కొండలపై కొలువైతే దేవుడైపోయినట్లేనా? రిషికొండ బాగోతం అందుకేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  హిందూ ధర్మ వ్యతిరేకి  అవునా కాదా తెలియదు కానీ ఆయన హిందువు అయితే కాదు.  ఇది జగన ఒక్కరే కాదు జగమెరిగిన సత్యం. భారత దేశం కుల మతాలకు అతీతమైన లౌకిక రాజ్యం అందులో ఎటువంటి సందేహం లేదు. సర్వ మత సామరస్యం, సౌభ్రాతృత్వం భారత డీఎన్ఏలోనే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు దేశం నిలువెత్తు నిదర్శనం.  అయితే ఏపీ విషయంలో  మాత్రం జగన్ హయాంలో ఒక కొత్తా దేముడు అవతరించాడు.  ఈ విషయాన్ని ఆయన కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు.   విశాఖ రిషికొండపై నిర్మాణాల విషయంలో వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందిస్తూ.. మంత్రి రోజా, మాజీ మంత్రులు  తిరుమల కొండపై వెంకన్న దేవుడు కొలువై ఉండలేదా?  శ్రీశైలం కొండపై బ్రమరాంబికా సమేత మల్లికార్జునుడు కొలువుదీరలేదా? అంటూ కొత్త వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అలాగే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్  వంటి కొండలపై నివాసాలు వెలిశాయి కదా అని  ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని నివాసాలు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మితమై ఉంటే.. ఆ విషయాన్ని కోర్టుల్లో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిషికొండపై నిర్మాణాలు కూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని జాతీయ హరిత ట్రైబ్యునల్ కుండ బద్దలు కొట్టింది. అయినా వాటిని వేటినీ పట్టించుకోకుండా రిషికొండకు గుండు కొట్టి మరీ జగన్ సర్కార్ నిర్మాణాలను కొనసాగిస్తోంది? అదేమిటంటే.. దేవుళ్ల ఆవాసాలను ప్రస్తావిస్తున్నారు వైసీపీ నేతలు. ఎవరి నాయకుడు వారికి దేవుడితో సమానమైతే అవ్వోచ్చు కానీ, తామనుకుంటున్నదే సర్వ జనులూ అనుకుని తారాలంటూ మాట్లాడటమే అతిగా అనిపిస్తోంది. అయినా జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హిందూ ఆలయాలు, దేవుళ్లే లక్ష్యంగా జరిగిన దాడులను కాకతాళీయంగా భావించలేని పరిస్థితిని ఆయన, ఆయన పార్టీ నేతలే స్వయంగా కల్పిస్తున్నారు. హిందువులంతా కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సాగుతున్న చర్యలపై హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని జగన్ సర్కార్ అసలు కన్సిడర్ చేయడం లేదు. ఒకటనేమిటి.. సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకలు, జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో తెలియంది కాదు.  వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం,  టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న  నిర్ణయాల హిందూ మత విశ్వాసాలకు విరుద్ధంగానే ఉన్నాయి.  హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తిరుమలను టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో వ్యక్తమౌతోంది. అన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వెంకన్న దేవుడిని నల్ల రాయిగా అభివర్ణించిన కరుణాకరరెడ్డిని నియమించడంతో రాష్ట్రంలో కొత్తా దేముడవతరించాని వైసీపీ ప్రచారం చేసుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

మీడియా ఎదుట సజ్జల తడబాటు.. యార్లగడ్డకు హిత వాచకాలు!

ఏపీ ప్రభుత్వ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి యార్లగడ్డ సెగ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. పార్టీలో , ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న సజ్జలపై గతంలో కూడా ఎమ్మెల్యేలు, మాజిలైన మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పుడెప్పుడూ లేని విధంగా యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరుకున పడేశాయి.  దీంతో ఆయన అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి తనను తాను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లు ఆయనను ఓ ఆట ఆడుకోవడానికి  మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన వివరణ.. వైసీపీ ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో విధానంలోనే వాడుకుంటుందన్న విషయాన్ని మరో సారి తేటతెల్లం చేసేశాయి. ఇంతకీ వైసీపీని వీడుతూ యార్ల గడ్డ ఏమన్నారంటే..  అమెరికా నుంచి తీసుకొచ్చి జగన్ రెడ్డి తనను నడి సముద్రంలో వదిలేశారని ఆరోపించారు.   తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు.  చంద్రబాబు అవకాశం ఇస్తే గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతాననీ, గెలుస్తాననీ ధీమా వ్యక్తం చేశారు. అలా గెలిచిన తరువాతే.. ఒక వేళ పులివెందుల నుంచి జగన్ విజయం సాధిస్తే.. అప్పుడే అసెంబ్లీలో ఆయనను కలుస్తానన్నారు.  తాను పార్టీకి ఎంతో సేవ చేశాననీ, అయినా సజ్జల తనను కూరలో కరివేపాకులా తీసి పారేశారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం అప్పాయింట్ మెంట్  కోరితే సజ్జల పడనివ్వలేదనీ, గట్టిగా అడిగితే  ఉంటే పార్టీలో ఉండు.. పోతే పో అన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.  మూడేళ్లుగా సజ్జల తనను అవమానిస్తూనే ఉన్నారనీ, పంటి బిగువన భరించాననీ, కానీ ఇప్పుడు ఉంటే ఉండు పోతే పో అనడాన్ని మాత్రం సహించలేకపోయాననీ వెల్లడించారు.  ఈ విషయాలన్నీ యార్లగడ్డ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో సజ్జల మీడియా ముందుకు వచ్చారు. తానలా అనలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందర్భంగా ఆయన అన్న మరో  మాట ఆయన యార్లగడ్డను ఉంటే ఉండు, పోతే పో అన్నారనే అందరూ నమ్మడానికి దోహదం చేశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే.. ఎవరైనా ఇలాంటి విషయాలు బహిరంగంగా చెబుతారా? అలా చెప్పడం సమజసం కాదని అనడంతో  అంతా సజ్జల యార్లగడ్డకు పొగపెట్టారని నమ్మే పరిస్థితి ఏర్పడింది.  తాను యార్లగడ్డకు టికెట్ విషయంలో హామీ అయితే ఇవ్వలేదనీ, అలాగని వచ్చే ఎన్నికలలో పోటీకి చాన్స్ లేదని కూడా చెప్పలేదని వివరణ ఇచ్చారు.  గన్నవరంలో వంశీ, యార్లగడ్డలలో ఒకరిటే టికెట్ లభిస్తుందన్న కోణంలో మాత్రమే తాను ఆయనతో మాట్లాడానని చెప్పుకున్నారు.  అయినా ఇటువంటి చర్చలు పార్టీలో అంతర్గతంగా జరుగుతాయనీ, వాటిని ఇలా బహిర్గతం చేయడం మంచిది కాదంటూ యార్లగడ్డకు హితవు పలికారు. నాలుగు గోడల మధ్య తానేం అన్నా భరించాలి అన్న చందంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని నెటిజన్లు విమర్శలు  గుప్పిస్తున్నారు. సజ్జల తీరు చూస్తుంటే.. వల్లభనేని వంశీ కోసం యార్లగడ్డకు పొగబెట్టారనీ, ఆయన ఎదురు తిరగడంతో కంగారు పడుతున్నారనీ అర్ధమౌతోందని పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అనుమానంతోనే నలుగురు ఎమ్మెల్యేలను బహిష్కరించిన వైసీపీ.. మాజీ ఎమ్మెల్యే మాటలకు ఎందుకు అంత ఉలిక్కి పడుతోంది. గన్నవరంలో వంశీకి అనుకూలంగా సజ్జల వ్యవహరించిన తీరు బూమరాంగ్ అవుతోందన్న భయం వెంటాడుతోందా? అన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  అలాంటి భయమే లేకపోతే ఎన్నడూ లేనిది మీడియా ముందుకు వచ్చి.. నేనేం అనలేదు మహప్రభో అని వేడుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో బాలినేని వంటి వారు తనపై విమర్శలు గుప్పించినా స్పందిచని సజ్జల ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవడానికి తహతహలాడారు అని నిలదీస్తున్నారు. 

పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడు?.. పవన్ మాటల ఆంతర్యం ఏంటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారా? పొత్తులు ఖాయం.. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతున్నాయన్న హింట్ ఇచ్చారా? తెలుగుదేశంలో జనసేన ఒక్కటే కలిసి నడుస్తుందా? బీజేపీని కూడా కలుపుకుని వస్తుందా? అన్న విషయం ఒక్కటే తేలాల్సి ఉందని ఆయన చెబుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వారాహి మూడో విడత యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి.. వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే ముందుకు వెళతాం అని నిక్కచ్చిగా చెప్పేశారు. పొత్తుల విధి విధానాలపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. దీంతో మరో సారి ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు కలిసి ఎన్నికల బరిలో దిగుతారు. సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది అన్న చర్చలు జోరందుకున్నాయి.  తెలుగుదేశం, జనసేన,బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతాయా? 2014 నాటి పరిస్థితిని పునరావృతం చేస్తాయా? లేకపోతే.. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలు కలిసి రంగంలోకి దిగుతాయా, తెలుగుదేశం ఒంటరిగానే ఎన్నికల రణరంగంలో తన సత్తా చాటుతుందా? లేక బీజేపీని వదుల్చుకుని జనసేన తెలుగుదేశంతో చేతులు కలుపుతుందా? అన్న విషయంలో సర్వత్రా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పైన అనుకున్న మూడు ఆప్షన్లకే అవకాశం ఉందని, మరి జనసేన వాటిలో ఏ ఆప్షన్ ను ఎంచుకుంటుందో తెలియాల్సి ఉందనీ పరిశీలకులు అంటున్నారు.  రాష్ట్రంలో పొత్తల విషయంలో మొట్టమొదటిగా మాట్లాడింది జనసేనానే కావడంతో ఇప్పుడు బంతి కూడా ఆయన కోర్టులోనే ఉంది. పొత్తులు లేకుండా పోటీ చేస్తే 2019 ఫలితమే పునరావృతమౌతుందా అన్న అనుమానాలు జనసేనానిలో బలంగా ఉన్నాయనీ, వారాహి యాత్రలో ఆయన చేస్తున్న ప్రసంగాలను బట్టి అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. అధికారంలోకి రావాలని తాను అనుకుంటే చాలదనీ, ప్రజలు కూడా అనుకోవాలి అంటూ ఆయన చెబుతున్న మాటలు.. జనసేనాని ఉద్దేశాన్ని చాటి చెబుతున్నాయి.   ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారైనా సరే బీజేపీ పొత్త వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించరు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆ పార్టీతో పొత్తు ఉంటే బెటర్ అన్న భావనతో ఉంటారు. జనసేనాని మాటలను బట్టి చూస్తుంటే.. ఆయన ఉద్దేశం కూడా అదే అన్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఇక తెలుగుదేశంను కలుపుకుని పోకుండా ఒక్క బీజేపీని నమ్ముకుని జనసేన ముందుకు సాగితే.. ఆ పార్టీతో పాటుగా మునక తప్పదని  పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.  సాధ్యమైనంత వరకూ జనసేన తన మిత్రపక్షం బీజేపీని కూడా తెలుగుదేశంతో పొత్తులోకి తీసుకువద్దామన్న ఉద్దేశంతో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది కుదరకపోతే కమలానికి బైబై చెప్పేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పొత్తుల విషయంలో ఒకింత బెట్టుగా వ్యవహరించి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను పొందాలన్న వ్యూహంతో జనసేనాని ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూడా  పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందనీ, తొందరపాటు అవసరం లేదనీ, అవసరమైతే ఒంటరిగానే సత్తా చాటాలన్న ఉద్దేశాన్ని చాటుతోందని అంటున్నారు.  ఇక బీజేపీ విషయంలో తెలుగుదేశం ఒక స్పష్టతతో ఉందనీ, కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీ లోని జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ.. పొత్తుకు వస్తామంటూ తెలుగుదేశం పార్టీకి స్నేహహస్తాన్ని చాటితే ఆ చేయి అందుకోవడానికి తాము సిద్ధంగా లేవని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ అక్రమాలు, తనపై జరిగిన దాడుల వివరాలతో రాసిన  లేఖకు అటువైపు నుంచి వచ్చే సమాధానాన్ని బట్టే కమలం పార్టీలో పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని తెలుగుదేశం చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని నోట పొత్తలు ఖాయం.. చర్చలు జరుగుతున్నాయన్న మాట రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

అన్నా చెళ్లెళ్ల పోరు.. ఇంటిగుట్టు బయటపడేనా?

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో అసలేం జరుగుతుంది? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఎందుకు దూరమయ్యారు? జగన్, ఆయన భార్య భారతిలను మినహాయించి మిగతా కుటుంబ సభ్యులంతా ఎందుకు ఒక్కటయ్యారు? కేవలం ఆస్తి తగాదాల వలనే వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చిందా? లేక పదవుల దగ్గర తేడా వచ్చిందా? అసలెందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఇదే ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారితో పాటు రాజకీయ వర్గాలలో కూడా జరుగుతున్న చర్చ. తెలంగాణలో పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాలకు దూరమైన వైఎస్ షర్మిల ఇప్పుడు తిరిగి ఏపీ రాజకీయాలలోకి వెళ్లడం దాదాపు ఖాయమైపోయింది. ఆ మాటకొస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి అలనాడు తన తండ్రి బాధ్యతలు నిర్వహించిన పీసీసీ పదవిలో ఆమర కుమార్తె షర్మిల క్రీయాశీలక రాజకీయాలు నడపనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెరవెనుక సన్నాహాలన్నీ పూర్తి కాగా, ఇక అధికారిక విలీనమే తరువాయిగా రాజకీయ వర్గాలు   చెబుతున్నాయి.  దీంతో సహజంగానే వైఎస్ కుటుంబంలో విబేధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక షర్మిలను రాజ్యసభకు పంపించాలని ప్రతిపాదన వచ్చింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజస్కంధాలపై మోసిన షర్మిల తనను రాజ్యసభ సభ్యురాలిగా  చేయాలని కోరడం తప్పేమీ కాదు. కానీ, అన్న జగన్ ఈ విషయాన్ని దాటవేస్తుండడంతో తల్లి విజయమ్మ నుండి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో జగన్ మరింత మొండిగా మారిపోయారు. అసలే అప్పటికే ఆస్తి పంపకాలలో కినుక వహించి ఉన్న జగన్-భారతి దంపతులు షర్మిలను రాజ్యసభకు పంపేందుకు అసలు ఇష్టపడ లేదు. దీంతో షర్మిల మరో పార్టీతో ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం ఈ వ్యవహారాన్ని సామరస్యంగానే చక్కదిద్దుకోవాలని, అన్నా చెళ్లెళ్ల మధ్య సయోధ్య కుదర్చాలనీ అప్పట్లో ప్రయత్నించారు. కానీ, జగన్ అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడమే కాకుండా..  షర్మిల ఏపీ రాజకీయాల జోలికి రాకూడదని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారితో తీవ్ర హెచ్చరికలు పంపారని అప్పట్లో ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. ఆ కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్నాటు చేశారని అంటున్నారు. కాగా, షర్మిల తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో  ఇప్పుడు ఎలాగైనా తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో   ఏపీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే  కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం ప్రతిపాదన బయటకి రాగానే జగన్ మరోసారి షర్మిల, తల్లి విజయమ్మకు హెచ్చరికలు పంపారట. గతంలో తెలంగాణకి వెళ్ళిపోతామంటేనే ప్రాణభిక్ష పెట్టానని, ఇప్పుడు మళ్ళీ ఇలా ఏపీ రాజకీయల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారని వైఎస్ కుటుంబంతో సన్నిహిత పరిచయాలున్న వారి ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్నది. అంతే కాకుండా ఏపీ ప్రభుత్వం తరపు నుండి  షర్మిలకు భద్రత కోసం ఇచ్చిన ఇద్దరు గన్ మెన్ లను ఉపసంహరించుకున్నారు. దీంతో  విజయమ్మ తనకు కేటాయించిన   గన్మెన్లను కూడా వెనక్కు వెళ్లిపోవాలని స్వచ్ఛందంగా కోరడంతో జగన్ వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే, ఏ క్షణమైనా నలుగురు గన్ మెన్ లను జగన్ సర్కార్ ఉపసంహరించుకున్నా  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనమై  షర్మిల ఏపీ రాజకీయాలలోకి అడుగుపెడితే ఈ ఆదేశాలు రావడం గ్యారంటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్ వివేకా హత్యకేసులో సునీతకు షర్మిల మద్దతు ఇవ్వడం వెనక కూడా అన్న చెల్లెళ్ళ మధ్య విబేధాలే కారణంగా చెబుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా.. అన్న విజయం కోసం తన శక్తికి మించి సాయం చేసినా.. తనకు పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టడం.. కనీసం సోదరి అనే మమకారం కూడా లేకుండా బెదిరింపులకు దిగడం సహించలేకనే షర్మిల.. వివేకా హత్యకేసులో స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఇక అన్న జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే షర్మిల ఏపీ రాజకీయాలలో క్రియాశీలం కానున్నట్లు  తెలుస్తున్నది. అదే జరిగితే వైఎస్ కుటుంబంలో కలహాల దగ్గర నుండి.. వైఎస్ వివేకా దోషుల వరకూ అన్ని అంశాలు బయట పడడం ఖాయంగా కనిపిస్తున్నది!

