Read more!

English | Telugu

ముఖ్యమంత్రిగా బాలకృష్ణ!

‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘వీరసింహారెడ్డి’  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య 50 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. మరోవైపు హీరో రాజశేఖర్‌ను ఈ చిత్రంలోని మెయిన్ విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. 

కాగా ’గీతా గోవిందం, సర్కారు వారి పాట’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుశురామ్ బాలకృష్ణతో ఓ చిత్రానికి తీయబోతున్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ సీఎం గా కనిపించబోతున్నాడట. బాలయ్య క్యారెక్టర్‌ను కూడా డైరెక్టర్ పరుశురామ్ చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారట. ఇంతవరకు ఎప్పుడూ చూడని బాలకృష్ణను పరుశురామ్ ఈ చిత్రంలో చూపించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక బాలకృష్ణ ఒక పక్క మూవీస్‌తో పాటు మరో పక్క ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్‌ షోకి హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.