ఘోర వైఫల్యం చెందుతామనే రాళ్ళదాడి డ్రామా.. తానేటి వనిత

రాళ్ళ దాడి జరిగిందనేది అవాస్తవం. పోలీసులు ఎంక్వయిరీ చేసినప్పుడు ఆ రాయి ఎక్కడ నుంచి వచ్చిందనేది తెలియలేదు. అసలు ఆ ప్రాంతంలో అలాంటి రాళ్ళే లేవు అని చెబుతున్నారు. కావాలని, ఘోర వైఫల్యం చెందుతామని అర్థమయ్యే, దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలన్న ఉద్దేశంతోనే ఇలా రాళ్ళు విసిరినట్టో, మరో కారణాలో ముందుకు తీసుకువచ్చి సానుభూతి పొందాలనే ప్రయత్నం జరుగుతోంది.... అని చంద్రబాబు నాయుడి మీద వైసీపీ మూకలు రాళ్ళదాడి చేసినప్పుడు హోం మంత్రి తానేటి వనిత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. మరి ఆమె చెప్పినట్టు ఇప్పుడు జగన్ కూడా సానుభూతి కోసమే రాళ్ళ దాడి చేయించుకున్నాడా?

కేంద్రం ఎంట్రీ... ఇక జగన్ అడ్డంగా దొరికిపోతాడు!

ఇది చాలా సీరియస్ మేటర్... ఎన్నికల సందర్భంగా హత్యాప్రయత్నం లాంటి ఇష్యూలు క్రియేట్ చేసే జగన్ లాంటి వాళ్ళకి సీరియస్ వార్నింగ్ లాంటి మేటర్. అప్పుడెప్పుడెప్పుడో కోడికత్తి డ్రామా, బాబాయి గొడ్డలిపోటు లాంటి డ్రామాలు ఆడి సింపతీ గెయిన్ చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు మళ్ళీ అదేరూట్లో వెళ్ళే ప్రయత్నం చేశాడు. కొండకి వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా మరోసారి ‘కోడికత్తి-2’ లాంటి డ్రామాకు తెర తీశారు. అలా డ్రామా ప్లే అవగానే ఇది హత్యా ప్రయత్నం అని సొంత మీడియా ప్రచారం ప్రారంభించింది. ఈసారి ఈ ఇష్యూ కోడికత్తి డ్రామాలాగా జగన్‌కి అనుకూలం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. మేటర్ కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ విషయం జగన్ అండ్ కంపెనీకి తెలుస్తోందో లేదోగానీ... మేటర్ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక జగన్ బ్యాచ్ జరిగే పరిణామాలు చూడ్డం తప్ప మరేమీ చేయలేరు చూస్తూ వుండండి.  ఇదేంటి.. ఇది రాష్ట్రంలో మేటర్ కదా.. కేంద్రంతో సంబంధం ఏంటి అని ఎవరైనా అంటే, వారికి అమాయక చక్రవర్తి బిరుదు ప్రదానం చేయొచ్చు. ఇప్పుడు దేశమంతా ఎన్నికల కమిషన్ చేతిలో వుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో జరిగే ఏ అంశంలో అయినా కేంద్రం సులభంగా ఎంటరైపోవచ్చు. ఆల్రెడీ జగన్ రాయి డ్రామా మీద కేంద్ర ఎన్నికల సంఘం ఆరా ప్రారంభించేసింది. ఈ ఘటన గురించి వివరాలు కోరింది. అక్కడతో ఆగకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి పర్యటనతో లింకు కలిపింది. మొన్నీమధ్య చిలకలూరిపేటకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యానికి, ఈ అంశానికి లింకు వేసింది. ‘వీఐపీల పర్యటనల సందర్భంగా భద్రతా వైఫల్యాలు’ అనే ఒకే అంశం కిందకి ఈ రెండు అంశాలను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర పోలీసుల  మీద బోలెడన్ని ప్రశ్నలను సంధించిన ఈసీ ఇప్పటికే ఐజీ, ఎస్సై మీద బదిలీ వేటు వేసింది. ఇప్పుడు జగన్ ‘షో’లో ‘భద్రతా వైఫల్యం’ విషయంలో కూడా పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం వుంది. ఇది ఇక్కడితో ఆగేట్టు లేదు. దీనిమీద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది. 20 మంది అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ల డేటా కూడా టాస్క్ ఫోర్స్ చేతికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ విచారణలో అసలు విషయాలు నిగ్గు తేలతాయి. జగన్ అండ్ కో డ్రామా బయటపడటం ఖాయం.  జగన్‌కి గులకరాయి తగలగానే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వెంటనే ‘అర్రెర్రె’ అని ట్వీట్ చేశాడంటే అర్థం నీ మీద సానుభూతితో కాదు మిస్టర్ జగన్.. ఈ విషయంలో నేను ఎంటరైపోతున్నా అని... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు?

ఈసారి ఎవరు మర్డర్ కానున్నారో!?

