అమరావతి... ఏపీ రాజధాని కాదని ఎవరన్నారు? దేశానికి మాత్రం హైదరాబాదే సెకండ్ కేపిటల్..!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రెండున్నర నెలలుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు, మహిళలు, ప్రజలు... తిండీతిప్పలు మానేసి... దాదాపు 80రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏపీ హైకోర్టు నుంచి ఇంటర్నేషనల్ కోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు, గవర్నర్, రాష్ట్రపతిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని, కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం... అమరావతి నుంచి కేపిటల్ ను తరలిస్తోందని పదేపదే ఫిర్యాదు చేశారు.  అమరావతి కోసం 29 గ్రామాల రైతులు, మహిళలు, యువత, పిల్లలు... ఇలా అందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, మంత్రులు మాత్రం చాలా తేలిగ్గా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి బొత్స ప్రకటనలతో మొదలైన గందరగోళాన్ని, మిగతా మంత్రులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు, అమరావతి... ఏపీకి రాజధాని కాదని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించారు. తామెప్పుడూ అమరావతి... ఏపీ రాజధాని కాదని చెప్పలేదన్నారు. అయితే, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న మంచి ఉద్దేశంతోనే విశాఖను పరిపాలన రాజధానిగా చేశామని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా హైదరాబాద్ పైనా పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ చెప్పినట్లుగా ఏదో ఒక రోజు కచ్చితంగా హైదరాబాద్... దేశానికి రెండో రాజధాని అవుతుందని అన్నారు.  

రూపాయి చెల్లించ‌కుండానే 6 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ కవరేజ్!

మీకు PF అకౌంట్ వుందా? అయితే ప్రీమియం చెల్లించ‌కుండానే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ల‌భిస్తుంది. ఎలా అంటే ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లకు  మూడు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ అనేవి ఇవి. తొలి రెండూ అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి సేవింగ్స్ స్కీమ్స్. ఇక ఈడీఎల్ఐ (ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్) అనేది ఇన్సూరెన్స్ స్కీమ్. ఈడీఎల్ఐ స్కీమ్ 1976 నుంచి అమ‌లులో ఉంది.  ఉద్యోగులకు ఈపీఎఫ్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి కంపెనీకి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే  ఈ ఈపీఎఫ్‌వో స్కీమ్ నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈడీఎల్ఐ స్కీమ్‌లో ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ ఈపీఎస్ సేవింగ్స్ స్కీమ్స్‌తో లింక్ అయ్యి ఈ పథకంప నిచేస్తుంది. అంటే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది. ఆటోమేటిక్‌గానే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయి. కంపెనీ ఈ స్కీమ్‌కు ఉద్యోగి తరుపున కంట్రిబ్యూషన్ చేస్తుంది. డీఏ, శాలరీ ప్రాతిపదికన కంట్రిబ్యూట్ మొత్తం డిసైడ్ అవుతుంది. కంపెనీ గరిష్టంగా 0.50 శాతం లేదా రూ.75లను ఈడీఎల్‌ఐ స్కీమ్‌కు ఉద్యోగి  తరుపున కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి మరణం తర్వాత నామినీకి శాలరీకి 30 రెట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇక్కడ శాలరీ అంటే కేవలం డీఏ, బేసిక్ శాలరీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు అదనంగా రూ.1.5 లక్షల బోనస్ కూడా అందజేస్తారు. ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే మరణిస్తే.. నామినీకి గరిష్టంగా రూ.6 లక్షల వరకు లభిస్తాయి. ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్‌గా కొనసాగుతున్నారు. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ స్కీమ్స్‌లో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగి డ్యూటీలో మరణించారు. ఈ ఉద్యోగి నెలవారీ జీతం రూ.15,000గా ఉంది. ఇప్పుడు ఉద్యోగి నామినీ ఈడీఎల్ఐ క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్నారు. నామినీకి రూ.6 లక్షలతొ నాటె ల‌క్షా 50 వేల రూపాయ‌ల బోన‌స్ వ‌స్తుంది. ఈపీఎఫ్‌వో చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీకి ఇది వర్తిస్తుంది. ఈ కంపెనీలు ఈ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ను అందించాల్సి ఉంటుంది.

క్లినిక్ ముసుగులో సెక్స్  దందా!