ఇచ్చిందెంత.. దోచిందెంత? నిగ్గదీసి అడుగుతున్న జనం!

 ఏదేశమైనా,  ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన చాలా ముఖ్యం. రాష్ట్రంలో అన్ని వసతులు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే ప్రజలకు సంక్షేమం అందుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ఇదంతా ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్న ప్రక్రియ. ఈ ప్రక్రియను అవలంబిస్తేనే ఏ ప్రభుత్వమైనా నిలబడేది. మాది భిన్నమైన పాలన.. కేవలం సంక్షేమమే మా నినాదం అంటే ఆ ప్రభుత్వం బొక్కబోర్లా పడడం ఖాయం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా  ఉంటేనే ఆ రాష్ట్రం సుభీక్షంగా ఉంటుంది. ఇందులో ఏది వదిలేసినా ఆ రాష్ట్రంలో   ప్రజల ఆర్ధిక స్థితి దిగజారడం, వలసలు పెరగడం వంటివి తప్పదు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే.  రాష్ట్రానికి ఇతర దేశాల పెట్టుబడులు చాలా అవసరం. అందుకే ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకొని.. రాష్ట్రానికి వస్తే రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తుంటారు. టీడీపీ హయంలో కూడా గన్నవరం విమానాశ్రయానికి కొన్ని మెరుగు దిద్ది అంతర్జాతీయ విమానాల రాక కోసం ప్రభుత్వం విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కొన్ని నెలల పాటు ప్రభుత్వమే కొన్ని టికెట్ల ధరను చెల్లించేలా ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో అంతర్జాతీయ   రూట్లలో సర్వీసులు మొదలు అయ్యాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రాయతీలు ఆపేశారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఒక మాట చెప్పారు. విమాన సర్వీసుల కంటే తల్లీ బిడ్డల ఆరోగ్యం ముఖ్యమని, ఆ రాయితీలు ఆపేసి ఆ డబ్బును గర్భిణీ, బాలింతల పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.  ఆనాడు బుగ్గన చెప్పిన ఆ మాటలు ఆహా ఓహో అనిపించి ఉండొచ్చు. జగన్ సర్కార్ పేదల కోసమే ఆలోచిస్తుందని, సంక్షేమ ఫలాలు తమకు అందుతాయని ప్రజలు భావించి ఉండొచ్చు. కానీ, వాస్తవంలో  వైసీపీ పంచేందుకు ఇప్పుడు తగిన ఆదాయం లేదు. కొండలా పేరుకుపోయిన అప్పులతో కొత్త అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరం జరిగిన వైసీపీ ప్రభుత్వం.. కేవలం బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడానికే పరిమితమైంది. పరిశ్రమలు రాక.. పెట్టుబడి దారులు రాష్ట్రం వైపు చూడక నిరుద్యోగులంతా పక్క రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం దిగజారిపోయింది. ఆదాయం సరిపోక ప్రభుత్వం రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రోత్సాహక రాయతీలు వంటి వాటికి మంగళం పాడేసింది. కేవలం ఏ నెలకి ఆనెల వచ్చే ఆదాయానికి తోడు మరికొంత అప్పుచేసి పెన్షన్లు, జీతాలు, సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడానికే పాలన పరిమితమైపోయింది.  దీంతో ఏపీ ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై ఒకరకమైన ఏహ్య భావన కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కొత్తగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువే సంక్షేమాన్ని అందించారు. జగన్ వాటికి పేర్లు మార్చి నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తున్నారు. దానికి కూడా భారీగా ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. రేషన్ డోర్ డెలివరీ లాంటి పథకాలు హంబక్ కావడం.. ప్రకటించే ప్రతి పథకానికి వంద కొర్రీలు పెడుతూ కోతలు విధించడంతో.. ఆ ఫలాలు అందినా ప్రజలలో సంతృప్తి కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీలో అంతర్మధనం మొదలైంది. తాము ఇంత చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదేంటి అని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పీపుల్ సర్వేలు తీసుకుంటున్నారట. అయితే, కొందరు లబ్ధిదారులు లెక్కలేసి మరీ మీరిచ్చింది ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. ఇదిగో మేము కుటుంబానికి రూ.2 లక్షల వరకూ ఇచ్చామని వైసీపీ నేతలు చెప్తుంటే.. ప్రజలు తిరిగి నేతలకు దిమ్మతిరిగే సమాధానమిస్తున్నారు. మీరిచ్చే దానిలో పెన్షనే  అధిక భాగం పెన్షనే ఉందనీ.. పైగా ఉందని.. అది గత ప్రభుత్వంలోనే పెంచారని, మిగతా మొత్తం గత ప్రభుత్వంలో కూడా అందిందని.. ఇప్పుడు వాటి పేర్లు మార్చి మాయ చేసారని లెక్కలు చెప్పడంతో నేతల ఏం చెప్పాలో.. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడ్డారు. ప్రజల ముందుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. అంతేకాదు, మీరిచ్చిన దాని కంటే వందరెట్లు ఎక్కువగా రేట్లు పెంచి మా దగ్గర నుండి లాగేసుకున్నారని  గణాంకాలతో సహా చెబుతున్నారు.ఈ ప్రజా చైతన్యం వైసీపీకి కాళ్ల కింద భూమిని కదిలించేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సంగతి అటుంచి.. అసలు ప్రచారం కోసం జనం ముందుకు వెళ్లడం ఎలా అన్న గుబులు వారిలో మొదలైందంటున్నారు.  