గత ఎన్నికల సందర్భంగా కోడికత్తి  హత్యాయత్నం, బాబాయ్ వివేకా  గుండెపోటు గొడ్డలి మర్డర్  విజయవంతంగా జరిపించుకోవడం ద్వారా జనంలో సానుభూతి సంపాదించి జగన్ ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కారు. జగనన్న అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే జనానికి అసలు విషయం అర్థమైపోయింది. కోడికత్తి ఎటాక్ సొంత ప్లానింగేనేని, బాబాయ్ మర్డర్ అబ్బాయ్ ఆధ్వర్యంలోనే జరిగిందని అందరూ తెలుసుకున్నారు. ప్రజలకు తమ గురించి పూర్తిగా తెలిసిపోయిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా జగన్ తయారయ్యాడు. అప్పట్లోలా ఇప్పుడు కూడా  హత్యాయత్నం  నాటకాలు ఆడితే జనం నమ్మరని తెలిసి కూడా మళ్ళీ ఇంకోసారి గులకరాయి హత్యాయత్నం నాటకం ఆడిన జగన్ నిజంగానే గుండెలు తీసిన బంటే. నవ్వుకుందురు గాక.. నాకేటి సిగ్గు అన్నట్టు ఈసారి ఎన్నికలప్పుడు కూడా మరోసారి మర్డర్ ఎటెంప్ట్ నాటకానికి జగన్ తెర తీశారు. ఇక సొంత మీడియా, పేటీయం పిశాచాలు తమ నాయకుడి మీద హత్యాయత్నం జరిగిందంటూ, దానికి కారణం చంద్రబాబేనంటూ భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ నాటకాలు చూసి జనం ఛీ కొడతారన్న మినిమమ్ సిగ్గు లేకుండా జగన్ అండ్ కో వ్యవహరిస్తోంది. గులకరాయి మర్డర్ అటెంప్ట్ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు ఇంకో సందేహం ఏర్పడుతోంది. అప్పట్లో కోడికత్తి ఇన్సిడెంట్ తర్వాత బాబాయ్ గుండెపోటు గొడ్డలి మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు గులకరాయి మర్డర్ అటెంప్ట్ ఇన్సిడెంట్ తర్వాత జగన్ బంధువర్గం లేదా జగన్ మిత్రవర్గంలో ఎవరైనా మర్డర్ అయ్యే ప్రమాదం వుందేమోనని రాజకీయ పరిశీలకులకు అనుమానిస్తున్నారు. నిస్సిగ్గుగా గులకరాయి మర్డర్ అటెప్ట్.ని ప్లాన్ చేసిన జగన్ ఇంకోసారి బాబాయి మర్డర్ తరహాలో మరో మర్డర్‌కి ప్లాన్ చేసి, దాన్ని చంద్రబాబు మీద నెట్టడన్న నమ్మకమేమీ లేదని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.

బాబాయి ఒక్కసారికే.. అబ్బాయ్ మాత్రం రెండుసార్లయినా..

మొత్తానికి జగన్ ప్రాణం గట్టిదే. ఆ మాటకొస్తే వైఎస్ కుటుంబంలోని చాలామంది ప్రాణాల కంటే గట్టిదే. ఎందుకంటే జగన్ తాత రాజారెడ్డి, వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒకే ఒక్క గాలివానకి చచ్చినట్టు ఒకే ఒక మర్డర్ ఎటెంప్ట్ లో చనిపోయాడు. మహామేత సారీ.. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎవరూ ఊహించని విధంగా పావురాల గుట్టలో పావురమైపోయాడు. ఇక బాబాయ్ వివేకా అయితే ఒకే ఒక మర్డర్ ఎటెప్ట్.లో గొడ్డలి వేటుకి గురైపోయాడు. జగనన్న మాత్రం ఒకసారి కోడికత్తి ‘మర్డర్ ఎటెప్ట్’ నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు గులకరాయి ‘మర్డర్ ఎటెంప్ట్  నుంచి బయటపడ్డాడు. జగనన్నని మర్డర్ చేయాలని అనుకున్నవాళ్ళ చాలా అమాయకుల్లా వున్నారు. ఒకడేమో చిన్న కోడికత్తితో ఓ గొంతు మీదో కాకుండా చేతిమీద దాడి చేస్తాడు. ఇంకోడేమో చిన్న గులకరాయి విసురుతాడు. జగన్‌ని మర్డర్ చేయాలి అనుకున్న వాళ్ళని అమాయకత్వం ఆవహించి, ఏ గొడ్డలో, మరోటో తీసుకోకుండా రాళ్ళు రప్పల్లాంటి వాటితో ట్రై చేసి ఫెయిలవుతున్నారు.

ఆయనే పార్టీ కార్యకర్త చేత గులకరాయి విసిరించుకున్నారన్న కొడాలి నాని

పర్యటనకి వెళ్తుంటే ఎంతమంది పోలీసుల పహారాలో అతని యాత్ర నడుస్తుంది? ఎవడో చీకట్లో రాయి విసిరాడంట ఈయన మీదకి... ఈయన్ని చంపేద్దామని చెప్పి.. ఎంత.. ఇంత చిన్న గులకరాయి. ఈయనేమన్నా పావురమా? పిట్టా? ఇంత గులకరాయి పెట్టి కొడితే పోవడానికి? ఎవరు విసురుతాడు? నీ తాలూకు వాడు ఎవడో విసిరి వుంటాడు. ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు వేయించుకున్నాడు  అని కొడాలి నాని అన్నారు. కాకపోతే ఈయనగారు ఈ కామెంట్ చేసింది ఇప్పుడు కాదు.. చంద్రబాబు నాయుడి మీద రాళ్ళదాడి జరిగినప్పుడు. మరి చంద్రబాబు నాయుడి విషయంలో కొడాలి నాని అప్పుడలా వాగాడు కదా? మరి ఇప్పుడు జగన్ కూడా తన పార్టీ కార్యకర్త చేతే రాయి వేయించుకున్నట్టే అవుతుంది కాబట్టి... మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా మూసుకుని కూర్చోండి.

