తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణకు సర్వం సిద్ధం

ప్రత్యేక   రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన  జయ జయహే తెలంగాణ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను సిద్ధం చేశారు.  ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీని ఎంఎం కీరవాణి సమకూర్చారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. స్వయంగా గీత రచయత అందెశ్రీ కోరితేనే తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీ కూర్చే బాధ్యతను కీరవాణికి అప్పగించామని రేవంత్ చెప్పారు.  కాగా  బుధవారం (మే29)  ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి, ఆయన గాన బృందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు కలిశారు. కీరవాణి స్వరపరిచిన పాటను విన్నారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంది. దాని ఔన్నత్యం ఏమాత్రం దెబ్బతినకుండా ప్రతిఒక్కరూ సులువుగా ఆలపించేలా కీరవాణి ఆయన బృందం పాటను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు, గీత రచయిత అందెశ్రీ, ప్రొఫెసర్ కోదండరామ్‌ తదితరులు కూడా ఈ గీతాన్ని విన్నారు.  

గొడవలు చేయండి, రెచ్చిపోండి.. కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల పిలుపు!?

పద్ధతి పాడూ అక్కర్లేదు, తప్పు ఒప్పులతో పని లేదు. వైసీపీకి తన ప్రయోజనాలు నెరవేరితే చాలు. రాష్ట్రం, జనం సంగతి పట్టదు. ఐదేళ్ల పాటు ఇష్టారీతిగా, అడ్డగోలుగా అక్రమ మార్గాలలో రాష్ట్రాన్ని పాలించిన జగన్ సర్కార్.. ఇప్పుడు పోలింగ్ తరువాత అధికారం అందని ద్రాక్ష అన్న సంగతి తేలిపోయింది. నక్క కూడా అందని ద్రాక్ష పుల్లన అని భావించి వెళ్లిపపోతుంది. కానీ తమకు అందని దానిని కూడా అందుకుని పెత్తనం చెలాయించాలని చూస్తోంది వైసీపీ. అందు కోసం నిబంధనలను తుంగలోకి తొక్కి దౌర్జన్యాలు, దాడులను ఆశ్రయించడానికి కూడా వెనుకాడటం లేదు. కౌంటింగ్ కేంద్రాలలో రూల్స్ విని కూర్చోవడం కాదు, గందరగోళం సృష్టించి రభస చేయండంటూ బాహాటంగానే పార్టీ ఏజెంట్లకు పిపులు నిస్తోంది. రూల్స్ మాట్లాడే వాళ్లు అసలు రావలసిన అవసరం లేదు. గందరగోళం సృష్టించి, వాదనలతో ఉద్రిక్తతలు నెలకొనేలా చేయగలిగే వారే ఏజెంట్లుగా కూర్చోండి అంటూ సకల శాఖల మంత్రిగా చెలామణి అయిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు బోధించారు. కాదు కాదు ఆదేశించారు.  ఎన్నికల ప్రక్రియ ఆరంభం నుంచీ మన ఆగడాలు సాగకుండా ఈసీ వ్యవహరించింది. ఇది చాలా అన్యాయం. ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మనను ఈసీ నియంత్రించడం అన్యాయం. ఆ అన్యాయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. అందుకు అవసరమైతే పోలింగ్ రోజున పల్నాడులో జరిగిన హింసాకాండ వంటిది రగల్చడానికైనా వెనుకాడవద్దన్నది ఆయన పోలింగ్ ఏజెంట్లతో జరిపిన సమావేశంలో చేసిన ప్రసంగ సారాంశం.   ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని కౌంటింగ్ లో  గందరగోళం జరుగుతుందని   చెప్పేశారు. ఆ గందరగోళం ఎలా సృష్టించాలో సజ్జల ఏజెంట్లతో మీటింగ్ పెట్టి మరీ ఉద్బోధించారు.  మళ్లీ అధికారంలోకి వైసీపీయే వస్తుందన్న నమ్మకంతో తెలుగుదేశం ఏజెంట్లను అడ్డుకోండి అని పిలుపునివ్వడం చూస్తుంటే.. కౌంటింగ్ సజావుగా, సక్రమంగా జరగకుండా అడ్డుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తున్నదన్న సంగతి ఇట్టే అవగతమౌతోంది.  