బైజూస్ పోయె.. ఎడెక్స్ వచ్చే ఢాం..ఢాం.. ఢాం

ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థతో  చేస్తున్న ప్రయోగాలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి దోహదపడటం సంగతి అటుంచి.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసికంగా, ఆర్థికంగా నానా అగచాట్లకు గురి చేస్తున్నది. జగన్ ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెట్టి.. విద్యావ్యవస్థతో చేస్తున్న ప్రయోగాలతో రాష్ట్రంలో విద్య కుంటుపడింది. అమ్మ ఒడి వంటి పథకాలలో కోతల వల్ల అనేకమంది అర్ధంతరంగా చదువు మానేసి డ్రాప్ ఔట్ లుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో విద్యాసంస్కరణల పేరిట ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో జగన్ సర్కార్  ఒప్పందం చేసుకుంది. దీంతో హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించేందుకు వీలు కలగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. ఏపీ ఉన్నత విద్యారంగంలో ఇదొక  గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం జగన్  తన భుజాలను తానే చరుచుకుంటున్నారు. దాదాపుగా ఇలాంటి ఘనమైన మాటలతోనే  బైజూస్ అనే సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది.   భారత్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ లో పిల్లలకు చదువులు చెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగ ముచ్చట పడింది. వెనుకా ముందూ చూడకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి  పిల్లలకు ట్యాబ్ లు కూడా అందజేసింది.  ట్యాబ్ లలో చదువు చెప్పేదుకు బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  అయితే ఆ చదువులు పిల్లలకు ఒంటబట్టలేదు. ప్రతి సంవత్సరం 8వ తరగతికి వచ్చేసుమారుఐదు లక్షల మందికి ట్యాబ్ లుఇచ్చి వారికి బైజూస్  సిలబస్ ను అందించింది. బైజూస్ ను నమ్ముకుని పిల్లలకు ట్యాబ్ లను అందించిన ప్రభుత్వం  బైజూస్ పీకల్లోతు ఆక్రమాలలో మునిగి పోయి చేతులెత్తేసింది. బైజూస్ సంస్థ 28వేల కోట్ల  అవినీతికి  పాల్పడిందని సీబీఐ, ఈడీలు చెబుతున్నాయి.   28 వేల కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులు రాబట్టి వాటిని లెక్కల్లో చూపలేదని సీబీఐ, ఈడీలు పేర్కొన్నాయి. సరే బైజూస్ అవినీతి సంస్థ కావడం వల్లనే జగన్ సర్కార్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్ ను ఫణంగా పెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరే బైజూస్ తో  జగన్ సర్కార్  ఒప్పందం  మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అందు కోసం ప్రభుత్వం వ్యయం చేసిన కోట్లాది రూపాయలు గంగలో కలిపోయాయి. ఇక ఆ తరువాతైనా విద్యావ్యవస్థతో అడ్డగోలు ప్రయోగాలకు జగన్ సర్కార్ స్వస్తి చెబుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు   ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ కోర్సులు అందించడమే లక్ష్యం అంటూ జగన్ సర్కార్   పేరిట ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో   ఒప్పందం కుదుర్చచుకుంది. మరి ఈ ఒప్పందం భవిష్యత్ లో ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు.  

తెలుగుదేశం గూటికే యార్లగడ్డ!

యార్లగడ్డ దారెటు అన్న విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమైంది. శుక్రవారం (ఆగస్టు 18)  యార్లగడ్డ తన ముఖ్య అనుచరులతో శుక్రవారం (ఆగస్టు 18)న సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలిపారు. అంతే కాకుండా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయనను కోరనున్నట్లు చెప్పారు. తన విజ్ణప్తిని చంద్రబాబు పరిగణనలోనికి తీసుకుని పార్టీ టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా యార్లగడ్డ దారెటు అన్న చర్చకు తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్ల క్లారిటీ ఇచ్చేసి తెర దించారు. మొత్తం మీద రానున్న రోజులలో వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం వాస్తవమేననడానికి యార్లగడ్డ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని  పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలూ తాము తెలుగుదేశంకు దగ్గరౌతున్నామని విస్పష్టంగా చెప్పేశారు. అంతే కాకుండా రానున్న రోజులలో జగన్ పార్టీలో ఉండేవారెవరు, పార్టీని వీడి పోయే వారెవరు అన్న ప్రశ్నకు వైసీపీ అగ్రనాయకత్వమే కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితులలో ఉంది. రానున్న రోజులలో పార్టీ నుంచి వలసలు భారీగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  మొన్నటికి మొన్న  విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా  నుండి మరో నాయకుడు యార్లగడ్డ పార్టీ వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని అమరావతికి అటు కృష్ణా, ఇటు గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఈసారి ఎన్నికలలో విజేతలను నిర్ణయించడంలో అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే.  జగన్ మూడు రాజధానుల  జపం పుణ్యమా అని ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో ఈసారి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది  పరిశీలకుల విశ్లేషణ. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలో చాలా మంది నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ   గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరడం ద్వారా  ఒక దారి చూపారని కూడా విశ్లేషకులు అంటున్నారు.   వాస్తవానికి   చాలా కాలంగా యార్లగడ్డ వైసీపీని వీడడం ఖాయమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతూనే ఉంది. అయితే ఈ రోజు వరకూ వరకూ ఆయన  స్వయంగా  పార్టీ మార్పు విషయం కానీ, ఏ పార్టీలో చేరతాను అన్న విషయాన్ని కానీ చెప్పలేదు.    వైసీపీ అధిష్టానం దిగివచ్చి తన అసమ్మతిని, అసంతృప్తిని అడ్రస్ చేసి.. ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తుందా అని ఇన్ని రోజులూ వేచి చూశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే రోజులు గడిచిపోతున్నా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో..   ఆయన తెలుగుదేశంలో చేరనున్నట్లు ప్రకటించేశారు.  బహుశా  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో  సాగుతున్న సమయంలో యార్లగడ్డ టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు.  గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేసి తన సత్తా చాటుకోవాలని యార్లగడ్డ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారనీ అంటున్నారు. ఇటీవల యార్లగడ్డ తన అనుచరులతో  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఆ సందర్భంగా చేసిన ప్రసంగం కూడా ఆయన తెలుగుదేశం గూటికి చేరనున్నారని అంతా భావించడానికి కారణమైంది.  ఎక్కడో అమెరికాలో వ్యాపారాలు చేసుకునే యార్లగడ్డను  వైసీపీ   2019 ఎన్నికల సమయంలో  అతి కష్టమ్మీద పార్టీలో చేర్చుకుంది. అప్పుడు తెలుగుదేశం నుండి గన్నవరం బరిలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించడమే లక్ష్యంగా యార్లగడ్డని గన్నవరం బరిలో నిలబెట్టింది. తన రాజకీయ అరంగేట్రం విజయంతో ఆరంభం కావాలన్న ఉద్దేశంతో నాటి ఎన్నికలలో యార్లగడ్డ భారీగానే ఖర్చు చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే ఆ ఎన్నికలలో రాష్ట్రం అంతటా వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచినా తెలుగుదేశంకు గట్టి పట్టు ఉన్న గన్నవరంలో మాత్రం ఓటమి చవిచూసింది. దీంతో వైసీపీ యార్లగడ్డను పక్కన పెట్టేసి తెలుగుదేశం తరఫున విజయం సాధించిన వల్లభనేని వంశీని పార్టీ పంచన చేరుకుంది. వంశీ కూడా అధికారికంగా వైసీపీ తీర్ధం కప్పుకోకపోయినా.. ఆయన వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు.  వచ్చే ఎన్నికలలో గన్నవరం వైసీపీ టికెట్ వల్లభనేని వంశీకే దక్కుతుందనీ, ఈ మేరకు ఇప్పటికే వంశీకి జగన్ స్పష్టత ఇచ్చారనీ అంటున్నారు. దీంతో సహజంగానే యార్లగడ్డ వైపీపీతో చాలా కాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా వంశీపై బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన ఎప్పుడో వైసీపీతో అనుబంధం తెంచుకున్నారనీ, ఇక ఇప్పుడు పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ఆయన చేసిన ప్రకటన లాంఛనమేని అంటున్నారు.    