వైసీపీ చెత్తని ఫిల్టర్ చేయండయ్యా!

ఈ ఎన్నికలలో ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయిందని, తెలుగుదేశం విజయం పక్కా అని తెలిసిపోవడంతో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు పసుపు కండువా కప్పుకుంటున్నారు. వైసీపీ నుంచి తప్పుకుంటే చాలు భగవంతుడా అన్నట్టుగా చాలామంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బేషరతుగా టీడీపీలోకి వరదలా వస్తున్నారు. సాధారణంగా వరద అంటే కేవలం నీరు మాత్రమే కాదు.. చెత్తా చెదారం కూడా ఆ నీటితోపాటు వస్తుంది. ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న వరద కూడా అలాంటి చెత్తా చెదారాన్ని పుష్కలంగా కలిగి వుంది. మొన్నటి వరకూ వైసీపీలో వుండి సదరు పార్టీ అరాచకాల్లో భాగం పంచుకుని, ఇప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందని తెలియగానే చడీ చప్పుడు కాకుండా, అమాయకపు చక్రవర్తుల్లా ముఖాలు పెట్టుకుని టీడీపీలో చేరిపోతున్నారు. వైసీపీ నుంచి వస్తున్నారు కదా అని ముందూ వెనుకా ఆలోచించకుండా పార్టీలోకి చేర్చుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం కంటే నష్టం జరిగే అవకాశం వుంటుంది. పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరగడానికి ఈ వైసీపీ చెత్త కూడా ఒక కారణం అయ్యే అవకాశం వుంది. అందువల్ల తెలుగుదేశం నాయకులు వైసీపీ నుంచి వచ్చే చేరికల వరదకు గేట్లు తీసే ముందు చెత్తను ఫిల్టర్ చేసే జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది.

రాహుల్ ఇచ్చిన స్వీట్లు స్టాలిన్ తినలేరు!

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు తాను వీవీఐపీ అనే విషయాన్ని మరచిపోయి సాధారణ పౌరుడిలా ప్రవర్తిస్తూ వుంటారు. ప్రస్తుతం రాహుల్ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో వున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 13)  ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఓ స్వీట్ షాప్‌కి వెళ్ళారు. రాహుల్‌ని చూసి స్వీట్ షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ‘ఏం ఇవ్వమంటారు సార్’ అని సిబ్బంది అడిగితే, ‘మా బ్రదర్ స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు.  మైసూర్ పాక్ ప్యాక్ చేసేలోపు రాహుల్ గాంధీ షాపులోని స్వీట్స్.ని రుచి చూశారు. ఆ తర్వాత మైసూర్ పాక్ ప్యాక్ తీసుకుని, స్టాలిన్ ఇంటికి వెళ్ళి అందించారు. స్వీట్ అందుకున్న అనంతరం సీఎం స్టాలిన్ సంతోషంగా స్పందించారు. ‘నా సోదరుడు రాహుల్ గాంధీ ఇచ్చిన తియ్యటి కానుకతో నా హృదయం నిండిపోయింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున కూడా ఇండియా కూటమి తప్పకుండా ఇలాంటి తియ్యని విజయాన్నే అందుకుంటుంది’ అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రేమగా తీసుకెళ్ళిన స్వీట్‌ని స్టాలిన్ తినే అవకాశం లేదు. ఎందుకంటే, ఆ స్వీట్‌ పేరులో కర్నాటకకి సంబంధించిన ‘మైసూర్’ ఉందని కాదు... ఆల్రెడీ స్టాలిన్ బాడీలో కూడా  సుగర్ ఫ్యాక్టరీ వుంది కాబట్టి.

