Read more!

English | Telugu

నాన్నగారి కోసం ఆ పని చేస్తా - నాగార్జున

నాగార్జున నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మనం మూవీ గ్రాండ్ సక్సెస్ ని అందుకున్న శుభతరుణంలో ఆయన ఒక షాకింగ్ వార్త అందించబోతున్నాడు. మనం సినిమా సీక్వేల్ తీయాలనే ప్రయత్నాల్లో నాగార్జున ఉన్నారని తెలుస్తోంది. మనం  సినిమా సక్సెస్ అవుతుందని నాగార్జున ముందే ఊహించాడు. కానీ ముగిసిన వీకెండ్ తో అమెరికాలోనూ, ఇక్కడా ‘మనం’ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి. విశ్లేషకుల ప్రకారం ఈ మూవీ ఇప్పటికే అమెరికాలో దాదాపు 4 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా. ఈ సినిమా అక్కినేని కుటుంబ వర్గాలు నటించిన అన్ని చిత్రాలలో బిగ్గెస్ట్  హిట్ గా నిలవబోతోందని విశ్లేషిస్తున్నారు.


ఇదిలా ఉండగా తండ్రి ఏఎన్ ఆర్ నటించిన చివరి సినిమా ఇంత సక్సెస్ కావడంతో,  దీనికి  సీక్వెల్ తీసి అప్పుడు మనం మూవీకు ఎండ్ కార్డ్ వేస్తే బాగుంటుందని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ఈ విషయం విన్న వారు  అదెలా  సాధ్యం అంటూ నాగార్జునని అడిగారట. దానిక్ ఆయన గ్రాఫిక్ సాయం తీసుకుందాం అన్నారట. సీక్వెల్ లో నాగేశ్వరరావు పాత్ర గ్రాఫిక్స్ తో నడుస్తుంది. మూవీ బడ్జెట్ కూడ భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఓకే అనుకున్నాక ఈ  విషయం గురించి నాగార్జున అఫిషియల్  గా అనౌన్స్ చేయటం ఖాయం అని  సంబంధిత వర్గాల్లో టాకు. మొత్తానికి మనం మూవీ సాధించిన సక్సెస్ కి అక్కినేని ఫ్యామిలీ అంతా సంతోషాలతో సంభరాలు చేసుకుంటుంది.