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్‌ సాయన్నఅనారోగ్యంతో మరణించారు.అయితే ఆయన  మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి.  మల్లారెడ్డి కొద్దిరోజుల క్రితం వరకూ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో  కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో  ఆయన మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా వ్యవహరించారు. . ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. 

జగనన్న వదిలిన బాణం రివర్స్

ఏపీలో జగన్ పాలన మొత్తం రివర్స్ లో సాగుతోంది. ప్రత్యర్థులపైకి విపక్షంలో ఉండగా ఆయన వదిలిన బాణం సోదరి షర్మిల కూడా ఇప్పుడు రివర్స్ అయ్యారు.  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారా అంటే నిన్న మొన్నటి వరకూ  ఏమో చెప్పలేం అన్న సమాధానమే వినిపించింది. కానీ  ఇప్పుడు  స్పష్టత వచ్చేసింది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. అలాగే విలీనం కోసం కాంగ్రెస్ విధించిన షరతులు, చేసిన ప్రతిపాదనలకు కూడా ఒకే చెప్పేశారు.  ఇప్పుడు షర్మిల పార్టీ విలీనమే   తెలంగాణ, ఏపీ రాజకీయాలలో హాట్ టాపిగ్ గా మారిపోయింది. త్వరలోనే ఈ విలీనం ప్రక్రియ పూర్తి కానుందనీ, ఆ తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలలో కీలకం కానున్నారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్యా ఈ మేరకు అంగీకరం కుదిరిందనీ, షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకారం తెలిపారనీ, ఇక మిగిలింది అధికారిక విలీనం ప్రక్రియ మాత్రమేనని, అది కూడా ఈ నెలలోనే పూర్తి అవుతుందని ఇరు పార్టీలలోని కీలక నేతలూ బాహాటంగానే చెబుతున్నారు.  తానే అధ్య‌క్షురాలిగా మొదలైన వైఎస్ఆర్టీపీ పార్టీ మొదట్లో కాస్త దుడుకుగా కనిపించినా అది పాలపొంగులా చల్లారిపోయింది. తెలంగాణ సమాజం షర్మిలను సీరియస్ గా పట్టించుకోలేదు. అందుకే ఆ పార్టీ ప్ర‌జ‌ల్లోకి  వెళ్ల‌లేక‌పోయింది. దీంతో కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ మైలేజి బాగా పెరిగింది.   సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక  ఉపముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ రంగంలోకి దిగి షర్మిల ముందు విలీనం ప్రతిపాదన ఉంచారు.  అక్కడ నుంచి ఎన్నో చర్చలు, సందేహాలు, మలుపుల తరువాత ఆ ప్రతిపాదనకు షర్మిల అంగీకరించారు.  కాగా, షర్మిల పార్టీ విలీనం అధికారికంగా ప్రకటించిన తరువాత ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపడితే.. ఆమె తన విమర్శల వాగ్బాణానలు సంధించాల్సింది మొట్టమొదట తన  అన్న జగన్ పైనే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేకులపై విమర్శలతో చెలరేగిపోయిన షర్మిల ఇప్పుడు తనను వదిలిన జగనన్ననే టార్గెట్ చేసుకుని పని చేయాల్సి ఉంటుంది. అదీకాక ఇప్పుడు  వైసీపీలో కనిపిస్తున్న నేతలు, కార్యకర్తలు అందరూ పాత కాంగ్రెస్ నేతలే. కనుక షర్మిల ఇప్పుడు ఏపీలో క్రియాశీలంగా మారగానే  మొదట టార్గెట్ చేయాల్సింది వైసీపీనే. యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే.  దీంతో షర్మిల ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే చర్చ సహజంగానే మొదలైంది. ఏపీకి వెళ్లాలా వద్దా అని నిన్న మొన్నటి వరకూ తర్జన భర్జన పడిన షర్మిల.. ఇప్పుడు ఎందుకు ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో ఉండగా వైసీపీ పార్టీకి అన్నీ తానై నడిపించారు. ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి అదే వైసీపీ మీద పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే ఇప్పుడు ఇక్కడ ప్రధానాంశంగా మారింది. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల ఇప్పుడు అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే  ఆయన ప్రభుత్వంపైనే దండయాత్రకు రెడీ అయిపోయారు.  నిజానికి ఏపీకి వెళ్లడం ఇష్టం లేకనే షర్మిల కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సాగదీశారు. కానీ, అదే సమయంలో ఏపీ ప్రభుత్వ పెద్దల నుండి, సొంత అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటరీ నుండి వేధింపులు ఎక్కువ కావడం.. తిరిగి ఏపీ రాజకీయాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని బెదిరింపులు రావడం వంటి పరిణామాలే షర్మిలను అన్నపై పోరాటానికి సిద్దపడేలా చేశాయని వైఎస్ కుటుంబం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ షర్మిలకు అండగా నిలుస్తామని, అన్ని విధాలుగా సహకారం అందిస్తామనీ హామీ ఇచ్చారనీ రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే షర్మిల అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఒకప్పుడు జగనన్న వదలిన బాణాన్నీ అని జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ పెద్దలు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారని.. ఇప్పటికే నాయనా భయానా షర్మిల, విజయమ్మలను ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ చేసిన రాయబారాలు విఫలమయ్యాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

టీటీడీ కర్రపెత్తనం!

