Read more!

English | Telugu

రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'ఎన్టీఆర్ 30'తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే జాన్వీ, మరో టాలీవుడ్ స్టార్ సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్.. ఆ తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో హీరోయిన్ గా జాన్వీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో నటించే బంపరాఫర్ కొట్టేసిన జాన్వీకి.. ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా నటించే అవకాశమొస్తే జాక్ పాట్ కొట్టేసినట్టే. ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకుంటున్న జాన్వీ త్వరలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోతుందేమో చూడాలి.