టీడీపీ శ్రేణులకు శుభవార్త.. కొడాలి నాని కోలుకున్నాడు!

అనారోగ్యంతో మంచాన పడిన కొడాలి నానికి ఏమీ కాకూడదని, అతను కోలుకోవాలని రాష్ట్ర వ్యా్ప్తంగా టీడీపీ శ్రేణులు భగవంతుణ్ణి కోరుకున్నాయి. ఎందుకంటే, పొరపాటున కొడాలి నానికి ఏమైనా అయితే, అతను చేసిన తప్పుల నుంచి శిక్ష అనుభవించకుండా తప్పించుకుంటాడు. అందుకే అతనికేమీ కాకూడదని రాష్ట్రమంతటా ప్రార్థనలే ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఫలించాయి. కొడాలి నాని కోలుకున్నాడు. జూన్ 4న ఓటమిని చవిచూడటానికి సిద్ధంగా వున్నాడు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చాడు. ఇక్కడకి నోటి దురద సమ్రాట్ వల్లభనేని వంశీ కూడా వచ్చాడు. ఈ ఇద్దరూ దండుపాళ్యం బ్యాచ్ మెంబర్లు పక్కపక్కనే కూర్చున్నారు. వల్లభనేని వంశీ కుమార్తె అరంగేట్రం సందర్భంగా ఈ ఇద్దరూ ఇక్కడ కలిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే వల్లభనేని అమెరికా నుంచి వచ్చాడు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ అమెరికా పారిపోతాడని సమాచారం. కౌంటింగ్ సందర్భంగా కూడా ఆయన రాష్ట్రంలో ఉండే అవకాశం లేదని ప్రస్తుతానికి ఉన్న సమాచారం. ఈ ఫొటోలో వున్న నాని సర్వీసు మొత్తం అయిపోయినట్టుగా ఫేస్ పెట్టుకుని వుంటే, వల్లభనేని వంశీ... నా బతుకు ఇలా అయిపోయిందేంటి దేవుడా అన్నట్టుగా ముఖం పెట్టుకుని వున్నాడు. 

నో రూల్స్.. రెచ్చిపోండి: సజ్జల దిశానిర్దేశం!

వైసీపీ నాయకులలో ఓటమి భయం అలా ఇలా లేదు.. పోలింగ్ సందర్భంలోనే ఓడిపోతామని క్లారిటీ వచ్చేసినా, కౌంటింగ్ సందర్భంగా ఏదైనా జిమ్మిక్కులు చేస్తే గెలుస్తామని ప్రయత్నాలు ప్రారంభించారు. కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు ఎలా రెచ్చిపోవాలో వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బోధిస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా నో రూల్స్.. రెచ్చిపోండి అని ఆయన కార్యకర్తలను రెచ్చగొట్టారు. కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘నో రూల్స్.. కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లు తిరగబడండి. ఈసీని కూడా లెక్కచేయాల్సిన అవసరం లేదు. తిరగబడే ధైర్యం వున్న ఏజెంట్లనే సెలెక్ట్ చేయండి. ఈసీ చెప్పే రూల్స్.కి తలాడించే ఏజెంట్లను పెట్టొద్దు. తిరగబడి గొడవచేసే గట్టి ఏజెంట్లను కౌంటింగ్ సెంటర్లలో నియమించాలి. తెలుగుదేశం, జనసేన ఏజెంట్లను ఎదిరించేలా వైసీపీ ఏజెంట్లు ఉండాలి. ఆ పార్టీలను అసలు లెక్క చేయాల్సిన అవసరమే లేదు. కౌంటింగ్ సెంటర్లలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం.  మీ వెంట మేమున్నాం’’ అని సజ్జల పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారు. ఇలా రెచ్చగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

 కవిత పాత్రపై ఈడీ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు 

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జిషీట్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జిషీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేసిన దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్‌లను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ అనుబంధ ఛార్జిషీట్‌లో అన్ని వివరాలు వెల్లడించారు. మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరిందో ఇందులో ఈడీ పేర్కొంది

రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ 

హిందుత్వ వాదాన్ని బలపరిచే గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఐసిస్ తీవ్రవాదుల నుంచి మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు.   తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని... తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు.ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని... కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు.తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను రాజాసింగ్ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రధాని మోదీ, పీఎంవో ఇండియా, అమిత్ షా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ సీఎంవోలను ఆయన ట్యాగ్ చేశారు.