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో సెక్స్ రాకెట్  గుట్టును రట్టు చేశారు పోలీసులు. 20 నుంచి 30 సంవత్సరాల వయసు వున్న నలుగురు మహిళలు,  ఆరుగురు విటులను రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.   తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నసచిన్ సింగ్ చౌహాన్,  మహిళా డాక్టర్ గాయత్రి వీర్ సింగ్ తో క‌లిసి భోపాల్ లోని బర్కాహేది ప్రాంతంలో  క్లీనిక్ పేరుతో సెక్స్ దందా న‌డుపుతున్నాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు  ఈ క్లినిక్‌పై దాడి మెరుపు దాడి చేసి నలుగురు మహిళలతో సహా మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ అదితి భవ్‌సర్ తెలిపారు.

10 నిమిషాల్లో 10 ఈ జీవోలు

  సమయం తక్కువగా ఉండటం కేంద్ర నిధులు కీలకం కావడంతో హైకోర్టు రద్దు చేసిన జీవో స్థానంలో కోర్టు సూచనల మేరకే 50శాతానికి పరిమితమవుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌హ‌స్య‌ జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ కొత్త రిజర్వేషన్లను 50శాతానికి ఖరారు చేసింది. అయితే దీనిని జీవో ద్వారా లేదా ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందటం కోసం సమయం పట్టే అవకాశం ఉంది. మ‌రో వైపు ఆర్డినెన్స్ పైన బీసీ సంఘాలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. న్యాయపరంగా చిక్కులు లేకుండా ఉండటానికే ఈ జీవోలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేకుండా చేశారు. బుధ‌వారం సాయంత్రానికి 13 జిల్లాల్లోను రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అవి కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి అందగానే ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఈనెల 27కల్లా ఎన్నికలు పూర్తి చేసుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

త‌ల్లి-కొడుకు మ‌ధ్య అక్ర‌మ‌సంబంధం

మొదటి భార్య కుమారుడు రెండో భార్య మధ్య ఏర్పడిన అక్రమ సంబంధ‌మే దామూ నాయక్ ను బలి తీసుకుంది! కర్ణాటక లోని విజయపురా జిల్లాలోని బసవన బాగేవాడిలో గల మడివాళేశ్వర గ్రూప్ విద్యాసంస్ధల అధినేత దామూ నాయక్ ను ఫిబ్రవరి 25న హంతుకులు గొంతుకోసి హత్య చేశారు. పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ హ‌త్య వెనుక శ‌త్రువుల పాత‌క‌క్ష‌లు ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. ఆయనతో శతృత్వం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ పోలీసులకి ఎటువంటి క్లూ దొరకలేదు. దామూ నాయక్ కు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. అయితే  అయన రెండు పెళ్లిళ్లు  చేసుకున్నాడు.  ఈ కేసును ఆ యాంగిల్‌లో దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. సెల్ ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాము నాయక్ మొదటి భార్య కుమారుడు సుభాష్ నాయక్.. రెండో భార్య ప్రేమా  మధ్య ఏర్పడిన అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు కార‌ణ‌మ‌ని తెలిసింది. దాము నాయక్ ను అడ్డు తొలగించుకుంటే.. కోట్లాది రూపాయల ఆస్తి తమ వశం అవుతుందని నిందితులు భావించారు. వెంట‌నే త‌మ ప్లాన్ అమ‌లు చేశారు. దామూ నాయక్ ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చిన‌ట్లు పోలీసు విచార‌ణ‌లో తేలింది. ప్రధాన నిందితులైన రెండోభార్యను మొదటి భార్య కొడుకుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆరు జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదు

  వేడి వాతావరణంలోనూ కరోనా వైరస్ 48 గంట‌లు బ్ర‌తుకుతుంది పాయింట్ 1 కరోనా గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే... గుంపుగా జనం ఉన్నా... అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ... ఆ జనంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... వాళ్లు దగ్గినా, తుమ్మినా... అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో (తుంపర్లలో) కరోనా వైరస్ ఉంటుంది. అది గాలిలో ఎగురుతూ వచ్చి మనపై పడితే... వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. అంటే వైరస్ మనకు చేరకుండా ఉండాలంటే... మనపై ఏ తుంపర్లూ పడకూడదన్నమాట. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాయింట్ 2 ఈ వైరస్ ఉన్న వ్యక్తులు ప్రయాణాల్లో బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో, ఆటోల్లో ఎక్కడైనా సరే, ఏదైనా వస్తువును (రాడ్లు, సీట్లు, డోర్లు వంటివి) ముట్టుకుంటే... వాటిపై వైరస్ ఉండే ఛాన్సుంటుంది. అదే వస్తువును మనమూ ముట్టుకుంటే... ఆ వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... వీలైనంతవరకూ అలాంటివేవీ ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చేతులకు గ్లోవ్స్ వాడితే మంచిదే. లేదంటే ప్రయాణం తర్వాత చేతుల్ని సబ్బుతో బాగా కడిగేసుకోవాలి. అలాగే... ప్రయాణ సమయాల్లో హ్యాండ్ శానిటైజర్ వాడాలి. రెండు, మూడు చుక్కలు చేతిలో వేసుకొని... రెండు చేతులకూ రాసుకోవాలి. అలా ప్రయాణం చేసిన ప్రతిసారీ రాసుకుంటే... వైరస్ మన చేతులకు చేరదు. పాయింట్ 3 ముఖానికి మాస్క్ పెట్టుకుంటే చుట్టూ ఉన్నవాళ్లు మనల్నే చూస్తూ... అమ్మో ఇతనికి వ్యాధి ఉందేమో అనుకునే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ మాస్క్ వాడటం మేలు కాబట్టి... అది వాడొచ్చు. లేదంటే కనీసం కర్చీఫ్ అయినా ముఖానికి (ముక్కూ, నోరూ మూసుకునేలా) కట్టుకుంటే మంచిదే. పాయింట్ 4 వైరస్ ఉన్నవారికి కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఎవరికి వైరస్ సోకిందో మనకు తెలియదు కదా. కాబట్టి... మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే  పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలోని C విటమిన్... ఇలాంటి వైరస్‌లను బాడీలోకి రానివ్వకుండా చేస్తుంది. పాయింట్ 5 జలుబు, దగ్గు, నీరసం, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతోంది. కాబట్టి... ఇలాంటి అనారోగ్యాలు ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. బయటి ప్రయాణాలు మానుకుంటే బెటర్. పాయింట్ 6 ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ సోకితే... భయపడాల్సిన పనిలేదు. మనో ధైర్యంతో నాకేంకాదు... కచ్చితంగా రికవరీ అవుతా అని మనసులో మాటిమాటికీ అనుకుంటూ ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం పెరిగేకొద్దీ... బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది వైరస్‌తో పోరాడుతుంది.

సెక్స్‌కు పెళ్లికి ముడి!

సెక్స్ ఈక్వల్స్ టు మ్యారేజ్ అంటున్నారు ర‌ష్య అధ్యక్షుడు పుతిన్ సెక్స్ అంటే అది పూర్తిగా పెళ్లితో నిమిత్తం అయింద‌ని, ఒకరితో సెక్స్ లో పాల్గొంటే వారిని పెళ్లి చేసుకున్నట్టే అని  అధ్యక్షుడు పుతిన్  రాజ్యాంగంలోనే స‌వ‌ర‌ణ చేయ‌డానికి సిద్ధ‌మైయ్యార‌ట‌. సెక్స్ అనేది మనిషి కనీస అవసరం. సెక్స్ కోసమని పెళ్లి చేసుకోవడం లేదా సెక్స్ చేసిన వారితో పెళ్లి అయిపోయిందంటే ఎలా అని ర‌ష్యాలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రో ప‌క్క స్వలింగ సంపర్క వివాహాలను కూడా రష్యాలో నిషేధిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. వివాహం అంటే అది స్త్రీ- పురుషుడికి జరిగిదే అని.. మగాడు-మగాడు స్త్రీ- స్త్రీ పెళ్లి చేసుకుంటే అలాంటి పెళ్లిని ఆమోదించేది లేదని పుతిన్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు ఆమోదమే లేకుండా కొత్త చట్టాలను చేస్తున్నారు ఇప్పుడు ర‌ష్యాలో.

స్టూడెంట్‌తో టీచర్ కామక‌లాపాలు!

