Read more!

English | Telugu

ముగ్గురు వద్దన్నారు .. బన్నీ సరే అన్నాడు


ముందు మహేష్ వద్దన్నాడు. తర్వాత ఎన్టీఆర్ కుదరదన్నాడు. రవితేజ కూడా వీలులేదన్నాడు. మరెందుకో కానీ అల్లు అర్జున్ సరే అన్నాడు. వీరు ముగ్గురు ఎందుకు వద్దన్నారో  అల్లు అర్జున్ దేనికి సరేనన్నాడు అంటే.... రుద్రమదేవి చిత్రంలో  గోన గన్నారెడ్డి పాత్ర గురించి. ముందు ఈ గెస్ట్ రోల్ మహేష్‌కి ఆఫర్ చేశారు. అయనకు డేట్స్ కుదరలేదో, లేక అలాంటి పాత్ర వద్దనుకున్నోరో రిజక్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ని ఈ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారు. ఆయనకు ఈ పాత్ర నచ్చి ఓకే అన్నారట. మళ్లీ ఏమయిందో ఆయన నుంచి ఆ పాత్ర రవితేజ దగ్గరకు వచ్చి ఆగింది. ఆయన చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు అలా షికారు పూర్తి కాక ముందే ఇప్పుడు ఆ పాత్ర అల్లు అర్జున్ చేస్తున్నారని మళ్లీ న్యూస్. అయితే ఈ పాత్రకి అల్లూ అర్జునే ఫైనల్ అని అనుకోవాలా అంటే, అవుననే అంటున్నారు 'రుద్రమదేవి' దర్శకుడు గుణశేఖర్. ఈ పాత్రకు కావల్సిన అన్ని అంశాలు ఉన్న హీరో అర్జున్ అని ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. క్యారెక్టర్ గురించి చెప్పగానే బన్నీ ఓకే అనేశారట. ఇది వినడానికి బాగానే వుంది. అయితే గతంలో కూడా ఈ పాత్ర గురించి విన్నప్పుడు ఆ హీరోలు కూడా ఇలాగే ఎక్సైట్ తర్వాత రిజెక్ట్ చేశారు... ఏమైనా, మిగతా వారి సంగతి ఎలా వున్నా కొత్త తరహా పాత్రలు చేయాలనే నిజంగా బన్నీ అనుకుంటే గన్నారెడ్డి క్యారెక్టర్ బెస్ట్ చాయిసే అవుతుంది.


రుద్రమదేవి టైటిల్‌తో తెరకెక్కుతున్న కాకతీయుల చరిత్ర ఈ చిత్ర కథాంశం. ప్రజల కోసం పోరాడిన గోన గన్నారెడ్డి పాత్రకు కాకతీయుల చరిత్రలో ప్రముఖ స్థానముంది. ఈ పాత్ర కోసం బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇందులో అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది. వీరికి సంబంధించిన షూటింగ్ నిర్వహణ జులైలో జరుపుతారు.
అనుష్క టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రానా, నిత్యమీనన్‌, కృష్ణంరాజు  తదితర పాత్రలు పోషిస్తున్నారు.