పవన్ విజయం ఖాయం.. ఆస్తి మొత్తం బెట్టింగ్ ఎవరైనా రెడీయా.. ఎస్వీఎస్సెన్ వర్మ

ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ సీట్లలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో కూటమి మద్దతుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటలో ఉన్నారు. గత ఎన్నికలలో ఆయన భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ సారి మాత్రం విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గ ఫలితంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  అదే సమయంలో పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా జగన్ పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఆయన సలహా సూచనల మేరకు పవన్ వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజే లక్ష్యంగా ముంద్రగడ పద్మనాభం వంటి నేతలు తమ శక్తికి మించి పని చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాత తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఎస్వీఎస్సెన్ వర్మ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్ గా బరిలోకి దిగడానికి సైతం సిద్ధ పడ్డారు. అదే సమయంలో ఆయనను తమ గూటికి చేర్చుకునేందుకు వైసీపీ శతథా ప్రయత్నాలు కూడా చేసింది. అయితే ఎస్వీఎస్సెన్ వర్మను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడిన తరువాత అంతా సర్దుకుంది. చంద్రబాబుతో భేటీ అయిన తరువాత నుంచి పవన్ కల్యాణ్ విజయం కోసం ఎస్వీఎస్సెన్ వర్మ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ప్రచార భారాన్నంతా భుజాన వేసుకుని మోశారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే స్వయంగా అంగీకరించారు. మే 13న పోలింగ్ పూర్తయిన తరువాత పవన్ ప్రత్యేకంగా ఎస్వీఎస్సెన్ వర్మకు కృతజ్ణతలు తెలిపారు.  పోలింగ్ పూర్తయిన తరువాత పిఠాపురంలో పవన్ విజయంపై కాకుండా మెజారిటీపై పందేలు సాగుతున్నాయంటే.. ఆక్కడ ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఇట్టే అర్ధమైపోతుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తాజాగా పిఠాపురంలో 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశలు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఇలా ఉండగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై పందెం కాయడానికి ఎస్వీఎస్సెన్ వర్మ ముందుకు వచ్చారు. పిఠాపురంలో పవన్ విజయంపై తన ఆస్తి మొత్తాన్ని పందెం ఒడ్డుతానని పందె కాయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని సవాల్ చేశారు.   ఆ సవాలే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయంపై వర్మకు ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ఆ సవాలే పవన్ విజయం తథ్యమని చాటుతోంది.  

తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం మాయం?

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది.  తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణ అవతరణ పదో వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సమాయత్తమౌతోంది.  తెలంగాణ రాష్ట్ర గీతానికి కొత్త బాణీ సహా, కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా రూపొందిస్తున్నారు. అవతరణ వేడుకలకు సంబంధించి ప్రతి విషయాన్నీ, ప్రతి అంశాన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.   ఇప్పటికే రాష్ట్ర గీతానికి కీరవాణి బాణీ కట్టారు. దానిని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించి బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి బానీ సమకూర్చడంపై విమర్శలు గుప్పించి జనంలో బీఆర్ఎస్ పలుచన అయ్యింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంత మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులకు పెద్ద పీట వేసిందో, ఎంత మంది ఆంధ్రా ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింతో మర్చిపోయిందా అంటూ జనం బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర అధికార చిహ్నాన్ని కూడా కొత్తగా రూపొందించాలని రేవంత్ నిర్ణయించారు. దీంతో రాష్ట్ర అధికారిక చిహ్నాం ఎలా ఉండబోతోందన్న దానిపై ప్రజలలో ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు కొత్త అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం మాయం కాబోతోంది.  మధ్యలో పూర్ణకుంభం పై భాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్ బొమ్మ పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు  తెలంగాణ మ్యాప్, కింది భాగంలో హుస్సేస్ సాగర్‌లోని బుద్ధుడి బొమ్మ అంటాయి. రాచరిక హిహ్నాలు రాష్ట్ర అధికారిక ముద్రలో ఉండొద్దని రేవంత్ భావిస్తున్నారనీ, అందుకే కాకతీయ తోరణం ఉండే అవకాశం లేదని అంటున్నారు. 