త‌న స్టూండెంట్‌పైనే క‌న్నేసాడు ఆ టీచ‌ర్‌. మాయ మాట‌ల‌తో లొబ‌ర్చుకున్నాడు. రూంకు పిలిపించుకొని ఎంజాయి చేశాడు. ఈ దారుణం  కర్ణాటకలోని మైసూర్ జిల్లా నంజన్‌గుడ్ తాలుకా రాంపురా గ్రామంలో జ‌రిగింది. రిటైర్‌మెంట్ వ‌య‌స్సుకు వ‌చ్చినా ఈ టీచ‌ర్ బుద్ది అయితే మార‌లేదు. ఇత‌ని పేరు సిద్ధరాజు(58).  రాంపురాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ప‌నిచేస్తున్నాడు. ఈ ఊరిలోనే  దాదాపు 25 ఏళ్ల నుంచి టీచర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. తాను చదువు చెప్పిన స్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. త‌న మాయ‌మాట‌ల‌తో  విద్యార్థినులలో ఒకర్ని లోబర్చుకున్నాడు. ఆమె స్కూల్ విడిచిపెట్టి వెళ్లిపోయినా ఆమెను వెంటాడాడు. తాజాగా, వారిద్దరు ఒక గదిలో కామక్రీడలో పాల్గొన్నారు. జ‌రుగుతున్న దృశ్యాన్ని చూసి   అదే స్కూల్‌కు చెందిన వ్య‌క్తి టీచ‌ర్ కామకార్య‌క‌లాపాల‌ను ఫొటో తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడు. అర్ధనగ్నంగా బెడ్‌పై పడుకొని ఆమెతో ఉన్న ఆ ఫొటో స్థానికంగా వైరల్ అయ్యాయి. దీంతో టీచ‌ర్ ఊరు విడిచిపెట్టి పారిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామ‌స్థులు కామ‌పిశాచి టీచ‌ర్ సిద్ధరాజును స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మైనార్టీల‌కు అండ‌గా వుంటా.. సిఎం జ‌గ‌న్ భ‌రోసా

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో చ‌ర్చించి తీర్మానం క్యాంప్ కార్యాల‌యంలో జ‌రిగిన మైనార్టీ నేత‌లు, ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో సి.ఎం. భేటీ. జాతీయ జనాభా పట్టికలో(ఎన్పీఆర్‌) ప్రతిపాదించబడ్డ కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. ఎన్పీఆర్‌ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించారు. NPR, NRC కు సంబంధించిన అంశాలపై ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌ" ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ SB. అంజాద్ భాష మీడియాతో మాట్లాడారు.

చిరంజీవితో రఘువీరా భేటీ

వీరి క‌ల‌యిక పార్టీకి  జీవం పోస్తుందా?   ఆంధ్రాలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి మంచి రోజులు వ‌స్తాయా?   పార్టీలో గుస‌గుస‌లు ఇప్పుడు ఇదే పిక్చర్ ఆఫ్ ఆంధ్రా ర‌ఘువీరారెడ్డి చిరంజీవిని క‌ల‌వ‌డానికి కుటంబసమేతంగా హైదరాబాద్ వెళ్లారు. ఎందుకంటారా ఆయ‌న అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంలో 52 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్ర‌హాన్ని ఆవిష్కరించేందుకు చిరంజీవిని ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మం మే 29న జ‌ర‌గ‌నుంది. ఒక‌ప్పుడు రఘువీరారెడ్డి.. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేశారు. జాతీయ స్థాయిలోనూ పరిచయాలు, మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొసగలేక.. ఇప్పుడు పొలం పనికి మాత్రమే పరిమితమయ్యారు. పల్లెటూరి జీవనాన్ని.. హాయిగా అనుభవిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ఉంటున్నారు. చిరంజీవి కూడా అంతేగా.  కేంద్ర మంత్రిగా పని చేసి.. ఇప్పుడు రాజకీయాలు వదిలి.. తన పని తాను చేసుకుంటున్నారు. హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని మునుపటిలా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ ఫుల్ గా లైఫ్ కానిచ్చేస్తున్నారు. ఇలాంటి ఇద్దరు నేతలు.. హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం విశేషమేగా మరి. అవును. అలాంటి సందర్భమే అందరినీ ఆకర్షిస్తోంది. చిరంజీవి ఆ కార్యక్రమానికి వెళ్తారా, లేదా అన్న అంశం కంటే  చిరు, రఘువీరా కలయిక మాత్రం.. రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరూ రాజకీయాలు మాట్లాడుకునే అవకాశమైతే లేకుండా ఉండవని.. ఇద్దరి మధ్యా ఈ దిశగా ఏ విషయం చర్చకు వచ్చి ఉంటుందా అని.. అంతా అనుకుంటున్నారు. కలర్ ఫుల్ గా ఉన్న వీరి పిక్చర్ ను కాంగ్రెస్ అభిమానులైతే ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి వీరి క‌ల‌యిక జీవం పోస్తుందా? కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రాలో మళ్లీ మంచి రోజులు వ‌స్తాయా?  పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ముస్లిం 4% రిజ‌ర్వేష‌న్ కేసు మార్చి 16కు వాయిదా!