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది మన తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచ నలుమూలల నుండి కలియుగ   దైవం వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తజన కోటిని ఉలికిపాటుకు గురిచేసింది. దీంతో టీటీడీ నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని అంతా దుమ్మెత్తి పోశారు. విపక్షాలైతే.. అసలు తిరుపతి అడవిలో ఏం జరుగుతుంది.. ప్రశాంతంగా అడవిలో బతికే మృగాలు తిరుమల భక్తులపైకి ఎందుకొస్తున్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో టీటీడీ ఏదో ఒకటి చేసి విమర్శల నుంచి, ప్రశ్నల నుంచి బయటపడాలని భావించింది. చిరుతలను బంధించాలని ఆదేశించింది. దాడి చేసిన చిరుతను దృష్టిలో పెట్టుకొని ఇందుకోసం ఆపరేషన్ చిరుత స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ చిరుతల వేటలో వంద మంది అటవీ సిబ్బంది పాల్గొనగా.. తిరుమలలో ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. గురువారం బోనులో మరో చిరుత చిక్కగా ఇంకా 3 నుంచి 4 చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలా ఉండగానే టీటీడీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ముందుగా చిన్నారిపై చిరుత దాడి ఘటన వెలుగులోకి రాగానే టీటీడీ ఆఘమేఘాల మీద ఏవేవో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. అవన్నీ కఠిన నిర్ణయాలని చెప్పుకొచ్చింది. వాటిని శరవేగంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఏదేదో కఠిన నిర్ణయాలని చెప్పి నడక మార్గంలో తిరుమలకి వెళ్లే భక్తులకు ఊత కర్రలను సిద్ధం చేసింది. కాలినడక మార్గంలో వన్యప్రాణుల సంచారం అధికమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్లే భక్తులకు చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. ఒక్కో భక్తుడికి ఒక్కో చేతి కర్రను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ వాలంటీర్లు, సిబ్బంది ద్వారా వీటిని సరఫరా చేస్తున్నారు.  చిరుత దాడితో టీటీడీ కఠిన నిర్ణయాలు అంటే వెంకన్న భక్తులు ఏదేదో ఊహించుకున్నారు. కానీ చివరికి చేతికి ఊత కర్ర ఇవ్వడంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. టీటీడీ నిర్ణయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కర్రలతో పులులు, సింహాలను వేటాడాలా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భద్రత అంటే కర్రలు ఇవ్వడం కాదు.. రక్షణ గోడలు బలోపేతం చేయాలని   కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే టీటీడీ ప్రకటించిన ఊత కర్ర సోషల్ మీడియాలో అతి పెద్ద ట్రోలింగ్ గా మారింది. నిత్యం వెంకన్న కోసం లక్షల మంది భక్తులు వస్తుంటారు. అలాంటిది ఒక మనిషికి ఓ కర్ర సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఈ కర్ర సిద్ధాంతం అమలు చేయాలంటే కొన్ని వేల కర్రలు కావాలి. అది కూడా కొండపైకి పంపించే కర్రలను కొండమీద కలెక్ట్ చేసుకోని మళ్ళీ తిరిగి కొండ దిగువకి తేవాలి. కనీసం ఇలా చేయాలన్నా కొన్ని ఎకరాల్లో అడవిని నాశనం చేయాలి. ఇందు కోసం మరింత సిబ్బంది కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కర్ర మీద సామే.  అందుకే సోషల్ మీడియాలో ఈ నిర్ణయం పై రకరకాల సెటైర్లు పడుతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ పాలకవర్గం, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భక్తులకు కర్రలు కాకుండా తుపాకులు ఇవ్వాలా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాయి. మొత్తానికైతే టీటీడీ ఊతకర్రల నిర్ణయం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తిరుమల అంటే హిందువులకు ఒక నమ్మకం. కొండ ఎక్కితే ఆయనే తన మోర ఆలకించి ఆదుకుంటాడని ఒక ధీమా. కానీ ఇప్పుడు తిరుమలలో అదే కొరవడింది. ఏడుకొండలవాడి కోసం నడకమార్గంలో వచ్చే భక్తులకు భద్రంగా తిరుమల చేరుకుని వెంకన్న దేవుడి దర్శనం చేసుకుంటామా అన్న నమ్మకం   లేకుండా పోయింది. ఎప్పుడు ఏమవుతుందో, ఏ మృగం తమపై దాడి చేస్తుందోనని కొండెక్కే ప్రతి భక్తుడు భయం భయంగా అడుగులేసే పరిస్థితి వచ్చింది.  దీంతో భక్తులు ఏడుకొండలవాడా వెంకటేశ.. అయ్యో ఇదేం దుస్థితయ్యా నీ భక్తులకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధం ప్రకటించిన విపక్షం.. వైసీపీ హ్యాండ్సప్?!

ఏపీలో ప్రతిపక్ష నేతలు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా వరసపెట్టి యాత్రలు చేపడుతూ దూసుకెళ్తున్నారు.  ఇంకా చెప్పాలంటే ఏపీలో ఉన్న జిల్లాలను అన్నీ ఒకటికి పదిమార్లు కలియతిరిగే పని పెట్టుకొని ఇప్పటికే కొన్ని జిల్లాలను పూర్తి చేశారు. వెళ్ళిన ప్రతీ చోటా జనాల స్పందన కూడా విపక్ష నేతలకు బ్రహ్మరథం పడుతున్నట్లుగానే ఉంది. ఎక్కడిక్కడ ఘన స్వాగతాలు లభిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎన్నికల వరకూ కూడా లోకేష్ ప్రజలలోనే ఉంటారు. చంద్రబాబు కూడా రాయలసీమ నుండి గోదావరి జిల్లాల వరకూ ఒక రౌండ్ వేసి.. ఈ మధ్యనే విశాఖలో కూడా కదలిక తెచ్చి వెళ్లారు.   చంద్రబాబు కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలలోనే మమేకమౌతూ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.  మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విడతల వారీగా వారాహి యాత్రతో జనంలో తిరుగుతున్నారు.  పవన్ కూడా ఎన్నికల వరకూ ఇలాగే ఏదో ఒక పేరుతో రాష్ట్ర నలుమూలలను టచ్ చేయనున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. అయితే, జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ ఆ పొత్తును ఎన్నికల వరకూ కొనసాగిస్తుందా? టీడీపీతో  కూడా కలుస్తుందా అన్న సస్పెన్స్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.  ఈ ఒక్కటీ క్లారిటీ వస్తే ఏపీలో ఎటు చూసినా ప్రతిపక్ష నేతల సందడే కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంకా  స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది దండయాత్రగా భావిస్తే.. పొత్తులు క్లారిటీ అనంతరం ఇక యుద్ధమే అని చెప్పక తప్పదు.  పొత్తులు ఉన్నా లేక విడివిడిగా పోటీకి దిగినా ప్రచారం మాత్రం ఓ స్థాయిలో హోరెత్తుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  ఎన్నికలకు ఎనిమిది తొమ్మిది నెలలే ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దండయాత్ర మొదలు పెట్టాయి. తలా ఒకవైపు ప్రతిపక్ష నేతలు ఇంతగా విమర్శలకు దిగినా.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నా, సీఎంగా జగన్ చేతగాని తనాన్ని ఎత్తి చూపుతున్నా అధికార పార్టీ నుండి ఉలుకూ పలుకూ ఉండడం లేదు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా మొదటి నాలుగేళ్ళూ ఎలా ఉన్నా చివరి ఏడాది మాత్రం ఏదో ఒకటి చేసి   ప్రజలను ఆకర్షించి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తుంది. ఇందుకోసం ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎక్కడ లేని దూకుడూ ప్రదర్శిస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. ఆ కార్యక్రమాల పేరుతో సభలు, సమావేశాలతో నిత్యం ప్రజలతో అక్కడి అధికార పార్టీ నేతలు మమేకమౌతున్నారు. ఎప్పుడో కానీ ఫామ్ హౌస్ దాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జనంలోనే తిరుగుతున్నారు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీలో అటువంటి హడావుడి ఇసుమంతైనా కనిపించడం లేదు.   అడపాదడపా సీఎం జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్లి అక్కడే ఎవరో రాసిచ్చిన నాలుగు ముక్కలు మాట్లాడేసి వస్తున్నారు. అయితే, ముందు బటన్ నొక్కిన కార్యక్రమాలకే డబ్బులు లేక కొత్త పథకాలు ప్రకటించే అవకాశం లేదు. కనుక సీఎం బయటకి రావడం అంటే ఏదో అమావాస్యకి పౌర్ణమికి మాత్రమే సాధ్యం. ఇక మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంతే. మొన్నటి వరకూ పార్టీని, సీఎంను ఎవరు ఏమన్నా నోరేసుకొని పడిపోయే నేతలంతా ఇప్పుడు మైకుల ముందుకు రావడం మానేశారు. ప్రతిపక్షం ఒక్కో అంశాన్ని గుచ్చి గుచి ప్రశ్నించినా కనీసం ఆ శాఖల మంత్రి కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పడం లేదు. గతంలో కూడా మంత్రులు తమ శాఖల గురించి మాట్లాడిన సందర్భాలు అతి స్వల్పమే. అన్నిటికీ ఒకటే మందు జింతా తిలిస్మాత్ అన్నట్లు అన్ని శాఖలకూ ఒకే మంత్రి అన్న చందంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లడతారు. ఆయన కూడా ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి, వివిధ శాఖలలో సాధించిన ప్రగతి గురించి కాకుండా.. విపక్షాలపై విమర్శలు, విసుర్లు, అనధికారికంగా అభ్యర్థుల ప్రకటనలకు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. విపక్షాలు నిలదీసిన అంశాలపై మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్లు వైసీపీ నేతలు, మంత్రులు, చివరాఖరికి సీఎం జగన్ కూడా వ్యవహరిస్తున్నారు.  దీంతో సహజంగానే వైసీపీ ఎందుకిలా అనే చర్చమొదలైంది. నిజానికి ఎప్పుడో రెండేళ్ల కిందటే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకతపై సీఎం జగన్ వద్ద ప్రస్తావించే సాహసం చేశారు. అయితే ఆయన వినడం మానేసి  నాకన్నీ తెలుసు మీరు పనిచేసుకుంటూ వెళ్ళండి ఓట్లు అవే వస్తాయని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ప్రజా వ్యతిరేకత గురించి సొంత పార్టీ నేతల మాటలను కూడా పెడచెవిన పెట్టిన ఫలితం ఇప్పుడు పార్టీ అనుభవించాల్సి వస్తోందని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాలలో  ఒకరికొకరు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇప్పుడు  పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గొంతు చించుకుంటే ప్రజలలో ఇంకా చులకన అవడం తప్ప ప్రయోజనం లేదని, పార్టీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని గ్రహించే ప్రతిపక్షాలను ఎదుర్కోవాలనే ఆదేశాలివ్వడం లేదని పార్టీ నేతల మధ్య  సంభాషణ సాగుతోంది. మొత్తంగా  ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వైసీపీ హ్యాండ్సప్ చెప్పినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు!?