సాహితీ నిర్మాణ సంస్థపై జెసీ దివాకర్ రెడ్డి కేసు 

జెసీ దివాకర్ రెడ్డి అంటే పాపులారిటీ ఉన్న నేత. రాయలసీమలో జెసి పేరు చెబితే గజగజ వణికే పరిస్థితి ఉంది. అయితే జెసి సంతకాన్నే ఓ నిర్మాణ సంస్థ ఫోర్జరీ చేసింది. దీంతో జెసీ పోలీస్ స్టేషన్  గడప ఎక్కారు. హైదరాబాద్ కు చెందిన సాహితి నిర్మాణ సంస్థపై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లో తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను తారుమారు చేశారని, తన సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సాహితి నిర్మాణ సంస్థ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం..జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 62లో ఉన్న తన ఇంటిని జేసీ దివాకర్ రెడ్డి గతంలో సాహితి నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఈమేరకు 2020లో సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణతో మూడేళ్ల కాల పరిమితితో ఒప్పందం కుదుర్చుకున్నారు.  2023 మే నెలతో ఒప్పంద గడువు ముగియడంతో ఇల్లు ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా లక్ష్మీనారాయణ స్పందించలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తమకు లీజు గడువు ఇంకా ఉందంటూ లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సాత్విక్‌ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు జేసీకి సమన్లు పంపింది. సాహితి నిర్మాణ సంస్థ యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన జేసీ.. వాటిలో ఒప్పందం తేదీ 2021 మే నెలగా మార్చినట్లు గుర్తించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను తయారుచేసినట్లు ఆరోపించారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఏపీలో ఫలితాల వెల్లడిలో జాప్యం తప్పదా? పోస్టల్ బ్యాలెట్లే కారణమా?

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బ్యాలెట్ ఓట్ల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగాభారీగా  జరిగింది.  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్  పోలింగ్ జరిగింది. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా, ఆర్వో సీల్ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ తెలుగుదేశం కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వారి వినతికి సానుకూలంగా స్పందించిన ఈసీ,  ఆర్వో సంతకం, సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని ఆదేశాలిచ్చింది.   ఆర్వో సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఎన్డీఏ నేతల విజ్ఞప్తి తర్వాత ఈసీ నిబంధనలు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్‌పై అభ్యంతరం తెలిపారు.  గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని, ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని వైసీపీ అంటోంది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తోంది. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని, ఈ నిబంధనలపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని చెబుతోంది.  సాధారణంగా ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఈవీఎం కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, కంట్రోల్ యూనిట్ లెక్కింపునకు 30 నిమిషాల సమయం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను వేర్వేరుగా లెక్కించినా ఫలితాలు లెక్కింపు వేగంగా చేపట్టడం అంత సులువు కాదు. అధికారుల లెక్కల ప్రకారం ఈవీఎంలు ఒక్కో రౌండు లెక్కించడానికి సగటున 25 నిమషాల సమయం పట్టవచ్చు.  ఒక్కో నియోజకవర్గం ఈవీఎంల లెక్కింపునకు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం భోజన విరామం ఒక గంట సమయం తీసివేస్తే సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కంట్రోల్ యూనిట్ల లెక్కింపు జరుగుతుంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు మరో రెండు నుంచి మూడు గంటలు సమయం పడితే రాత్రి 11 గంటలకు కూడా లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు లేవు. కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉండడంతో వాటిలో చివరి రౌండు ముగిసే వరకు ఫలితం తేలని పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేసి తుది ఫలితాలు రావడానికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది.   

