బోస్ కు చెమటలు పట్టిస్తున్న ప్రత్యర్ధులు!

రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తాజా మాజి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మొదట కొంత సానుకూల వాతావరణం కనిపించినప్పటికి తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వై.ఎస్.ఆర్. కాంగెస్ పార్టీలోని ముఖ్య నాయకులే ఆయనకు పెద్దగా సహకరించడం లేదు. దీనికి తోడు ఆయన ప్రదాన ప్రత్యర్ధులు అనూహ్యంగా పుంజుకుని ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గత రెండు రోజులుగాఎ.పి లగడపాటి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలతో పాటు ప్రముఖులు ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసిన నేపధ్యంలో ఆ పార్టీ గౌరవాధ్యక్షులురాలు, జగన్ తల్లి విజయమ్మ ప్రచార భాద్యతలను తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ అరెస్ట్ కు నిరసనగా చేపట్టిన బంద్ కు ప్రజల నుండి స్పందన కరవవటంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకుని తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. విజయమ్మపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తూ చేసిన ప్రచారాన్నికి, పర్యటనలకు విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఎ.పి.లగడపాటి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలు జగన్ అవినీతిని ఎండగట్టారు.     కాంగ్రెస్ అభ్యర్ధి తోటకు అనుకూల, ప్రతికూల అంశాలు: జగన్ ను సిబిఐ అరెస్ట్ చేయటం, వైఎస్సార్ కాంగెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ ప్రచార భాద్యతలను తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించటం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందిగా మారినా కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఎం.పి లగడపాటి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణల పర్యటన కాంగ్రెస్ కు బలాన్నిచ్చింది. రెడ్డి సామాజికవర్గ ఓట్లు నియోజకవర్గ పరిధిలో పెద్దగా లేవు. చేనేత, దళిత వర్గాలు ఇప్పటికే తోటకు మద్దతు ప్రకటించింది. మత్స్యకారులను సముదాయించేందుకు పార్టీకి చెందిన మత్స్యకార నాయకులు నియోజకవర్గ పరిధిలో పర్యటించాలి. కె గంగవరంలో ఉన్న 7వేల మత్స్యకార ఓట్లు చీలిపోకుండా చూస్తే ఆ మేరకు లబ్ది చేకూరుతుంది.   కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులురాలు, జగన్ తల్లి విజయమ్మను కలిసి సంఘీభావం ప్రకటించినా ఆయన ప్రభావం పెద్దగా ఉండదు. అంతే కాక ఎ.పి లగడపాటి, పిసిసి బొత్సా సత్యనారాయణలు ప్రధానంగా టి.డి.పి అభ్యర్ధి చిక్కాల రామచంద్రరావుకు పట్టున్న కాజూలూరు మండలంలోని దళితపేటల్ల్లో ప్రచారాన్ని నిర్వహించటం అనుకూలాంశమే ..కె.గంగవరంలో ఉన సుమారు 8వేల కమ్మ వర్గానికి చెందిన ఓట్లు 42 వేల వరకు ఉండటంతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నియోజకవర్గ పర్యటనకు ప్రాధ్యాన్యత ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న క్యాడర్ లోపాలు కాంగ్రెస్ కు అనుకూలాం శాలే.   వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి బోస్ కు అనుకూల, ప్రతికూల అంశాలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన తల్లి విజయమ్మ ప్రచారాన్ని రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. అయినా క్యాడర్ లోపాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. శెట్టి బలిజ వర్గానికి చెందిన ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితమిస్తుండటం బోస్ కు ప్రతికూలాంశంగా మారింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్రకటించినా భోస్ కు వచ్చేలాభమేమీ ఉండదు.   శెట్టిబలిజ వర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టాబాయి, కాపు వర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పోలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ ప్రచారంపై ఆసక్తి చూపకపోవటం ప్రతికూలాంశం. మంత్రి మోపిదేవి అరెస్ట్ సంఘటనను అవకాశంగా తీసుకొని బోస్ మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉన్న కె.గంగవరంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.   టి.డి.పి అభ్యర్థి చిక్కాలకు ప్రస్తుతమున్న అనుకూల, ప్రతికూల అంశాలు : చిక్కాల రామచంద్రారావు ప్రచారం తొలినాళ్ళలో ముందున్న ఇటీవల కాలంలో కొంత వెనుకబడ్డారు. ముందున్న ఊపు తర్వాత తగ్గినట్లు కన్పిస్తుంది, తొలినుండి టిడిపి అభ్యర్ధి చిక్కాల రామచంద్రారావు నియోజకవర్గంతో ఉన్న టిడిపి ఓట్ బ్యాంక్ పైనే దృష్టి సారించారు. టిడిపి టిక్కెట్ ఆశించిన గుత్తుల సూర్యనారాయణ స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉండటంతో పార్టీ ఓట్లు చీలుతాయని భావించారు. అనూహ్యంగా గుత్తుల ప్రచారంలో వెనుకబడటం చిక్కాలకు లభ్ది చేకూర్చేదే. 10వేల కమ్మ వర్గం ఓట్లు టి.డి.పికి అధిక సంఖ్యలో పడేలా, ముఖ్యంగా కె.గంగవరం పరిధిలో ఉన్న 7వేల కమ్మ ఓట్లపై దృష్టి కేంద్రీకరిస్తుంది. టిడిపి ఓట్ బ్యాంక్, పార్టీకి చెందిన, తన సామాజిక ఓట్ బ్యాంక్ పైనే చిక్కాల ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.    