అన్ని విధాలుగా అప్రదిష్ట మూటకట్టుకున్న జగన్ రెడ్డి మద్యం పాలసీ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ మారబోతున్నదా? ఇప్పటి వరకూ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని జగన్ సర్కారే నిర్వహిస్తూ వస్తున్నది. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను విక్రయిస్తూ.. దేశంలో ఎక్కడా లేనంత అధిక ధరలకు విక్రయిస్తూ ఏపీ మద్యం పాలసీ రాష్ట్రంలో మందుబాబుల జేబులను, ఆరోగ్యాన్నీ గుల్ల చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  ఇక ఇప్పుడు మరింతగా మందుబాబులను పీల్చి పిప్పి చేసి వారి నుంచి మరింత దండుకునే విధంగా ఏపీ సర్కార్ మద్యం పాలసీని మర్చేందుకు సమాయత్తమౌతున్నదని ప్రభుత్వ వర్గాల ద్వారానే తెలుస్తున్నది. ఎందుకంటే సర్కార్ నుంచి వస్తున్న సమాధానం  నిధుల సమస్య. నిధుల లభ్యత కోసం మందుబాబుల్ని మరింత పిండుకోవడం కోసం మద్యం దుకాణాల వేలానికి జగన్ సర్కార్ రెడీ అయ్యిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుతం మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వమే నడుపుతోంది. దశల వారీగా మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసి ఓట్లు అడుగుతామన్నారు.   కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం సంగతి అటుంచి.. మద్య నిషేధం మా వల్ల కాదంటూ జగన్ చేతులెత్తేశారు.   ప్రస్తుత మద్యం పాలసీ మరో నెలన్నరలో, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అక్టోబర్ 1తో ముగుస్తుంది. దీంతో మద్యం దుకాణాల వేలం ద్వారా నిధుల కోసం జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  తద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలకు తోడు ప్రైవేటు మద్యం దుకాణాలు కూడా వెలుస్తాయి.   భారీగా నిధులు సమకూరాలంటే మద్యం దుకాణాల వేలం వినా మరో మార్గం లేదని జగన్ సర్కార్ నిర్ణయానికి వచ్చేసింది.   మద్యం పాలసీని మార్చాలంటే అందుకు అసెంబ్లీ ఆమోదం అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో జగన్ ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం అన్నది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సభలో జగన్ పార్టీకి ఉన్న మంద బలం అటువంటిది మరి. అయితే అసెంబ్లీ ఆమోదం పొందాలంటే వచ్చే నెల వరకూ ఆగక తప్పదు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. అంటే కొత్త మద్యం పాలసీని సంబంధించి ఆమోదం కోసం ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.   కొత్త విధానం వల్ల ఏపీలో మద్యం పేర మరింత దోపిడీకి తెరలేవడం ఖాయమని అంటున్నారు. 

బీసీలే టార్గెట్.. అన్ని పార్టీల వ్యూహాలు ఆ దిశగానే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ఓటు బ్యాంకులపై దృష్టి సారించాయి. బీసీల ఓట్లను గంపగుత్తగా సాధించడమే లక్ష్యంగా  వ్యూహాలకు పదును పెడుతున్నాయి.   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీలో పెరిగిన జోష్ ఆ పార్టీ  మరింత పదునుగా, పకడ్బందీగా అమలు చేయడానికి  వ్యూహాలను రూపొందిస్తోంది.  అదే కర్నాటక ఎన్నికల ఫలితం బీజేపీని దిగాలు పడేలా చేసింది. తెలంగాణలో పాగా వేయడం ఖాయమన్న స్థాయి నుంచి.. ఉన్న బలాన్ని, పరపతిని నిలుపుకుంటే చాలన్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర శ్రేణులు చతికల బడ్డాయి. దీంతో అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర నాయకులలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  కర్నాటకలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా తెలంగాణలో మరింత పకడ్బందీగా అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల బీసీ ఓట్లపై గురి పెట్టింది.  ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకుని.. బీసీలను దరి చేర్చుకుంటే విజయం నల్లేరుమీద బండినడకే నని భావిస్తూ ఆ దిశగా పావులు కదుపుతోంది.  అయితే 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు మధ్య పోలిక పొంతన ఉండే అవకాశం లేదని, ఈ రెండు ఎన్నికల నడుమ టీఆర్ఎస్ – బీఆర్ఎస్ లకు మధ్య ఉన్నంత  వ్యత్యాసం ఉందని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)  రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కీలకంగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ పార్టీ పేరు మార్చడంతో ఉనికిలోనే లేకుండా పోయింది.  కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష తెలంగాణ సెంటిమెంట్ ఏ పార్టీకి దక్కకుండా చేసింది. స్వయంగా ఆయన పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను ప్రస్తావిస్తే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఉంది.  తెలంగాణ తెచ్చాం అని చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్ కు, తెలంగాణ ఇచ్చాం అని క్లెయిమ్ చేసుకునే చాన్స్ కాంగ్రెస్ కు లేకుండా పోయింది. ఇక  సోనియమ్మనే కాదు.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి అంటూ పర్లమెంటు వేదికగా దివంగత సుష్మా స్వరాజ్ సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు అప్పట్లో తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే.. ఇప్పుడు బీజేపీకి తెలంగాణ ఆవిర్భావానికి తామూ సహకరించాం అని చెప్పుకునే  అవకాశం కూడా లేదు.  అందుకనే రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా తెలంగాణ నినాదం లేకుండా జరుగుతున్నాయని చెప్పవచ్చు.  ముఖ్యంగా సెంటిమెంట్ ను ఉపయోగించుకుని ఇంతవరకు గరిష్ట ప్రయోజనం పొందిన బీఆర్ఎస్( టీఆర్ఎస్) రానున్న ఎన్నికలలో ఆ కారణంగానే గరిష్టంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలన్న ఆకాంక్షతో రూటు మార్చిన కేసీఆర్.. చేజేతులా తెలంగాణ తెచ్చిన పార్టీగా, నేతగా బీఆర్ఎస్ కు ఉన్న గుర్తింపును తుడిచేశారు.   ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వరవడికి, కొత్త అధ్యాయానికి తెర తీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కులం కార్డును తెరమీదకు తీసుకువచ్చాయి.  ముఖ్యంగా బీసీ కార్డు తురఫు ముక్కగా మార్చుకుని విజయసోపానాలు అందుకోవాలని చూస్తున్నాయి.    బీజేపీ తెలంగాణలో  ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట, బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేయడంతో పాటు పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ’ పేరుతో  పెద్ద ఎత్తున ప్రచారమూ ఆరంభించింది.  బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అధికార బీఆర్ఎస్ మరోలా ముందుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బీసీలలో వెనకబడిన కులాలకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బీసీ నినాదంతో రాబోతుంది. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన సభ పెడతామని ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో బీసీ  జనాభా అధికంగా ఉండడంతో సహజంగానే అన్ని పార్టీలు బీసీ ఓటు మీద కన్నేసి, బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. నిజానికి, తెలంగాణలో ఇంతవరకు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ వరాలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు   మరీ ముఖ్యంగా బీసీలు ఎటు మొగ్గుచుపుతారు, అనేది గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ సర్కార్ ను ఇన్వెస్టర్లు నమ్మట్లే!