జూన్ 4 జాతీయ సెలవుదినం.. నటుడు నరేష్ డిమాండ్

సార్వత్రిక ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి వ్యక్తమౌతోంది. బాధ్యతగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం మేండటరీ అని చెబుతూ ప్రభుత్వం పోలింగ్ రోజున సెలవు ప్రకటిస్తోంది. కానీ బాధ్యతగా ఓటేసిన వారికి ఫలితాలు వెంటవెంటనే తెలుసుకునే హక్కును హరిస్తూ ఆ రోజు సెలవు ప్రకటించకుండా పని దినమేనని చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు నరేష్ ఓ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన జూన్ 4 ఓట్ల లెక్కింపు రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన ట్వీట్ వెంటనే వైరల్ గా మారింది. లక్షల సంఖ్యలో లైక్ లు షేర్లు చేస్తున్నారు నెటిజనులు.  లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలలో ఓటు వినియోగంపై చైతన్యం తీసుకురావడానికి ఓట్ల లెక్కింపు రోజును సెలవుదినంగా ప్రకటించడం ఎంతగానో దోహదపడుతుందని నరేష్ పేర్కొన్నారు.  

ఎసిబి కస్టడీలో ఎసిపి ఉమమహేశ్వరరావు 

అవినీతిని కూకటి వేళ్లతో పీకి వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అవినీతి చేపలను ఏరివేసే పనిలో నిమగ్నమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును బుధవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని తమ కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, పది రోజుల కస్టడీ కోరగా.. మూడు రోజులు మాత్రమే కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఏసీపీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా, జైలు నుంచి ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

వైద్య పరీక్షలు చేయించుకోండి.. లేకపోతే పోతారు!

ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వడానికి ఇంకా వారం రోజుల సమయం వుంది. ఈలోపు వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు.. వీళ్ళందరూ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని ఒకటి వుంది.. అదేంటంటే, అర్జెంటుగా హెల్త్ పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా బీపీకి సంబంధించిన సమస్యలు గానీ, గుండెలో ఏదైనా ప్రాబ్లం గానీ వుంటే, అర్జెంటుగా ట్రీట్‌మెంట్ మొదలుపెట్టేసుకోవాలి. ఎందుకంటే, జూన్ 4న వెల్లడయ్యే ఫలితాలు వాళ్ళకి బీపీ భారీగా పెంచే అవకాశం వుంది. హార్ట్ ఎటాక్‌లు ఎటాక్ అయ్యే ఛాన్సుంది. అధికారం, పదవులు పోతే పోయాయి.. కనీసం ప్రాణాలన్నా మిగలాలి కదా..  బతికుండే బలుసాకు తిని బతకొచ్చు.  నిజానికి ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని, ఎలాంటి షాక్ తగిలినా భరించడానికి మానసికంగా సిద్ధంగా వున్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళయితే అటు శారీరకంగా సిద్ధంగా లేరు.. మానసికంగానూ సిద్ధంగా లేరు. ఆయన త్వరగా కోలుకుని మంచం దిగాలని ఆశిద్దాం. కాబట్టి, ఇలా తెలివైన నాయకుల మాదిరిగా కాకుండా, ఇప్పటి వరకు వైద్య పరీక్షలు చేయించుకోనివాళ్ళు ఎవరైనా వుంటే అర్జెంటుగా ఆ పనేదో పూర్తి చేసుకుంటే ప్రాణాలు దక్కి, ఫ్యామిలీకి మిగులుతారు.

జగన్ ‘పులి’ వెందుల గట్టెక్కేనా?

సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలిపోతుంది. వైసీపీ మరో సారి అధికారపగ్గాలు అందుకుంటుందా? లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠకు వచ్చే నెల 4న తెరపడుతుంది. ఈ లోగా ఎవరి అంచాలు వారివి. ఎవరి గెలుపు ధీమా వారిది. అయితే పరిశీలకులు, సెఫాలజిస్టులు మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అన్నదానిపై ఎవరి అంచనాలు వారు వెల్లడించారు.  వాటన్నిటిలోనూ పులివెందుల నియోజకవర్గం విషయంలో సెఫాలజిస్టుల అంచనాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి. పులివెందుల అంటే జగన్ అడ్డా. ఆయన సొంత నియోజకవర్గం. అటువంటి పులివెందులలో జగన్ కు ఈ సారి అంత వీజీగా విజయం లభించే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన పులివెందుల గట్టెక్కినా నామమాత్రం మెజారిటీయే వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సారి పులివెందుల నియోజకవర్గంలో పోలింగ్ భారీగా జరిగింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిథిలోకి వచ్చే ఈ నియోజకవర్గంపై షర్మిల ప్రచారం ప్రభావం తీవ్రంగా పడిందని అంటున్నారు. ఆ కారణంగా వైసీపీ ఓట్లలో భారీ చీలిక వచ్చిందనీ, దీంతో తెలుగుదేశం లబ్ధి పొందిందనీ విశ్లేషణలు చేస్తున్నారు. పులివెందుల నుంచి ఇంత వరకూ జగన్ భారీ మెజారిటీలతో గెలిచారు. రాష్ట్రంలోనే జగన్ మెజారిటీ టాప్ గా ఉండేది. అయితే ఈ సారి మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు. విజయం సాధిస్తే మెజారిటీ చాలా స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. అంటే జగన్ పులివెందుల నుంచి గట్టెక్కినా అత్తెసరు మార్కులతోనే అని చెబుతున్నారు. మరో వైపు ఈ సారి పులివెందుల కోటను బద్దలు కొట్టేశామని తెలుగుదేశం వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. పోలింగ్ రోజు సాయంత్రమే పులివెందుల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసేసుకున్నాయి. ఈ నేపథ్యంలో  పులివెందుల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. 

వచ్చే మూడు రోజులూ తెలంగాణ అగ్నిగుండమే!

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాలులు వీస్తాయని పేర్కొంది. అయితే నైరుతి రుతుపవనాలు మాత్రం సరైన సమయానికే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 

ఇది పుస్తకం కాదు.. పాపాల పుట్ట!

మనం చాలాసార్లు ఒక ప్రకటన చూసి వుంటాం.. అందులో నటుడు రంగనాథ్ అంటూ వుంటారు... ‘ఇది పంపు కాదు.. పాతాళ గంగ’ అని.. మాచర్ల ఎమ్మెల్యే హోదాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాల మీద ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో ఒక పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం చదివినవాళ్ళు ఎవరైనా ఆందోళనతో నోరు తెరుస్తారు.. ‘ఇది పుస్తకం కాదు.. పాపాల పుట్ట’ అని పెద్దగా అరుస్తారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఆయన చేసిన హత్యలు, అన్ని వర్గాల వారి మీద చేసిన దాడులు, కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు... వీటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. పిన్నెల్లి బాహాటంగా చేసిన ఘోరాలలో కొన్నిటిని మాత్రమే ఈ పుస్తకంలో పబ్లిష్ చేశారు. లెక్కలకి అందని ఎన్నో ఘోరాలు ఈ పుస్తకంలో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఆర్థిక విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఆయన చేసిన అవినీతి విలువ రెండు వేల కోట్లకు పైగా అనే విషయం బుర్ర పేలిపోయేలా చేస్తుంది. పిన్నెల్లి చేసిన నేరాలను చాప్టర్లవారీగా విభజించారు. వాటిలో 1. గ్రానైట్ అండ్ గ్రావెల్ దోపిడీ - రూ. 1,433 కోట్లు, పిఆర్కే టాక్స్, మద్యం దోపిడీ - రూ. 4 వందల కోట్లు, భూ కబ్జాలు - 376 ఎకరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భూముల కబ్జా, ఇతరుల ఆస్తుల కబ్జాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై పిన్నెల్లి దాడులు, అక్రమ కేసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ముఠా చేసిన హత్యలు, పిన్నెల్లి పైశాచికం, పిన్నెల్లి నేర వారసత్వం.. ఇలాంటి సబ్ హెడ్డింగ్స్ కింద పిన్నెల్లి చేసిన దారుణాలన్నీ వివరంగా ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆధారాలు, పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చారు.  ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, మంచి పరిపాలన వుండాలని కోరుకునేవాళ్ళందరూ ఈ పుస్తకం తప్పక చదవాలి. అయితే పిల్లలు, వృద్ధులు, సున్నిత హృదయులు, హార్ట్ పేషెంట్లు ఈ పుస్తకానికి దూరంగా వుంటే మంచింది. ఎందుకంటే, ఈ పుస్తకంలో వున్న ఘోరాలు చదివి వాళ్ళకు ఏమైనా అయ్యే ప్రమాదం వుంది మరి!