 'ప్రభాస్' ఎదుగుదల, తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎదగడానికి కూడా దోహద పడిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అభిమాన ఘనం కూడా సినిమా సినిమాకి పెరుగుతు వస్తుంది. అందుకు కారణమైన చిత్రాల లిస్ట్ కూడా అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నాయి.

ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి నేటితో ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది. ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ నవంబర్ 11 2002 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. అంటే నేటికీ 23 సంవత్సరాలు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టర్ హల్ చల్ చేస్తుంది. సదరు పోస్టర్ లో 23 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కి శుభాకాంక్షలు. ప్రతి సినిమా మూమెంట్ ఒక మెమొరీ. నీ కంటు ఒక ఎరా సృష్టించుకున్నావంటు అనే పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

also read: చికిరి సాంగ్ పై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు

అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు 'ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీటిల్లో దిరాజాసాబ్(The Raja Saab)సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఫౌజీ(Fouji)చిత్రీకరణ దశలో ఉండగా స్పిరిట్(Spirit)త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.