జ‌గ‌న్‌పై రాయితో దాడి.. ప‌క్కా ప్లానింగ్‌తోనే జ‌రిగిందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రాయితో దాడి చేశాడు. బ‌స్సు యాత్రలో భాగంగా విజ‌య‌వాడ న‌గ‌ర్ దాబా కోట్ల సెంట‌ర్ లో శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూలతోపాటు రాయి కూడా విస‌ర‌డంతో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో, వైద్యులు ఆయ‌న‌కు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. కొద్దిసేప‌టికి, వైద్యుల స‌ల‌హామేర‌కు సీఎం జ‌గ‌న్ చికిత్స‌ కోసం విజ‌య‌వాడ కేస‌ర‌ప‌ల్లి క్యాంప్ నుంచి  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి  వెళ్లారు. గాయానికి రెండు కుట్లు ప‌డ్డాయ‌ని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంత‌రం సీఎం జ‌గ‌న్ తిరిగి కేస‌ర‌ప‌ల్లికి బ‌య‌లుదేరి వెళ్లారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తీ కూడా ఉన్నారు. సీఎం జ‌గ‌న్ పై దాడిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. సీఎం జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నానంటూ పేర్కొన్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు సైతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడిని ఖండించారు. దాడి ఘ‌ట‌న‌పై నిష్పాక్షిక‌ విచార‌ణ జ‌రిపించాల‌ని ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఈసీకి విజ్ఞ‌ప్తి చేశారు.సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌ను అంద‌రూ ఖండించాల్సిన విష‌యమే. జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్, ష‌ర్మిల ఇలా ఏ పార్టీ నేత‌పై ఇలాంటి దాడులు జ‌రిగినా ఎవ‌రూ స‌మ‌ర్ధించ‌రు.  కానీ, జ‌గ‌న్‌పై రాయి దాడి ఘ‌ట‌నపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్‌పై రాయిదాడి  జ‌రిగిన క్ష‌ణాల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియాలో సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నేత‌ల రాళ్ల‌దాడి అంటూ విస్తృత ప్ర‌చారం చేశారు. అంతే కాదు  వైసీపీ నేత‌లుకూడా చంద్ర‌బాబు కుట్ర‌లో భాగంగానే జ‌గ‌న్‌పై దాడి జ‌రిగింద‌ని ప్ర‌చారం చేశారు. మొత్తానికి జ‌గ‌న్‌పై రాయి దాడిని రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. రాయిదాడి చేసింది ఎవ‌రో నిర్దార‌ణ కాక‌ముందే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌లంతా మీడియా మైకుల ముందుకొచ్చి చంద్ర‌బాబే దాడి చేయించారని మాట్లాడ‌టం చూస్తే ఇదంతా ముంద‌స్తు  ప్లాన్ ప్రకారమే జరిగిందా అన్న  అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు  సీఎంపై రాయి దాడి ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌టం, ఆ ప్రాంత‌మంతా చీక‌టిగా ఉండ‌టం  కూడా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.  విద్యుత్ స‌ర‌ఫ‌రాను అధికారులే నిలిపివేశార‌ని స‌మాచారం. జ‌గ‌న్ బ‌స్సుపై ఎక్కి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బ‌స్సుయాత్ర ప్రాంతంలో విద్యుత్ వైర్లు కిందికి ఉండ‌టంతో  సీఎం జ‌గ‌న్ కు ఇబ్బంది త‌లెత్త‌కుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేసిన‌ట్లు అధికారులు తెలిపిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు  క‌చ్చితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా తీసేసిన స‌మ‌యంలోనే జ‌గ‌న్‌పై దాడి జ‌ర‌గ‌డం ప‌ట్ల‌ కూడా టీడీపీ నేత‌లు   అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.  జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న ప‌ట్ల‌ సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నిక‌లొచ్చాయి.. జ‌గ‌న‌న్న మ‌ళ్లీ మొద‌లు పెట్టాడ్రోయ్‌.. అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా.. ప్ర‌జ‌ల సానుభూతి కోసం గ‌తంలో కోడిక‌త్తి.. ఇప్పుడు రాయి దాడి   అంటూ మ‌రికొంద‌రు జోకులేస్తున్నారు.   ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌పై దాడులు జ‌ర‌గ‌డం కామ‌న్ అనే విష‌యం ఏపీ ప్ర‌జ‌ల‌కు కూడా అర్ద‌మైపోయిందని అంటున్నారు.  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోడి క‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతి  పొంది అధికారంలోకి వ‌చ్చారు. అంతేకాదు.. త‌న సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబుపై నెట్టి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ విజ‌య‌వంతం అయ్యాడు. అధికారంలో కొన‌సాగిన‌న్ని రోజులు క‌క్ష‌పూరిత రాజ‌కీయ‌ల‌తో రాష్ట్రాభివృద్ధిని జ‌గ‌న్ ప‌క్క‌కు పెట్టేశారు. దీంతో ఏపీ ప్ర‌జ‌లకు క‌నీస సౌక‌ర్యాలుకూడా క‌రువ‌య్యాయి. అన్ని విభాగాల్లోనూ వైసీపీ నేత‌ల దోపిడీ తార స్థాయికి చేరింది. దీంతో ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ క‌క్ష‌ పూరిత‌ పాల‌న ప‌ట్ల‌ విసిగిపోయిన ప్ర‌జ‌లు..   తెలుగుదేశం కూట‌మి వైపు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డిన‌ నాటినుంచి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి  భారీగా వలసలు జరుగుతున్నాయి. దీనికితోడు జ‌గ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. దీంతో.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోలా కోడికత్తి దాడిలా జ‌గ‌న్ ఈసారి కూడా రాయి దాడి ఘ‌ట‌న‌ను ప్లాన్ చేసిన‌ట్లు తెలుగుదేశం నేత‌లు ఆరోపిస్తున్నారు. రాయి దాడి ఘ‌ట‌న ప‌ట్ల పూర్తి విచార‌ణ జ‌రిపించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ను వారు  కోరుతున్నారు.  జ‌గ‌న్‌కు త‌గిలిన గాయం చిన్నదే. రెండు కుట్లు పడ్డాయి. దీనిని హత్యాయత్నంగా జగన్ అనుకూల మీడియా అభివర్ణిస్తోంది. మరోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి ఘ‌ట‌న‌ను వైసీపీ నేత‌లు రాజ‌కీయంగా వాడుకునేందుకు విశ్వ‌ప్ర‌ య‌త్నాలు చేస్తున్నారు.   రాయిదాడి ఘ‌ట‌న‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ సీరియ‌స్ గా తీసుకొని విచార‌ణ జ‌రిపించాల‌ని, నిజానిజాల‌ను నిగ్గుతేల్చి నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగుదేశం నేతలు కోరుతున్నారు. పథకం ప్రకారం సొంత మనుషుల చేతే దాడి చేయించుకుని ఆ దాడికి కారకులుగా విపక్ష నేతలను చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బందోబ‌స్తు నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పైకూడా ఈసీ దృష్టి సారించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగుదేశం నేత‌లు కోరుతున్నారు. ఇక పరిశీలకులు సైతం ఈ దాడి గత ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి దాడిని స్ఫురింప చేసేలాగే ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే దానిని రాజకీయం చేయడానికి వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోవడం, చంద్రబాబు ప్రమేయం అంటూ విమర్శలు గుప్పించడం చూస్తుంటే కోడికత్తి ఘటనే గుర్తుకు వస్తున్నదని అంటు న్నాయి. అయినా ఇన్ని రోజులుగా జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను గమనిస్తున్న వారికి ఆయన విజయవాడలో మాత్రమే  చీకటి పడిన తరువాత కూడా, అదీ కరెంటు లేకపోయినా కూడా బస్సులోపలికి వెళ్లకుండా ప్రజలకు అభివాదం చేస్తూ ఎందుకు ఉన్నారన్న సందేహం కలగక మానదు. ఎందుకంటే అలా చీకటి పడిందో లేదో అలా జగన్  బస్సులోపలికి వెళ్లిపోవడం ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచీ జరుగుతోంది. ఒక్క విజయవాడ సింగ్ నగర్ దాబా కోట్ల సెంట‌ర్ వద్ద మాత్రం ఆయన చీకటి పడినా, కరెంటు లేకపోయినా.. రాయి వచ్చి ఆయనకు తగిలే వరకూ బస్సులోకి వెళ్లకుండా నిలుచున్నారు. ఇదే  సానుభూతి పొందేం దుకు ప్రణాళికా బద్ధంగా చేయించుకున్న దాడి అన్న అనుమానాలను రేకెత్తిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక జగన్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా దాడి సంగతి తెలుసా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే జగన్ బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తుంటే ఆయనకు అటూ ఇటూ నిలబడి అప్రమత్తంగా ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది మాత్రం తాపీగా కింద కూర్చున్నారు. అన్నిటికీ మించి ఇలా జగన్ పై రాయి దాడి జరిగిందో లేదో అందుకు సంబంధించిన విజువల్స్ తో అలా  వైసీపీ సోషల్ మీడియాలో సింపతీ డ్రామాలు ఆరం భమైపోయాయి.    చంద్రబాబే రాయి వేయించాడని  ఆరోపణలు ఆరంభమైపోయాయి.  మొత్తం మీద సామాన్య జనం కూడా జగన్ పై జరిగిన దాడిపై సెటైర్లు వేస్తున్నారు. కోడికత్తి సీన్ కు కొంచం అటూ ఇటూగా రిపీట్ చేశారు. ఇప్పుడు బాబాయ్ హత్య వంటి మరో సీన్ కోసం ప్లానింగ్ జరుగుతోందా అంటూ   నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ముగిసిన నిజం గెలవాలి యాత్ర 