న్యాయమూర్తులపై ఆరోపణలు కొత్తకాదు !

ఈ వ్యాఖ్యాలను నూటికి నూరుసార్లు నిజమని హైదరాబాద్ కు చెందిన సిబిఐ న్యాయమూర్తి పట్టాభిరామారావు రుజువు చేశారు. ఆదర్శంగా వుండవలసిన న్యాయవవస్థలో కూడా అవినీతి చోటు చేసుకోవడం బాధాకరమే అయినా న్యాయమూర్తులు అవినీతి ఆరోపణలకు గురికావడం కొత్త విషయం కాదు ఈ వ్యాఖ్యాలను నూటికి నూరుసార్లు నిజమని హైదరాబాద్ కు చెందిన సిబిఐ న్యాయమూర్తి పట్టాభిరామారావు రుజువు చేశారు. ఆదర్శంగా వుండవలసిన న్యాయవవస్థలో కూడా అవినీతి చోటు చేసుకోవడం బాధాకరమే అయినా న్యాయమూర్తులు అవినీతి ఆరోపణలకు గురికావడం కొత్త విషయం కాదు. ప్రజాస్వామ్యంలో సుప్రీమ్ కోర్టుకు అత్యున్నత స్థానం వుంది. అటువంటి ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసినవారిపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. శ్రీమతి ఇందిరాగాంధి 1984 ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చిన జస్టిస్ రంగానాథ్ మిశ్రా, కొబ్బరినూనె దిగుమతి చేసుకోవడంలో నిబంధనలు పాటించని ఒక కంపెనీకి ఎక్సైజ్ శాఖ విధించిన అయిదు కోట్ల రూపాయల జరిమానాను తగ్గించిన కేసులో జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్, 1997లో బోపాల్ గ్యాస్ బాధితులకు సంబంధించిన నష్టపరిహారం విషయంలో జష్టిస్ ఎ.ఎం.ఆహ్మాది, 1998లో కోర్టు వెలుపల జరిగిన ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకొని కేసును నీరుగార్చిన విషయంలో జస్టిస్ ఎం.ఎం.పుంచి, జమ్ము- కాశ్మీరులో ఒక హోటల్ కు సంబంధించిన కేసు విషయంలో జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్, సీలింగ్ భూముల కేసుల విషయంలో జస్టిస్ వై.కె.సబర్ వాల్ లు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలకు గురైన కర్నాటక హైకోర్టుకు చెందిన ప్రధాన న్యాయమూర్తిని ఇంపిచ్ మెంట్ చేయడానికి రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆ న్యాయమూర్తి రాజీనామా చేసి ఇంపించ్ మెంట్ నుంచి తప్పించుకొన్నారు. ఇటువంటి ఉదాహరణలు చాలానే వున్నాయి.

రివర్స్ అవుతున్న విజయమ్మ ఎత్తుగడ !

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై అనుమానం వ్యక్తం చేయడం ద్వారా లభ్ది పొందాలన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎత్తుగడ రివర్స్ అవుతోంది. జగన్ అరెస్టు అనంతరం ప్రచార బాధ్యతలు చేపట్టిన ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తన ప్రచారం ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావిస్తున్నారు. మొదట "జగన్ ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు?" అని ప్రశ్నించడం ద్వారా ప్రచారం ప్రారంభించారు. అయితే దీనికి అంతగా ప్రజలలో స్పందన కనిపించలేదు. దాంతో "తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక అనేక అనుమానాలు వున్నాయని, సమగ్రంగా దర్యాప్తు జరపలేదు" అని రెండో అంశాన్ని ముందు తెచ్చారు. అయితే వైఎస్ మరణించిన సమయంలో "వాతారణం బాగా లేదని చెప్పినా వినకుండా హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారని" ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలే ఆమెకు నేడు అడ్డుగా నిలుస్తున్నాయి. విజయమ్మ మాటమార్చడం, నాడు కనీసం శవం ఇంటికి రాకుండానే జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం శాసన సభ్యుల సంతకాలు సేకరించడం గుర్తుచేసుకొంటుంటే అసలు పదవి కోసం జగన్, విజయమ్మలే హత్యకు కుట్ర చేశారని కాంగ్రెస్ నేతలు ప్రతిదాడికి దిగారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారానికి, విజయమ్మ మీడియాలో మాట్లాడిన మాటలు రుజువుగా మిగలడంతో వైకాపా నేతలకు కనీసం కౌంటర్ చేసుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో విజయమ్మ తాజా వైఎస్ మరణం అనుమానాస్పదంగా జరిగిందని వ్యాఖ్యానించానేగాని, మరణానికి ఎవరో కారణమని చెప్పలేదనే రీతిలో వివరణ ఇచ్చుకొంటున్నారు.