2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ముఖ్యమంత్రి అయిన త‌రువాత‌ రాష్ట్రములోని అణ‌గారిన ముస్లిం వర్గాలకు బిసి(ఇ) క్యాట‌గిరి పేరుతో రిజ‌ర్వేష‌న్లు ఇచ్చారు.   ముస్లిం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ద్రోహద పడేలా రిజర్వేషన్ కల్పించడము అత్యవసరమని భావించి 4% రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ ఫలితంగా ముస్లిం  సమాజము విద్య ,మరియు ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రాధాన్యత పొందింది. అయితే మత ప్రాతిపదిక పై రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాలు చేస్తూ, ఉమ్మడి రాష్ట్రము హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేయగా అప్పటి రాష్ట్ర హైకోర్టు సదరు కేసును కొట్టివేయడము  జరిగింది.  ఆ దరిమిలా సదరు కేసును కొంతమంది తిరిగి సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు 2010లో డాక్టర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి చొరవతో ఆ కేసును వాయిదా వేయించడం జరిగింది (స్టే తీసుకుని రావడం )అప్పటి నుండి ఆ stay నేటి వరకు కొనసాగుతుండగా, విద్య మరియు  ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లిం సమాజం 4% రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో మార్చి 3వ తేదీన బెంచ్‌పైకి వ‌చ్చింది. ఈ కేసును మార్చి 16, 2020 వాయిదా వేస్తున్న‌ట్లు ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి   ఉప ముఖ్యమంత్రి  అంజద్ బాషా గారు హుటాహుటిన ఢిల్లీకి పంపారు. ఆయ‌న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్ వెంకటరమని ,మరియు జయదీప్ గుప్తాలతో ప్రత్యక్ష సమాలోచనలు జరిపి ఈ కేసుకు సంబంధించి చ‌ర్చించారు. ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన రిజర్వేషన్ కేసును తప్పనిసరి గా గెలవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డిప్యూటీ సి.ఎం. ఆశాభావం వ్య‌క్తం చేశారు.

షహీద్ మేళా బేవర్ ఉత్తర ప్రదేశ్ అధ్యక్షుడిగా డా.గజల్ శ్రీనివాస్

ప్రతిష్టాత్మక సంస్థ "షహీద్ మేళా బేవర్ -ఉత్తర ప్రదేశ్"  అధ్యక్షుడిగా ప్రఖ్యాత గ్గాయకులు డా.గజల్ శ్రీనివాస్ ను మేళా కమిటి ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్టు సంస్థ సంచాలకులు శ్రీ రాజ్ త్రిపాఠి తెలిపారు. షహీద్ మేళా  ప్రతి ఏటా జనవరి 23 నుండి ఫిబ్రవరి 10 వ తేదీ వరకు జరుగుతుందని, స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన త్యాగధనులకు లక్షలాది మంది ఈ ఉత్సవం లో నీరాజనం పలుకుతారని తెలిపారు. దేశవ్యాప్తం గా ఎంతో మంది ఈ ఉత్సవం లో సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన, కవి సమ్మేళనం లో పాల్గొని దేశభక్తి ని చాటి చెబుతారని తెలిపారు. 1942 లో కృష్ణ కుమార్, 14 ఏళ్ళ  విద్యార్థీ,  శ్రీ సీత రామ్ , శ్రీ జమునా ప్రసాద్ త్రిపాఠి లు బ్రిటిష్ వారి తుపాకీ  గుళ్లకు ఎదురువెళ్లి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. ఆ పిదప లక్షలాది మంది స్పూర్తి పొంది బేవర్ లో ఉద్యమాన్ని ఉదృతం చేసారు . ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసారు. వారి గురుతుగా 1972 నుండి షహీద్ మేళా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు , దేశం లో మరెక్కడా లేనట్టుగా 26 మంది స్వాతంత్ర  సమర యోధులకు "షహీద్ మందిరాన్ని " నిర్మించినట్టు శ్రీ రాజ్ త్రిపాఠి తెలిపారు. డా. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో  భవిష్యత్తులో అన్ని రాష్ట్రల్లో  షహీద్ మేళ నిర్వహించి ఈ తరం ప్రజలకు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేస్తామని అన్నారు.

