English | Telugu

అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?

స్వయంకృషితో ఎదిగిన టాలీవుడ్ స్టార్స్ లో మాస్ మహారాజా రవితేజ(RaviTeja) ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాప్ స్టార్స్ కి పోటీగా కలెక్ట్ చేసేవి. అలాంటి రవితేజ, ఇప్పుడు వెనకబడిపోయారు. వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. కొన్ని సినిమాలు రూ.10 కోట్ల షేర్ రాబట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో అసలు రవితేజకి ఏమైంది? ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి? అనే చర్చ జరుగుతోంది.

రవితేజ అంటే యాక్షన్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు. కామెడీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ తో.. ఫుల్ మీల్స్ లా ఆయన సినిమాలు ఉండేవి. మధ్య మధ్యలో ప్రయోగాలు చేసి ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ.. యాక్షన్ ఎంటర్టైనర్స్ తో అదిరిపోయే కమర్షియల్ సక్సెస్ లు చూసేవారు. కానీ, ఇప్పుడు ఆ సక్సెస్ లు ఆయనను పెద్దగా పలకరించడం మానేశాయి.

ఎలాంటి సినిమాలు చేయాలి? అనేది ఇప్పుడు రవితేజకు పెద్దగా క్వశ్చన్ మార్క్ లా అయిపోయింది. ప్రయోగాలు చేస్తే.. ఇలాంటి సినిమాలు వద్దు, వింటేజ్ రవితేజను గుర్తుచేసే ఎంటర్టైనర్స్ కావాలని అభిమానులు కోరుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తే.. ఇంకెంత కాలం ఇవే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, అవే హీరోయిన్ తో స్టెప్పులు.. కొత్త తరహా సినిమాలు చేయమని అంటున్నారు. దీంతో సినిమాల ఎంపికలో రవితేజ తడబడుతున్నారని అర్థమవుతోంది.

Also Read: గ్లోబ్ ట్రాటర్.. సౌండ్ లేకుండా వచ్చిన సాంగ్.. రెస్పాన్స్ ఎలా ఉంది?

ఇటీవల 'మాస్ జాతర'తో నిరాశపరిచిన రవితేజ.. 2026 సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. కొందరు ఇది కూడా రెగ్యులర్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. మెజారిటీ ఆడియన్స్ మాత్రం గ్లింప్స్ బాగుందని, సంక్రాంతికి కరెక్ట్ సినిమా అని, ఇలాంటి సినిమాలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. (Bhartha Mahasayulaku Wignyapthi)

నిజానికి ఆడియన్స్ ని మెప్పించాలంటే జానర్ ముఖ్యం కాదు. ఏ జానర్ అయినా కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. రవితేజ నటించిన క్రాక్, మాస్ జాతర సినిమాలనే గమనిస్తే.. రెండూ యాక్షన్ ఎంటెర్టైనర్సే. కానీ, కంటెంట్ పరంగా క్రాక్ మెప్పించింది. అంటే రవితేజ ఎలాంటి సినిమా చేసినా.. కంటెంట్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇదే ఇప్పుడు కొందరు అభిమానులు రవితేజకు సూచిస్తున్నారు. చూద్దాం మరి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తోనైనా రవితేజ హిట్ ట్రాక్ లోకి వస్తారేమో.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.