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను పరామర్శించాలనే ఉద్దేశంలో ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి యాత్రను మొదలుపెట్టారు. గతేడాది అక్టోబర్ 25న చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం మొదలైంది. దాదాపు ఆరు నెలల పాటు నిజం గెలివాలి కొనసాగింది. మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమంలో సాగింది. ఇందులో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన 203 మంది కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చారు. అంతే కాకుండా వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలుస్తుందంటూ భరోసా ఇచ్చారు. ఆఖరి రోజు నారా భువనేశ్వరి తిరువూరులో పర్యటించారు. 

బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ... కాంగ్రెస్ లో చేరిన ముద్దసాని

సార్వత్రిక ఎన్నికలకు  నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ దంపతులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు హస్తం పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. రామ్మోహన్ గౌడ్ 2014, 2018లలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండుసార్లు కూడా 12వేలు, 17వేల స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2014లో ఆర్ కృష్ణయ్య చేతిలో, 2018లో సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2023లో బీఆర్ఎస్ సుధీర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. అంతకుముందు, మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సంగారెడ్డి ఇంచార్జ్ పులిమామిడి రాజు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు ఉన్నారు.

అవినాష్ పులిహోర.. షర్మిలను ఢీ కొట్టబోతున్న భారతీరెడ్డి?

కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చేస్తున్నారని  రెండు మూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  ఈ చర్చను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా పులులు  ఎవరికి తోచిన పులిహోర వాళ్ళు కలిపేసుకుంటున్నారు. ఈ  పులిహోర ప్రహసనం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం  పులివెందుల పులిబిడ్డ షర్మిల. కడప పార్లమెంట్ స్థానం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఈమధ్య ఎన్నికల  ప్రచారంలో మాట్లాడుతూ, తన ధాటికి భయపడిపోయిన  జగనన్న కడప అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారని  కాస్త ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. అంతే, అక్కడ  నుంచి ఈ వార్త దావానలంలా మారిపోయి, జగన్ నిజంగానే  అవినాష్ రెడ్డిని మార్చబోతున్నారని చాలామంది నమ్మేశారు.   ఇంకొంతమంది అత్యుత్సాహవంతులు అదిగో పులి అంటే,  ఇదిగో తోక అన్నట్టుగా దీనికి మరింత మసాలా జోడించి, కడప  పార్లమెంట్ స్థానం నుంచి మిసెస్ భారతీ జగన్ పోటీ  చేయబోతున్నారని ప్రచారం ప్రారంభించారు. ఇప్పటి వరకు  తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే కడప అభ్యర్థిని మార్చే  అవకాశం ఎంతమాత్రం లేదు. కాకపోతే, ఏమో గుర్రం  ఎగరావచ్చు అన్నట్టుగా రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.

దేవాదాయ శాఖ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలి:   పురంధేశ్వరి 

  దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగిస్తుండడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవోకు లేఖ రాశారు. దేవాదాయ శాఖ సిబ్బంది ఎప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదని పురందేశ్వరి స్పష్టం చేశారు.  ఆలయాలకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సిన దేవాదాయ సిబ్బంది ఎన్నికల విధులకు వెళితే భక్తులు ఇబ్బంది పడతారని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అనేక పండుగలు, ఉత్సవాలు ఉన్నాయని పురందేశ్వరి వెల్లడించారు. వేసవి సెలవుల్లో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో దేవాదాయ సిబ్బందికి ఎన్నికల విధులపై పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.

గుట్కా నాని గుట్కాయస్వాహా!

ఈసారి ఎన్నికలలో ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం  సాధించడం ఖాయమైపోయింది. ట్రెండ్స్ ని పరిశీలిస్తే జగన్  అండ్ కో అక్కడో సీటు ఇక్కడో సీటు గెలుచుకుని చచ్చిపోయి  మరీ కన్ను లొట్టపోయే పరిస్థితికి చేరుకోవడం ఖాయమని  అర్థమవుతోంది. అక్కడో సీటు ఇక్కడో సీటులో ఏ సీటు  అయినా ఉండొచ్చేమోగానీ గుడివాడ కొడాలి నాని అలియాస్  గుట్కా నాని సీటు మాత్రం ఖాయంగా వుండదని రాజకీయ  పరిశీలకులు చెబుతున్నారు.  నీచ నికృష్టమైన జగన్ పాలనకు తోడుగా అష్టదరిద్రమైన  కొడాలి నాని ప్రవర్తనశైలి చేరడంతో ఈసారి గుట్కా నాని  ఎమ్మెల్యే పదవి గుట్కాయస్వాహా అవడం ఖాయమని  తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, ఆయన  కుటుంబాన్ని దారుణంగా తిట్టడమే పనిగా పెట్టుకున్న కొడాలి  నాని గుడివాడ ప్రజలకు చిరాకు పుట్టించేశారు. నాని నోట్లో  వుండే గుట్కా కంటే, నాని నోట్లోంచి వచ్చే మాటలు ఎక్కువ  కంపు కొడుతూ వుంటాయనేది అందరూ అనుకునే మాటే. ఈ  గుట్కా ప్యాకెట్ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని  ఐదేళ్ళ నుంచి గుడివాడ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల్లో  ఆదరణ కోల్పోవడంతోపాటు మరికొన్ని పరిణామాలు కూడా  గుట్కా నాని ఓటమికి ఖాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు  గుడివాడ  నియోజకవర్గంలో చాలామంది వైసీపీ నాయకులు  గుట్కా రాజాకి గుడ్ బై చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఇప్పుడు లేటెస్ట్.గా మైనారిటీల్లో మంచి గ్రిప్పు వున్న మౌలాలీ  అనే మైనారిటీ నాయకుడు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేసి  సైకిల్ పార్టీలో చేరిపోయారు. మౌలాలీ గుడ్ బై చెప్పడం కొడాలి  నానికి పెద్ద దెబ్బేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నక్కని చూసి పులి....