సీఎం కేసీఆర్ అమెరికాకి వెళ్లారంటూ కాసులు వెనకేసుకున్న అధికారులు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కి తెలియకుండా.. కొందరు అధికారులు కాసులకి కక్కుర్తి పడి.. సీక్రెట్ జీవోలు ఇస్తున్నారా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. పీఎం, సీఎం లు విదేశీ పర్యటనలకు వెళ్లడం సహజం. అయితే ఇతర రాష్ట్రాల సీఎంలతో పోల్చుకుంటే.. కేసీఆర్ విదేశీ పర్యటనలకు వెళ్లడం తక్కువనే చెప్పాలి. అసలు చేసేదే తక్కువ పర్యటనలు అంటే.. ఆ తక్కువలో కూడా అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ 2014 జూన్‌ 2 నుంచి 2020 ఫిబ్రవరి 15 వరకు ఏయే విదేశీ పర్యటనలు చేశారు? ఒక్కో పర్యటనకు ఎంత ఖర్చయింది? వంటి అంశాలపై వివరాలు తెలపాల్సిందిగా జలగం సుధీర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఫిబ్రవరి 27న సమాధానం ఇచ్చింది. ఈ ఆరేళ్లలో కేసీఆర్‌ మూడు విదేశీ పర్యటనలు చేసినట్లు తెలిపింది. 2014 ఆగస్టులో సింగపూర్‌-మలేషియాలకు, 2015 సెప్టెంబర్‌లో చైనాకు కేసీఆర్‌ వెళ్లినట్లు తెలిపింది. అలాగే, 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకు కేసీఆర్‌ అమెరికా పర్యటనలో ఉన్నట్లు పేర్కొంది. కానీ ఇక్కడే పప్పులో కాలేసింది. 2016 ఆగస్టు 30వ తేదీ నాడు కేసీఆర్‌.. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో నాటి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. రెండ్రోజుల తర్వాత అనగా సెప్టెంబరు 1వ తేదీన అప్పటి అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం హైదరాబాద్‌లోని క్యాంప్‌ ఆఫీసుకు వచ్చి కేసీఆర్‌ను కలుసుకున్నారు. అంటే ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కానీ జీఏడీ మాత్రం.. ఆ మూడు రోజులూ కేసీఆర్‌ దేశంలోనే లేరని, అమెరికా పర్యటనలో ఉన్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికాలో 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ జరిగే ఓ వ్యవసాయ సదస్సుకు రావాల్సిందిగా ఆ ఏడాది జులైలో కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కానీ కేసీఆర్‌ ఎందుకో ఆ పర్యటనకు వెళ్లలేదు. అయితే, జీఏడీ మాత్రం.. కేసీఆర్‌ అమెరికా పర్యటనకు సంబంధించి 2016 ఆగస్టు 26న జీవో ఆర్టీ నంబర్‌ 1895 జారీ అయినట్లు ప్రకటించింది. అసలు కేసీఆర్ అమెరికానే వెళ్లునప్పుడు.. ఈ జీవో ఎలా జారీ అయింది? ఈ జీవో విషయం సీఎంకు తెలియదా? ఆయనకు తెలియకుండా సీఎం పర్యటన పేరుతో కాసులు వెనకేసుంటున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే సీఎం విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను మాత్రం జీఏడీ వెల్లడించలేదు. మొదటి రెండు పర్యటనల ఖర్చు వివరాలు పరిశ్రమల శాఖ వద్ద, అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని పేర్కొంది. సరే మొదటి రెండు పర్యటనలు అంటే నిజంగా సీఎం వెళ్లారు కాబట్టి దానికి తగ్గట్టు ఖర్చు చేసి ఉంటారులే అనుకోవచ్చు. కానీ, అసలు వెళ్లని అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉండటం ఏంటి? దీనిపై కేసీఆర్ సర్కార్ కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని ఈ భాగోతం బయటపడింది. ఇంకా బయటకు రాని భాగోతాలు ఎన్ని ఉన్నాయో ఏంటో!!

గాంధీ ఆస్పత్రిలో కలకలం.. హైద‌రాబాద్‌లో క‌రోనా ఆస్పత్రి?