ప్రత్తిపాడులో పెదరత్తయ్యపై కాంగ్రెస్ కన్ను!

తెలుగుదేశం కంచు కోటగా పిలుచుకునే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కీలకఘట్టాలకు కాంగ్రెస్ నేతలు తెర లేపారు. నూతన సమీకరణలతో విజయావకాశాలను మార్చుకోవచ్చన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నియోజకవర్గ పెద్ద మాకినేని పెదరత్తయ్యపై దృష్టి సారించారు. రత్తయ్యతో చర్చలు జరుపుతున్నారు. కానీ, ఆయన స్పందన ఇంకా వెలువడలేదు. పెదరత్తయ్యను ఎలాగైనా తీసుకువస్తే చాలని ఎంపి రాయపాటి సాంబశివరావు పట్టుబడుతున్నారని తెలిసింది. పెదరత్తయ్య కొంతకాలం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ పోకడలు నచ్చక ఆయన రాజీనామా చేసి చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే స్థానిక నేతలు అభ్యంతరం చెప్పడంతో ఆయన తెలుగుదేశం పార్టీ గూటిలో చేరలేకపోయారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉన్న పెదరత్తయ్య వస్తే కాంగ్రెస్ కు మంచి లాభం జరుగుతుందని జిల్లా పార్టీ కూడా భావించి ఆయనతో చర్చలు జరుపుతోంది. రోజూ పలకరింపులతో ఆయన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో రాటుదేలిన పెదరత్తయ్య తన మనస్సులో ఉన్న మాట చెప్పకుండా కాంగ్రెస్ నేతలను ఊరిస్తూనే కాలం గడిపేస్తున్నారు.

ఆరేళ్లలో 65 ఉప ఎన్నికలా?

ఒక్కసారి ఎన్నికైన ప్రభుత్వం ఐదేళ్ళ పాటు అధికారంలో ఉండాలి. ప్రజా ప్రతినిధులు కూడా ఎన్నికైన ఐదేళ్ళ పాటు ప్రజలకు సేవచేయాలి. కాని మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఎన్నికైన శాసన సభ్యులు చిన్నచిన్న సాకులతో రాజీనామాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఈ ఆరేళ్లలో 65 ఉప ఎన్నికలు జరిగాయి. ఇది ఆల్ టైం రికార్డు. ప్రభుత్వాన్ని కుల్చాలనుకున్నా రాజీనామానే, తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండు కోసమూ రాజీనామానే, ఎవరిపై అలిగినా రాజీనామానే, పార్టీలు మారితేనూ రామీనామానే మన ప్రతినిధులు అస్త్రంగా వాడుతున్నారు. దీని పర్యావసానం ఎన్నికల ఖర్చు తడిసి మోపడవుతోంది. ఆ భారాన్ని ప్రజలు పన్నుల రూపంలో భరించాల్సి వస్తోంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ గా ఉండి చివరికి ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఐదేళ్ల పాటు స్థిరంగా అభివృద్ధి చూపలేని ప్రతినిధులు మనకు అవసరమా అని ఓటరు ఆలోచించాల్సి వస్తోంది. రాష్ట్ర శాసన సభాపతి నాదేండ్ల మనోహర్ తన పదవీకాలం ఏడాది పూర్తయినందున సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల తంతు గురించి విశదీకరించారు. పతినిధులు అన్నవారు నియోజకవర్గ ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన కూడా ఆకాంక్షించారు.

ఉప ఎన్నికల వ్యయం రూ. 200కోట్లా?

రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలు జూన్ 12న జగరనున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి వరకూ అందిన అంచనాల ప్రకారం దాదాపుగా రూ.200కోట్లు ఈ ఎన్నికల్లో ఖర్చు అవుతోంది. ఇసి ఎంత అదుపు చేసినా డబ్బు ప్రవాహ పెరిగిందని సమాచారం. గతంలో ఓటుకు వంద, యాభై ఇచ్చేవారు. ఇప్పుడు అది కాస్తా వెయ్యి, బాగా ఖరీదైన ఓట్లయితే ఐదువేలు కూడా అవుతోంది. అభ్యర్థులు ఈ ఖర్చుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. అన్ని ప్రధానపార్టీలూ ఓట్ల కొనుగోలు దందాలో పాలు పంచుకుంటున్నాయని తెలుస్తోంది. ఎక్కడైతే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారో ఆ నియోజకవర్గంలో కనీసం పది కోట్ల రూపాయలు ఇతర పార్టీలు ఖర్చు చేస్తున్నాయట. ఈ విధంగా రాష్ట్రంలోని 18అసెంబ్లీ నియోజకవర్గాల్లో 180కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఒక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాత్రం 20కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటి దాకా 27కోట్ల పైచికలు లెక్కలో రాని డబ్బు స్వాదీన పర్చుకున్నారు. ఒకవైపు పోలీసులనూ, ఆదాయపన్ను శాఖను చెక్ పోస్టుల్లో ఈ నల్లధనం వైపు దృష్టి సారించేలా చేసి మరో మార్గంలో పార్టీలు డబ్బు తెప్పించుకున్నాయని తెలుస్తోంది. ఇలా రహస్యమార్గంలో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయాక మిగిలిన పార్టీల వారి డబ్బు గురించి పోలీసులకు అభ్యర్థులే నేరుగా ఫిర్యాదు చేసి మరీ పట్టిస్తున్నారట. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయపార్టీలు ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ డబ్బుతో విజయానికి దారీ చేసుకుంటున్నారట. 60శాతం పార్టీల సహకారంతోనూ, 40శాతం సొంతడబ్బుతోనూ ఈ ఎన్నికలను అభ్యర్థులు ఎదుర్కొంటున్నారట. వై.కా.పా. అభ్యర్థులకు క్రిష్టియన్ ఓటు బ్యాంకు ఏర్పడిందీ మిషనరీల డబ్బుతోనే అన్న విషయం పాఠకులకు తెలిసిందే. కాంగ్రెస్, టిడిపి, వై.కా.పా., బిజెపి, టిఆర్ ఎస్ వంటి పార్టీలన్నింటిపైనా ఈ డబ్బు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ భన్వర్ లాల్ మాత్రం తమ యంత్రాంగం పటిష్టంగా ఉన్నందున ఓట్ల కొనుగోలు అసాధ్యమని అంటున్నారు. ఇదెంత వరకూ నిజమో భవిష్యత్తులోనే తేలుతుంది.

పరకాలలో విజయమ్మకు ప్రతిఘటన తప్పదా ?

పరకాల అసెంబ్లీ ఎన్నికలు తాజామాజీ, వై.కా.పా. అభ్యర్థి కొండాసురేఖ ఆత్మరక్షణలో పడ్డారు. మానుకోట ఘటనలో టిఆర్ ఎస్ కార్యకర్తలపై విసిరిన రాళ్లను సేకరించి కొండాసురేఖను తెలంగాణా వ్యతిరేకిగా చిత్రీకరించి ఊరూ వాడా ప్రచారం చేశారు. టిఆర్ ఎస్ ప్రచారాన్ని తట్టుకోలేక ఆత్మరక్షణలో పడ్డ సురేఖ తన తరుపున ప్రచారానికి వచ్చే వై.కా.పా. గౌరవాధ్యక్షరాలు విజయమ్మను తెలంగాణా వాదుల ముందు నిలబెట్టడంలో విజయవంతమవుతారా? లేక విఫలమవుతారా? అన్న సందేహాలు నియోజకవర్గంలో ఎక్కువయ్యాయి. టిఆర్ ఎస్, బిజెపి అభ్యర్థుల ప్రకటన ముందు వరకూ సురేఖకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉందని అంచనాలు వినిపించాయి. తీరా! ఇప్పుడు చూస్తే ఆ అంచనాలు తప్పని అనిపిస్తోంది. తెలంగాణా వ్యతిరేకిగా సురేఖపై టిఆర్ ఎస్ చేసిన గ్లోబల్ ప్రచారం ఆమెకున్న ఓటుబ్యాంకును దెబ్బతీసింది. దీంతో ఓటర్లను కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తున్న ఆమెకు విజయమ్మ రూపంలో మరో సవాల్ ఎదురవుతోంది. గతంలో రాళ్లతో స్వాగతం పలికిన తెలంగాణా వాదులు ఈసారి మనస్సు మార్చుకుంటారా? నంద్యాలలో తన భర్త వైఎస్ ప్రకటించినట్లు వీసా, పాస్ పోర్టులతో తెలంగాణాకు రావాలా అని విజయమ్మ కూడా ప్రశ్నిస్తారా? లేక తెలంగాణా వాదానికి మద్దతు ఇస్తారా? ఈ రెండింటిలో ఏ ఒక్కవైపు సురేఖను, మరోవైపు విజయమ్మను సవాల్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఆత్మరక్షణ రాజకీయం అవలంబించి జగన్ పై సానుభూతి కోసం ప్రయత్నిస్తే ఏమైనా ఫలితముంటుందా? తెలంగాణా వాదులు ఇప్పటికే 8న విజయమ్మను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై రీహార్సల్స్ చేస్తున్నారు. ప్రత్యేకించి టిఆర్ ఎస్ విజయమ్మను నిలదీసేందుకు సిద్ధంగా ఉంది.