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనేది రొటీనే. అదే  నక్కని చూసి పులి గోతులు తవ్వడం నేర్చుకోవడం అవసరం అంటారా? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పులిలాంటి తెలంగాణ ప్రభుత్వం నక్కలాంటి ఏపీ ప్రభుత్వం బాటలో నడవబోతోందని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాలను ఆలోచింపజేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ బుర్రలోంచి పుట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎన్నో విమర్శలు తలెత్తాయి. ‘సేవ’ పేరుతో వాలంటీర్లుగా మారినవారు ప్రజల నెత్తిన గుదిబండలుగా మారారు. అధికార పార్టీకి అఫీషియల్ కార్యకర్తల్లా సేవ చేసి తరిస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న పనులన్నీ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలు ఆల్రెడీ వున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇన్ని వేలమంది వాలంటీర్లను నియమించడం ద్వారా ఖజానా మీద భారం పెరిగింది. ఆల్రెడీ గతంలో ఆ బాధ్యతలు నిర్వహించిన వారికి పనేం చేయకుండానే జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజాధనం రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. వాలంటీర్ల ప్రజలకు వివిధ పనులను చేసే క్రమంలో  చేతివాటం ప్రదర్శించడం, కొందరు వాలంటీర్లు ప్రజల మీద దాడులు చేయడం లాంటి వార్తలు కూడా చదివాం. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా వివాదాలకు కేంద్రబిందువుగా మారిన వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలో కూడా ప్రారంభించడం అనేది కోరి  కొరివితో తలగోక్కోవడమే అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ  విషయంలో ముందుకే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ‘వాలంటీర్’ అనే పదం వాడకుండా ‘ఇందిరమ్మ’ కమిటీలు అనే పేరు పెట్టి వాలంటీర్ వ్యవస్థకు సమాంతరంగా వుండే వ్యవస్థను తెలంగాణలో కూడా అభివృద్ధి చేయబోతున్నట్టు అర్థమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేర్చే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి ఒక్క ఇందిరమ్మ కమిటీ సభ్యుడికి గౌరవ వేతనంగా నెలకు ఆరు వేలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇది నథింగ్ బట్ వాలంటీర్ వ్యవస్థేనని అర్థమైపోతోంది. ఒక్కో ఇందిరమ్మ  కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు. ఏ పథకానికైనా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వుండేది ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యులే. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది ఇందిరమ్మ కమిటీ సభ్యులను నియమిస్తారని తెలుస్తోంది. మరి ఈ కమిటీలు అమల్లోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థలాగానే తయారైతే, నిజంగానే నక్కని చూసి పులి  గోతులు తవ్వుకున్నట్టే అవుతుంది.

వైసీపీకి షాక్... పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి  ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం. పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీలో ఇమడలేక రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ వెంటనే షర్మిలను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

బీఆర్ఎస్ గాలి తీసేసిన తెలంగాణ ఆవాజ్ సర్వే

 బీఆర్ఎస్ కు ఇటీవలి కాలంలో ఏదీ కలిసి రావడం లేదు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం నుంచి మొదలై నేతల వలసల నుంచి.. వచ్చే లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక వరకూ అన్నీ కష్టాలే ఎదుర్కొంటోంది. దీనికి తోడు బీఆర్ఎస్ బడా నేతలపై అవినీతి ఆరోపణలు ప్రజలలో వారి ప్రతిష్టను పలుచన చేసేశాయి. ఇప్పుడు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది.  పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించగా.. అదే చేవెళ్ల నుంచి గులాబీ బాస్ కేసీఆర్ శనివారం (ఏప్రిల్ 13)న ప్రారంభించారు.  మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు   విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌, బీజేపీ దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.   ఈ నేపథ్యంలో ఇప్పటికే వెలువడిన పలు ఫలితాలు రాష్ట్రంలో ముక్కోణపు పోరు ఖాయమని పేర్కొన్నాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో కాంగ్రెస్ పై చేయి సాధించే అవకాశం ఉందని చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ నిలుస్తుందనీ, బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదని అంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఆవాజ్ వెలువరించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు రెండు నుంచి నాలుగు స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే కూడా రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంటుందని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 29.8శాతం ఓట్లతో ఆరు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక బీజేపీ 29.6శాతం ఓట్లతో ఐదు నుంచి ఏడు స్థానాలలో విజయం సాదిస్తుందనీ బీఆర్ఎస్ మాత్రం 24.3 శాతం ఓట్లతో రెండు నుంచి నాలుగు స్థానాలకు పరిమితమౌతుందని తెలంగాణ ఆవాజ్ సర్వే తేల్చింది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఆ ఇతరులు అంటే ఎంఐఎం అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంటుందని సర్వే పేర్కొంది. ఇక ఇప్పటికీ ఎటువైపు అన్నది లేలని తటస్థుల ఓట్ల శాతం 12.3 శాతం వరకూ ఉంటుందని సర్వే పేర్కొంది.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని మరిచిపోయేలా లోక్ సభ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు ఈ తాజా సర్వే గాలి తీసేసినట్లైంది. మొత్తం మీద బీఆర్ఎస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కనీస స్థానాలతో సరిపెట్టుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. 

అధికారం వుండగానే అన్నీ మాయం చేద్దాం!