కరోనా వైరస్ వస్తే పేషెంట్‌ని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచాల్సి వుంటుంది. రోగి వ‌ద్ద‌కు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అలాంటి పరిస్థితులు  తెలంగాణలోని ఏ ఆసుప‌త్రిలోనూ లేవు. ప్ర‌స్తుతం మాత్రం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేశారు. ఆ వార్డుల్లోకి కంప్లీట్ సూట్లు వేసుకున్న డాక్టర్లు మాత్రమే వెళ్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాల‌ని అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న  ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రిని పూర్తిగా కరోనా కేసుల కోసం కేటాయిస్తే ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ చెస్ట్ ఆస్పత్రి కుదరకపోతే... మిలిటరీ ఆస్పత్రిని పూర్తిగా తీసుకోవాలని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఆలోచిస్తోంది. ఇదిలా ఉంటే, కరోనా పేషంట్ జనరల్ పబ్లిక్ వెళ్లే కామన్ బాత్‌రూంకి వెళ్లడం గాంధీ ఆసుపత్రిలో కలకలం రేపింది. తెలంగాణలో ఒక యువకుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనికి గాంధీ ఆస్పత్రిలోని.. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక బాత్ రూం లేకపోవడంతో..  అతను జనరల్ పబ్లిక్ వెళ్లే కామన్ బాత్‌రూంకి వెళ్లాడని తెలుస్తోంది. దీంతో.. ఆస్పత్రి సిబ్బంది, ఇతర రోగులు, వారి కుటుంబ సభ్యులు.. ఎక్కడ తమకి కరోనా సోకుతుందోనని.. ఆందోళన చెందుతున్నారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. తగు జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

ఇంటర్నేషనల్ కోర్టుకు అమరావతి ఇష్యూ... త్వరలో యూఎన్ వోకి ఫిర్యాదు...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం అలుపెరగని పోరాటం జరుగుతోంది. రాజధాని గ్రామాల్లో రెండున్నర నెలలుగా రైతులు, మహిళలు, ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు ఎన్నారైలు కూడా వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ రూపాల్లో తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇక, అమరావతిని తరలించొద్దంటూ ఏపీ హైకోర్టులో ఇఫ్పటికే పలు కేసులు నమోదు కాగా, ఇక, ఇప్పుడు అమరావవతి ఇష్యూ అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వ తీరును ఎండగడుతోన్న ఎన్నారైలు... ఏకంగా ది హేగ్ లోని ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించారు.  అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ... అమెరికా ఎన్నారైల తరపున శ్రీనివాస్ కావేటి... ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించేవిధంగా ఆదేశాలిచ్చి, అమరావతి రైతులకు న్యాయం చేయాలని తన పిటిషన్ లో కోరాడు. అయితే, అసలు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందో లేదోనన్న అనుమానాలు కలిగినా, అమరావతిపై ఎన్నారై వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. త్వరలోనే సీరియల్ నెంబర్ కేటాయించనున్న ఇంటర్నేషనల్ కోర్టు.... విచారణ చేపట్టనుంది. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నారైలు... మొదట్నుంచీ రాజధాని రైతులకు అండగా నిలుస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూనే, ఇఫ్పుడు ఏకంగా ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేకాదు, అమరావతిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ, త్వరలోనే UNO మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎన్నారైలు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ త‌యారైందా?

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా తొలి వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా కూడా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని తెలిపింది. ఈ ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందట‌. తొలి దశ ప్రయోగం విజయవంతమైతే.. అది అందుబాటులోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది. 2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టగా తాజాగా కరోనా వైరస్‌ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందించి, మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం. మందు కనిపెట్టినా, దాన్ని పంపిణీ చెయ్యడానికి కనీసం 3 నెలలు పడుతుంది. ఆ మందు కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

వైసీపీ నేతల నుంచి మీరే కాపాడాలి... గవర్నర్‌కు అమరావతి మహిళల మొర...

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, 29 గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ తమ నిరసనలకు తెలియజేస్తున్నారు. అయితే, అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ మరోసారి ఏపీ గవర్నర్‌ను కలిసింది. రాజధానిలో జరుగుతున్న పరిణామాలు, అక్రమ కేసులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసింది. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు పెడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆవేదన వ్యక్తంచేసింది. శాంతియుతంగా తాము ధర్నాలు చేస్తుంటే... వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎంపీ నందిగం సురేష్ తమపై తప్పుడు కేసులు పెట్టించి భయపెడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఇక, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న ఫొటోలను గవర్నర్ కు అందజేశారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై ఇప్పటివరకు 2వేల 800 అక్రమ కేసులు పెట్టారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ... తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.