మద్యం సిండికేట్ వ్యాపారుల ఇళ్లపై ఎసిబి దాడులు

మద్యం సిండికేట్ వ్యాపారులపై ఎసిబి కొరడా ఝులిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి ఆకస్మాత్తుగా పలు జిల్లాలలో మద్యం వ్యాపారులపై దాడులు చేసిన ఎసిబి పలువురుని తమ అదుపులోకి తీసుకుంది.మెదక్ జిల్లా మద్యం వ్యాపారి కరుణాకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకొని అతనిని హైదరాబాదుకు తరలించింది. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరిని మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోదాడలో మద్యం సిండికేటు కార్యాలయం అకౌంటెంట్ నాగేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని కూడా హైదరాబాదుకు తరలించారు. మెదక్‌లో అదుపులోకి తీసుకున్న కరుణాకర్ రెడ్డికి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో బినామీ పేర్ల మీద మద్యం షాపులు ఉన్నట్లుగా ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది.     మద్యం సిండికేట్ వ్యాపారులపై ఎసిబి కొరడా ఝులిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి ఆకస్మాత్తుగా పలు జిల్లాలలో మద్యం వ్యాపారులపై దాడులు చేసిన ఎసిబి పలువురుని తమ అదుపులోకి తీసుకుంది.మెదక్ జిల్లా మద్యం వ్యాపారి కరుణాకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకొని అతనిని హైదరాబాదుకు తరలించింది. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరిని మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోదాడలో మద్యం సిండికేటు కార్యాలయం అకౌంటెంట్ నాగేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని కూడా హైదరాబాదుకు తరలించారు. మెదక్‌లో అదుపులోకి తీసుకున్న కరుణాకర్ రెడ్డికి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో బినామీ పేర్ల మీద మద్యం షాపులు ఉన్నట్లుగా ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల పందేల్లో క్రికెట్ బుకీలు?

దేశవ్యాప్తంగా ఐపిఎల్ క్రికెట్ ముగిశాక ఖాళీగా ఉన్న క్రికెట్ బుకీలు ఎన్నికల పందేల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తెలుగు రాకపోయినా సరే! వెబ్ సైట్ ను ఇంగ్లీషులో ఉంచటంతో దాన్ని వినియోగించుకోవటంలో రాటుదేలిన బుకీలు పందెం విలువను పెంచేస్తున్నారు. రాష్ట్రంలోని 18అసెంబ్లీ, ఒక పార్లమెంటరీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ లో పెట్టిన తరువాత పందెం కాసేవారిని మెజార్టీ ఓట్ల ఆధారంగా పందెం ఉండాలని బుకీలు సూచిస్తున్నారట. ఓటుకు (కనీసం రూపాయి) విలువ కట్టి మరీ పందెంలో పాల్గొనాలని బుకీలు కోరుతున్నారట. ఇలా బుకీలు ఎన్నికల పందేల్లో బెట్టింగులకు దిగి వెబ్ సైట్ రూపురేఖలను, పందెం విధానాలను శాసిస్తున్నారు. పైగా పందెం కూడా కోట్లలోకి పరుగులు తీస్తోందట. ఇప్పటిదాకా పల్లెటూర్ల నుంచి పెద్దగా పాల్గొనలేదని నిఘావర్గాలు భావిస్తుంటే బుకీలు కాలుమోపాక పల్లెల నుంచి లక్షలు, కోట్లు పందెం సొమ్ముగా వెచ్చించారని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ బుకీలు క్రికెట్ ను వదిలి మరో రంగం వైపు దృష్టి సారించటం మాత్రం ఇదే ప్రథమమని పోలీసులు అంటున్నారు.

ఫలిస్తున్న బాబు బుజ్జగింపులు, ఆగిన వలసలు!

తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాసయాదవ్ తన మనస్సు మార్చుకుని టిడిపిలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. సిబిఐ వై.కా.పా. అధినేత జగన్ ను అరెస్టు చేశాక ఇటీవల కాలంలో రాజకీయ వలసల గురించే చర్చ రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం తన పార్టీలోని ఏ ఒక్కరినీ వదులుకోకుడదని నేతలను బుజ్జగించటమే ప్రధానపనిగా పెట్టుకున్నారు. ఒకవైపు ఉప ఎన్నికల ప్రచారం ఆపకుండానే మరోవైపు తమ పార్టీ నుంచి వలసలకు ఆయాన బ్రేక్ వేస్తున్నారు. ముందు వై.కా.పా.కు అనుకూలంగా ప్రకటన చేసిన తలసాని ఆ తరువాత కాంగ్రెస్ వైపు చూశారు. ఆ రెండు పార్టీలూ ఆహ్వానించలేదో, చంద్రబాబు బుజ్జగింపు పనిచేసిందో కానీ, శ్రీనివాసయాదవ్ తెలుగుదేశంలోనే కొనసాగుతామన్నారు. తమ నాయకుడు చంద్రబాబు మంచి దక్షత ఉన్నవాడని, ఆయన దగ్గర ఉంటే ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చని తలసాని కితాబిచ్చారంటే బాబు బుజ్జగింపు ఎంతలా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.