ట్యాపింగ్ మా జన్మహక్కు అన్నట్టుగా అధికారంలో వున్న రాజకీయ నాయకులు తయారయ్యారు. ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రకరకాల యాంగిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు భారీ స్థాయిలో ఆధారాలు దొరికిపోయాయి. ట్యాపింగ్ చేయడంలో పాత్రధారులుగా పనిచేసిన పోలీసు అధికారులు దొరికిపోయి జైల్లో  రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోరన్న ధీమాలో వున్న ట్యాపింగ్ పోలీసు అధికారి, ప్రభుత్వం కూలిపోయిన మర్నాడు వెళ్ళి ట్యాపింగ్‌కి సంబంధించిన అంశాలను ధ్వంసం చేశాడు. ఈ పాయింటే ట్యాపింగ్ తీగ లాగి డొంకంతా కదిలించడానికి ఆధారం అయింది. ఎంచక్కా అధికారంలో వున్నప్పుడే ట్యాపింగ్ ఆధారాలను ధ్వంసం చేసేసినట్టయితే ఎవరికీ అనుమానం వచ్చేది కాదు.  ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక వేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎంచక్కా మళ్ళీ ట్యాపింగ్ గేమ్ ఆడుకోవడానికి వీలయ్యేది. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న అతి నమ్మకమే ట్యాపింగ్ వీరుల కొంప ముంచింది. పోలీసులు పాత్రధారులు జైల్లో పడేలా చేసింది. అసలు సూత్రధారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేస్తోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కి ప్రత్యక్ష గురువు కాకపోయినా దాదాపు గురువులాంటి కేసీఆర్ ట్యాపింగ్ బాటలో నడిచినప్పుడు ఆయన శిష్యుడు కాని శిష్యుడు జగన్ మాత్రం ఆ బాటలో నడవకుంటా వుంటారా? ఎందుకు నడవరు? కచ్చితంగా నడవటం మాత్రమే కాదు.. వీలైతే పరిగెత్తుతారు కూడా. ఈ విషయంలో ఏపీ తెలుగుదేశం నాయకులకు మొదటి నుంచీ అనుమానాలు వున్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి మొర్రో అని మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఏపీలో పోలీసు పెద్దలందరూ అధికార పార్టీకి చెమ్చాలు, గరిటెలుగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల ఆక్రోశాన్ని ఎవరు పట్టించుకుంటారు. లేటెస్ట్ గా నారా లోకేష్ ఐ ఫోన్‌ని కూడా ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నించినట్టు ఆధారాలు దొరికిపోయాయి. అందువల్ల ఏరకంగా చూసినా జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు అర్థమవుతోంది. ఏపీలో ఈసారి జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అందువల్ల తెలంగాణలో మాదిరిగా తమ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇరుక్కుపోకుండా వుండాలంటే  ఇప్పటి వరకు చేసిన ట్యాపింగ్‌తో సరిపెట్టుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల తర్వాత తమ పార్టీకి తట్టాబుట్టా సర్దుకోవడం తప్పదు కాబట్టి  ఇప్పుడు అధికారంలో వున్నప్పుడే ట్యాపింగ్‌కి సంబంధించిన ఆధారాలన్నీ యాసిడ్ పోసి కడిగేసినట్టు కడిగేస్తే బెటరని అనుకుంట్టు తెలుస్తోంది.

పుంగనూరు పరువు తీస్తున్న పెద్దిరెడ్డి

పుంగనూరు అనే పేరు వినగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది  పుంగనూరు జాతి ఆవులు, ఎడ్లు. చాలా చిన్న ఆకారంతో,  మనుషులతో కలసిపోయే స్నేహశీలతతో, ఆరోగ్య విలువలు  వున్న పాలిచ్చే పుంగనూరు పశుసంపద ప్రపంచ వ్యాప్తంగా  ప్రసిద్ధి చెందింది. పుంగనూరు ఆవుల ద్వారా వచ్చే పాలతోనే  తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని తయారు  చేస్తారంటే, పుంగనూరు జాతికి వున్న పవిత్రతను అర్థం  చేసుకోవచ్చు. అలాంటి మంచి పేరున్న పుంగనూరు పరువును  తీసిపారేసే బృహత్తర కార్యక్రమాన్ని వైసీపీ, నాయకుడు మంత్రి  పెద్దిరెడ్డి చేపట్టినట్టు కనిపిస్తోంది.  ప్రస్తుతం పుంగనూరు పేరు చెబితే సాధు జీవులైన ఆవులు  గుర్తుకు రావడం మానేసి, అన్యాయాలతో, ఆరాచకాలతో  రెచ్చిపోతున్న పెద్దిరెడ్డి మనుషులు గుర్తొస్తారు. పెద్దిరెడ్డి  వర్గీయులు పుంగనూరులో చేయని దారుణం లేదు. ప్రతిపక్ష  పార్టీ కార్యకర్తలను చావగొట్టడం, వారి వాహనాలను ధ్వంసం  చేయడం వాళ్లకి బాగా అలవాటైపోయింది. ఏయ్ బిడ్డా...  పుంగనూరు నా అడ్డా అన్నట్టు పుష్ప లెవల్లో పెద్దిరెడ్డి అండ్ కో  రెచ్చిపోతున్నారు. గతంలో పెద్దమనిషిగా పేరున్న పెద్దిరెడ్డి  ఇప్పుడు పేరులోనే పెద్దతనాన్ని మిగుల్చుకున్నారు. ఈసారి  ఎన్నికలలో పెద్దిరెడ్డికి బుద్ధి చెప్పడానికి పుంగనూరు  నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా వున్నారు.