English | Telugu
'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో జాయిన్ అయిన శిల్పా శెట్టి
Updated : Apr 23, 2022
బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకడైన రోహిత్ శెట్టి రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో శిల్పా శెట్టి నటిస్తోంది. ఈ సిరీస్తోటే ఆమె డిజిటల్ వరల్డ్లోకి అడుగుపెడుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా మెయిన్ లీడ్గా నటిస్తోన్న ఈ సిరీస్ను 8 భాగాలుగా నిర్మిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్తో నడిచే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్నది.
ఈరోజు ఏప్రిల్ 23న 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో నటిస్తోన్న శిల్పా శెట్టి ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు. 'సింగమ్', 'సింబా', 'సూర్యవంశీ' లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ తీసిన రోహిత్ శెట్టికి కూడా ఇదే తొలి వెబ్ సిరీస్. శిల్ప షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె బ్లాక్ యూనిఫామ్లో గన్ పట్టుకొని యాక్షన్ మోడ్లో ఉంది. "ఫస్ట్ టైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్పై ఫైర్ అవడానికి రెడీ అవుతున్నా. యాక్షన్ కింగ్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్లో జాయిన్ అవుతున్నందుకు సూపర్ థ్రిల్లింగ్గా ఉంది. #IndianPoliceForceOnPrime ఇప్పుడు షూటింగ్లో ఉంది. @itsrohitshetty @sidmalhotra @primevideoin @rohitshettypicturez (sic)," అని ఆమె రాసుకొచ్చింది.
రోహిత్ శెట్టి పిక్చర్స్తో కలిసి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే కాప్ డ్రామాను నిర్మిస్తున్నట్లు ఏప్రిల్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఒళ్లు జలదరింపజేసే యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుందని ఆ సంస్థ తెలిపింది.