రాయపాటికి నాడు మసాజ్ లు, నేడు మెసేజ్ లు

గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావుకు ఇటీవల సెక్స్ రాకెట్ లో అరెస్టు అయి తరువాత బెయిల్ తీసుకున్న తారాచౌదరితో ఉన్నది నిజమైన సంబంధమేనా అన్న విషయంపై నేడు రాష్ట్రవ్యాప్త చర్చ జరుగుతోంది. నిప్పులేకుండా పొగరాదు అన్న చందాన్న ఇటీవల రాయపాటికి ఒక ఎస్ ఎంఎస్ వచ్చింది. దాని సారాంశమేమిటంటే తారాచౌదరితో ఉన్న ఫోటోల సిడి ఇస్తామని, తనను సంప్రదించి కోరినది ఇస్తే అవి సొంతం చేసుకోవచ్చని ఆ ఎస్ ఎంఎస్ లో వివరించారు. ఈ ఎస్ ఎంఎస్ వచ్చిన వెంటనే 60ఏళ్ల రాయపాటి ముందూ వెనుకా ఆలోచించకుండా పోలీస్ స్టేషనుకు వెళ్లి ఆ ఎస్ ఎంఎస్ చూపించి దర్యాప్తు చేయమన్నారు. తీరా! స్టేషన్ బయటకు వచ్చిన తరువాత రాయపాటి తనకూ, ఆ ఎస్ ఎంఎస్ ఇచ్చిన వ్యక్తికి మాత్రమే తెలిసిన విషయాన్ని పోలీసుల ద్వారా లోకానికి తెలియజేశానని అర్థమైంది. నాలిక్కరుచుకున్న రాయపాటి, తారా రహస్య సంబంధం నిజమేనట అక్కడ ఆయన బాడీ మసాజ్ లు కూడా చేయించుకున్నారట...అందుకే ఎస్ ఎంఎస్ కూడా వచ్చిందట అని రాష్ట్రమంతా గుసగుసలాడుకుంటున్నారు. ఎవరు ఫోను చేసినా మీకు ఆ సిడి అందేసిందా? పోలీసులు ఏమైనా ఆ ఎస్ ఎంఎస్ ఇచ్చిన అతన్ని పట్టుకున్నారా? అని పరోక్షంగా రాయపాటి తారాచౌదరి గురించి ప్రశ్నిస్తున్నారట. ఇప్పటి వరకూ మంత్రి పదవి రాకపోయినా బాధపడని రాయపాటి ఇక ఫోను వచ్చిందంటే చాలు తలపట్టుకుంటున్నారట.

అంతరిక్ష౦లో కనువిందు చేస్తున్నశుక్రయానం

అంతరిక్ష౦లో బుధవారం శుక్రయానం కనువిందు కలిగిస్తోంది. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే శుక్రయానం మొదలైంది. ఎర్రటి సూర్యుడిపై నల్లటి తిలకం మాదిరిగా శుక్ర గ్రహం ప్రయాణిస్తోంది. సూర్యుడి మీదుగా శుక్ర గ్రహం ప్రయాణిస్తున్న దృశ్యాల్ని చూసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ అపూర్వ క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఆకాశ అద్భుతాన్ని వీక్షించేందుకు చాలా ప్రాంతాల్లో టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. ఖగోళ శాస్త్రవేత్తలు శుక్ర గ్రహ కదిలిక ద్వారా పర్యావరణంలో కలుగుతున్న మార్పులపై అధ్యయనం చేయనున్నారు. అయితే ఈ అద్భుతాన్ని నేరుగా కళ్లతో వీక్షించరాదు. మళ్లీ 105 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం దర్శనమివ్వనుంది.

