English | Telugu

సైఫ్‌పై దాడి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రధాన సూత్రధారి కరీనా కపూర్‌?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి కేసులో పెద్ద ట్విస్ట్‌ చోటు చేసుకుంది. దాడికి అతని భార్య కరీనా కపూర్‌ కుట్ర చేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే ఘటన జరిగిన తీరు కరీనా కపూర్‌ చెప్తున్న విషయాలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ కేసును వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ముందు కరీనా తన సిస్టర్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది కరీనా. అర్థరాత్రి దాటిన తర్వాత కరీనా ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్‌ కూడా ఉంది. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత పోలీసులకు కరీనా ఇచ్చిన సమాచారం, ఘటన జరిగిన తీరును పోల్చి చూస్తే రెండిరటికీ ఎక్కడా మ్యాచ్‌ అవ్వడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పనిమనిషిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్‌పై దాడి జరిగిందని కరీనాతోపాటు వారి పనిమనిషి కూడా చెప్తూ వచ్చారు. దాడికి ప్రయత్నించిన షరీఫుల్‌ అనే వ్యక్తిని గదిలో బంధించామని, అతను తప్పించుకొని పారిపోయాడని పోలీసులకు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కరీనా కపూర్‌తోపాటు వారి పనిమనిషిని కూడా అనుమానిస్తున్నారు. దాడి తర్వాత పోలీసులు సీన్‌ కన్‌స్ట్రక్ట్‌ చేసిన సమయంలో చెప్పిన విషయాలు, అక్కడ ఘటన జరిగిన తీరు వేర్వేరుగా ఉండడం పోలీసుల అనుమనానికి బలాన్ని చేకూరుస్తోంది. దాడి సమయంలో అక్కడ ఉన్న కరీనా, పనిమనిషి.. ఇద్దరినీ వేర్వేరుగా విచారించిన తర్వాత ఇద్దరినీ ఒకేసారి విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఘటనలో ముఖ్యంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాలు.. అత్యంత భద్రతతో కూడిన ఆ అపార్ట్‌మెంట్‌లోకి కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేసే వారి ప్రమేయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదు. ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని ఒక గదిలో బంధించామని చెబుతున్నారు. ఆ గది నుంచి అంత సులువుగా ఆ వ్యక్తి ఎలా తప్పించుకోగలిగాడు? గాయపడిన సైఫ్‌ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళే క్రమంలో ఆటోలో అతన్ని కూర్చోబెట్టి పనిమనిషితో మాట్లాడుతూ కరీనా కాలయాపన చేయడం, సైఫ్‌తోపాటు హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఏడేళ్ళ కొడుకునిచ్చి లీలావతి హాస్పిటల్‌కి పంపించడం వంటి అంశాలను పోలీసులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అలాగే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కరీనా హాస్పిటల్‌కి రాలేదు. దీన్ని మరింత కీలక అంశంగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారి కరీనా కపూరే అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.

54 ఏళ్ళ సైఫ్‌ అలీఖాన్‌ తన మొదటి సినిమా రిలీజ్‌ అవ్వక ముందే హీరోయిన్‌ అమృతాసింగ్‌ను 1991లో వివాహం చేసుకున్నారు. ప్రముఖ క్రికెట్‌ ప్లేయర్‌ మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి, ఒకప్పటి టాప్‌ హీరోయిన్‌ షర్మిలా టాగూర్‌ల కుమారుడు సైఫ్‌. సైఫ్‌, అమృతలకు సారా, ఇబ్రహీం సంతానం. 2004లో సైఫ్‌, అమృత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు కరీనా కపూర్‌తో రిలేషన్‌లో ఉన్న సైఫ్‌ 2012లో ఆమెను వివాహం చేసుకున్నారు. ఇప్పటివరకు వారికి సంబంధించి ఎలాంటి వివాదం బయటికి రాలేదు. ఇప్పుడు సైఫ్‌ దాడి జరగడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కరీనా కపూర్‌ అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తీరు తెన్నులను గమనిస్తే..  సైఫ్‌, కరీనా జీవితంలో వెలుగులోకి రాని అనేక అంశాలు ఉన్నాయనే సందేహం కలుగుతోంది.