Read more!

English | Telugu

కృష్ణుడికి భార్యే దిక్కు..!

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుపొందిన కృష్ణవంశీ, గత కొన్ని సంత్సరాలుగా హిట్ కోసం పరితపిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడు'తో హిట్ కొడతానని భావించిన వంశీకి నిరాశే ఎదురయ్యింది. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చిన ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. దీంతో తన భార్య రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ థ్రిల్లర్ సినిమా డైరెక్ట్ చేసే ఆలోచనలో వున్నాడట కృష్ణవంశీ. రమ్యకృష్ణకి అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో మంచి మార్కెట్ వుండడంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రమ్యతో సినిమా చేయడంవల్ల మరో హీరో వెనుక పడాల్సిన అవసరం రాదని భావిస్తున్నారట. ఆఖరికి హిట్ కోసం పరితపిస్తున్న కృష్ణవంశీకి భార్యనే దిక్కైంది..!!