రసవత్తరంగా మారిన రాయచోటి రాజకీయం

కడపజిల్లా రాయచోటీలో త్రిముఖపోటీ నెలకొంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంప్రసాదరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, వైఎస్ ఆర్ సి అభ్యర్థిగా తాజామాజీ గడికోట శ్రీకాంతరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా ప్రజాసంబంధాలున్న అభ్యర్థులు కావటంతో పోటీ గట్టిగా ఉంటుందని పరిశీలకులు అంచనావేస్తున్నారు. వైఎస్ కుటుంబ సన్నిహితుడైన శ్రీకాంతరెడ్డి 2009లో తెలుగుదేశం అభ్యర్థి పాలకొండరాయుడు పై గెలుపొందారు. ఇప్పుడు పాలకొండరాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం తరపున ఈసారి రంగంలో ఉన్నారు. అయితే శ్రీకాంతరెడ్డి 2005లో క్రియాశీలకకార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి యూత్ కాంగెస్ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. ఈయన జన్మస్థలం రామాపురం మండలంలోని సుద్దమల. మాజీ ఎమ్మెల్యే గండికోట మోహనరెడ్డి వారసునిగా శ్రీకాంతరెడ్డి ఈ ఎన్నికల్లో వై.కా.పా. తరుపున బలమైన ప్రచారాన్ని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుబ్రమణ్యం తన తండ్రి పాలకొండ రాయుడు రాజకీయచతరుత, సోదరుని సహాయంతో రంగంలోకి దిగారు. చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంపై దృష్టి సారించటంతో తన గెలుపు నల్లేరుపై నడక అన్న భావన ఈయన ప్రచారంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈయన తండ్రి రాయడు 30 ఏళ్లుగా టిడిపికి సేవలందించారు. బాలసుబ్రహ్మణ్యం జెడ్ పిటిసిగాను, జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ గాను పనిచేశారు. బలిజకులస్తుల ఓటు బ్యాంకు 15వేలు, యాదవ,వడ్డెర, దూదేకుల, క్షత్రియ, వైశ్య ఓట్లు ఈయనకు అనుకూలమని అంచనా వేస్తున్నారు.       పాలకొండరాయుడుకు కమ్మ, మాదిగ సామాజికవర్గాల్లో అభిమానులున్నారు. సుబ్రహ్మణ్యం సోదరుడు ప్రసాద్ కూ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. చివరిగా కాంగ్రెస్ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఈయన తండ్రి నాగిరెడ్డికి రాజకీయ వారసునిగా తెరపైకి వచ్చారు. 2004లో కాంగ్రెస్ టిక్కెట్టు కోసం విఫలయత్నం చేసిన రాంప్రసాద్ రెడ్డి కుటుంబానికి సిఎం కిరణ్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. కిరణ్ తండ్రి అమరనాథ్ రెడ్డికి, నాగిరెడ్డికి సాన్నిహిత్యం ఉంది. పాకనాటి వర్గానికి చెందిన రాంప్రసాద్ రెడ్డి రామాపురం, కంచేపల్లి. చిన్నమండెం గ్రామాల్లో బంధువులున్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కూడా రాంప్రసాదరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. ఇక్కడ మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ కు మళ్లించేందుకు మంత్రి ఆహ్మతుల్లా పర్యటిస్తున్నారు. ప్రచారంలోనూ, బలంలోనూ పోటాపోటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపెవరిని వరిస్తుందో అన్నది మాత్రం తెరపై చూడాలి.

జగన్ పై కక్ష సాధిస్తున్నారా?

వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో మంత్రులను బలిపశువులుగా చూసేందుకూ కాంగ్రెస్ పార్టీ వెనుకాడటం లేదు. ఈ కుట్ర వల్ల తాము నియోజకవర్గాల చులకన అవటమే కాకుండా పార్టీని వదిలేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మంత్రులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులకు తమను బలిచేయడం ఎంత వరకూ సబబమని మంత్రులు ఆయన్ని నిలదీశారు. అంతేకాకుండా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన నాయకులే తమను బలిపశువులను చేస్తే భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రారని వారు స్పష్టం చేశారు. తమ విషయంలో కాంగ్రెస్ పార్టీ బలిపశువులను చేయాలనే నిశ్చయించుకుంటే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఆజాద్ కు హెచ్చరించారు. వై.ఎస్. హయాంలో ఢిల్లీలోని కొందరు పెద్దలకు కూడా పెద్ద ఎత్తన ముడుపులు అందాయన్న విషయం అందరికి తెలిసిందేనని మరి వీరిని ఎందుకు వదిలేసి తమనే టార్గెట్ చేస్తున్నారని వారు ఆగ్రహంతో ప్రశ్నించినట్లు తెలిసింది. వై.ఎస్. హయాంలో ఆజాద్ కు కూడా ముడుపులు అందాయనే ప్రచారం జరిగింది. జగన్ పై కక్షతో పార్టీ అధిష్టానం ఆయనను ఇబ్బందులకు గురిచేయడమే గాక తమను కూడా ఇబ్బందులు పెడుతోందని, త్వరలో మరి కొందరు మంత్రులను సిబిఐ అరెస్ట్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు తమను కలవర పెడుతున్నాయని మంత్రులు ఆజాద్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మీడియాలో పచ్చి అబద్దాలు, పత్రికల్లో పిచ్చి పిచ్చి వార్తలు

వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డిని సిబిఐ ప్రత్యేక గదుల్లో విచారిస్తోంది. అక్కడికి మీడియాకు అనుమతి లేదు. దీంతో పాత్రికేయులు రహస్య సమాచారాన్ని నమ్ముకుంటున్నారు. తమకున్న న్యూస్ సోర్స్ ను నమ్మి రాసేవార్తల్లో పస ఉండడం లేదని పలుపరిశీలనల్లో తేలింది. విచారణ గురించి ఒక్కోపత్రిక, ఒక్కో న్యూస్ ఛానల్ ఒక్కోరకంగా ప్రచారం చేస్తోంది. సరైన సమాచారం తెలుసుకోవటం కోసం మీడియా ఎన్ని కసరత్తులు చేసినా న్యూస్ సోర్స్ సరిగ్గా లేక పాత్రికేయమిత్రులు తమ వార్తల్లో తప్పుడు సమాచారాన్ని పాఠకులకు, వీక్షకులుకు అందజేస్తున్నారు. మీడియా ముందు సిబిఐ చెప్పిన విషయాలు, కోర్టులో జరిగిన సంగతులు, జగన్ చెప్పే మాటలు మాత్రం అన్ని పత్రికల్లోనూ మ్యాచ్ అవుతున్నాయి. కానీ, విచారణ వార్తల్లో మాత్రం పెట్టే శీర్షికకు, వచ్చే అర్థానికీ కూడా తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సిబిఐ ముందు పెదవి విప్పలేదన్న శీర్షికతో ఓ పత్రిక రాసిన వార్తల్లో జగన్ అన్ని గుట్లూ విప్పేందుకు ముందుకు వచ్చారని సమాచారం అని రాశారు. అంటే జగన్ మౌనంగా లేరనే అర్థం వస్తోంది. ఇలాంటి వైరుధ్యాల వల్ల మీడియాపై నమ్మకం కోల్పోవడం సిబిఐ తన విచారణలో జరిగిన విషయాల్లో కొన్నింటినైనా మీడియాకు ముందుకు తెస్తే వార్త విశ్వజనీనతను కాపాడినట్లవుతుందని పాత్రికేయ సీనియర్లు ఆ సంస్థకు సూచిస్తున్నారు. అలాగే మీడియా ఇలా పొంతన లేని పిచ్చి పిచ్చి వార్తలు ఇస్తే ప్రజలు యేవగించుకునే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఉప ఎన్నికల తరువాత జెసికి మంత్రి పదవి?

ఉప ఎన్నికల తరువాత సిఎం కిరణ్ సర్కారులో మంత్రి పదవుల మార్పు ఉంటుందా? అదీ వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులైన మంత్రులకు పదవులు ఊడతాయా? కొత్త మంత్రులు కొలువుతీరుతారా? దీనిలో మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశముందా? అన్న పలు ప్రశ్నలకు జెసి తడుముకోకుండా తనకు మాత్రం మంత్రి పదవి రావటం ఖాయమంటున్నారు. ఇటీవల కొంత కాలం అలిగి అమెరికా వెళ్లిపోయిన జెసి తిరిగి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదేంటీ మీరొచ్చేశారు అని ప్రశ్నించటం పాపం! జెసి తనకు త్వరలో మంత్రి పదవి ఇస్తారు కాబట్టే తిరిగొచ్చానంటున్నారు. జగన్ ను వ్యతిరేకించే నేతగా ఈయనకు కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చింది. నెలన్నర క్రితం అనంతపురం కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యత్వం కూడా వద్దన్న జెసి ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రి శైలజానాధ్, ఎంపి అనంతవెంకటరామయ్య, అనంత కాంగ్రెస్ అభ్యర్థి ముర్షీదాబేగంలతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే నాయకులతో ఈ ప్రచారం ఏమిటని ఆశ్చర్యపోతుంటే వీరు ముగ్గురూ కూడా ఎంతో సఖ్యతగా ఉన్నట్లు ఫోజులిచ్చారు. ఈ ఫోజుల తరువాతే జెసి తన మంత్రి పదవి స్టోరీ విప్పారు. దీనికి నేతలు అదంతా వట్టేదే ఇది జెసి స్టైలు మాత్రమే అని సమాధానమిస్తున్నారు.

రామ!రామ! ఈ కోటయ్య మళ్లీ మారుతారా?

నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఏది చేసినా వార్తే అయ్యే పరిస్థితి నెలకొంది. సాక్షాత్తూ చంద్రబాబే ఈయన్ని తెలుగుదేశం పార్టీలో ఉండిపొమ్మన్నారు. అక్కడ అలాగేనన్న రామకోటయ్య తాజాగా చిరంజీవిని కలిశారు. దీంతో ఆయన వై.కా.పా. వైపు కాదు కాంగ్రెస్ లో చేరుతానని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తనకు ఉన్న పాత పరిచయం వల్లే చిరంజీవిని కలిశానని, తాను కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ను మాత్రం కలవలేదని రామకోటయ్య స్పష్టం చేశారు. మీరు కాంగ్రెస్ లోకి వచ్చేశారా అన్న ప్రశ్నకు మాత్రం నవ్వుతూ దాటేశారు. అంటే మళ్లీ కోటయ్య తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కు వచ్చేస్తున్నారా? అన్న అనుమానాలకు తావు ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈయనకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నాయి.