జగన్ సర్కార్ పరువు గంగలో కలిసింది. ఏపీ ప్రతిష్ఠ మంట కలిసింది. రుణగొణ ధ్వని తప్ప రాష్ట్ర ప్రగతి, పురోగతి పట్టని జగన్ సర్కార్ కు ఇన్వెస్టర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. కేంద్రం అండతో  పరిమితులు, నిబంధనలు తుంగలో తొక్కినా ఎటువంటి ఆంక్షలూ విధించకుండా అడిగినంత అప్పు ఇట్టే వచ్చేస్తుంటే జగన్ సర్కార్ ఇక ఆర్థిక అరాచకత్వంపై విపక్షాలు, ఆర్థిక రంగ నిపుణుల విమర్శలను పట్టించుకోవలసిన అవసరం ఏముంది అన్న నిర్ణయానికి వచ్చేసింది. కేంద్రమే తన ఆర్థిక అవకతవకలను పట్టించుకోనప్పుడు ఇంక ఎవరు మాత్రం ఏం చేయగలరన్న ధీమాతో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా భారీ రుణానికి టెండర్ వేసింది. అంటే ఆ కార్పొరేషన్ ద్వారా బాండ్లు విడుదల చేసి 11వేల 600 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేసుకోవాలని ఎత్తువేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా బీఎస్ఈలో బాండు విడుదల చేసింది. అయితే ఈ బాండ్ల వైపు ఇన్వెస్టర్లు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా ప్రభుత్వ బాండ్లను ఇన్వెస్టర్లు హాట్ కేకుల్లా తన్నుకుపోతారు. కానీ ఆ బాండ్లు విడుదల చేసింది జగన్ సర్కార్ కదా! జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణపై  ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన గుర్తింపు ఉంది.    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అడ్డగోలుగా చేస్తున్న అప్పులను ఆదాయం పెంపునకు ఉపయోగించడం లేదు. అంటే ప్రాజెక్టులు నిర్మించడం లేదు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలేదు. వచ్చే ఎన్నికలలో ఓట్లు తెచ్చిపెడతాయని భ్రమిస్తున్న సంక్షేమ పథకాల పేరిట బటన్ లు నొక్కి సొమ్ము పందేరానికి మాత్రమే ఉపయోగిస్తున్నది.  ఆ కారణంగానే జగన్ సర్కార్ విడుదల చేసిన బాండ్లకు ఇన్వెస్టర్లు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదు.  గత మే 15న కూడా ఏపీ సర్కార్ బాండ్లు విడుదల చేసింది. అయితే వాటిని లిస్ట్ చేయలేదు. ఆ కారణంగా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టలేదని భావించి, ఈ సారి పక్క ప్రణాళికతో వ్యూహాత్మకంగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లను బీఎస్ఈలో లిస్టు చేసింది. ఇందు కోైసం  ఓ  సంస్థ ద్వారా  ఏఏ+   రేటింగ్‌ ఇప్పించుకుంది. అ యినా బాండ్లను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవడానికి ఇన్వెస్టర్లు సుముఖత చూపలేదు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీసీఆర్‌డీఏ, ఏపీసీపీడీసీఎల్‌, పీఎ్‌ఫసీ 'హా  ఇతర ఎనర్జీ సంస్థల బాండ్లన్నీ బీఎస్ఈలో  బీ రేటింగ్‌తో ట్రేడ్‌ అవుతుండగా, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లకు ఏఏ+ రేటింగ్‌ ఎలా అని ఇన్వెస్టర్లు సందేహం వ్యక్తం చేశారు.   

ఆ ఐదూ ఇస్తే... విలీనం!?

తన పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సెగ్మెంట్లు ఇవ్వాలన్న డిమాండును  వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల ఆ పార్టీ హైకమాండ్ ముందుంచిందా.. అలా అయితేనే విలీన ప్రక్రియకు సై చెతానని షర్మిల షరతు పెట్టిందా.. అంటే అవుననే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కన్న కలలను నిజం చేయాలన్న ఉద్దేశంతో షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటు న్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమె సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న షర్మిల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ షర్మిలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భర్త అనిల్, పార్టీ ముఖ్యలతో సుదీర్ఘ మంతనాల అనంతరం షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పలు దఫాలు ఢిల్లీ వెళ్లిన బ్రదర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పెద్దలతోనూ వరుస భేటీలు నిర్వహించి విలీన ప్రక్రియ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పాత్రపై చర్చినట్టు వార్తలొచ్చాయి. నాలుగు రోజుల క్రితం షర్మిల, అనిల్ హస్తిన వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశమై విలీన ప్రక్రియ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన షర్మిల అంతకుముందు డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా సమావేశమై సమాలోచనలు జరిపినట్టు సమాచారం. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న విషయాన్ని షర్మిల పార్టీ సీనియర్లతో సమావేశమై చెప్పి వారి అభిప్రాయాలను సేకరించినట్టు తెలుస్తోంది. వరుసగా రెండు రోజులపాటు ఆమె ఇక్కడి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో నేతలను కలుస్తూ వారితో చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో దఫా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ విలీనం తర్వాత జరగనున్న పరిణామాలను అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఇచ్చే సీట్ల విషయంలో స్పష్టతకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఐదు అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో ఎటూ తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ కొట్టు మిట్టాడుతోంది. తాజాగా షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ఒక వైపు డీకే శివకుమార్ పట్టుబట్టి షర్మిల పార్టీని విలీనం చేసే దిశగా చర్యలు చెపట్టారని, ఇప్పుడు ఈ విషయంలో వెనక్కు తగ్గినా ప్రక్రియను వ్యతిరేకించినా వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఉండదన్న ఆందోళన పీసీసీ నేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం. కాగా షర్మిల కోరుతున్నట్టు ఐదు అసెంబ్లీ స్థానాలివ్వడానికి రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధంగా లేదన్న సంకేతాలను పార్టీ ముఖ్యనేతలు డీకే శివకుమార్ కు పంపించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి లేదా నకిరేకల్, సికింద్రాబాద్ స్థానాలను షర్మిల కోరుతున్నట్టు చెబుతున్నారు. పాలేరు నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించడంతో పాటు అక్కడ పార్టీ కార్యాలయాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. షర్మిల అనుచరుడు ఏపూరు సోమన్న తుంగతుర్తి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి సుజాతను బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఐదు సీట్లు కోరుతున్న షర్మిలకు నచ్చజెప్పి రెండు స్థానాలను ఇవ్వాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టు చెబుతున్నారు. అప్పటికీ ఆమె మరో సీటు కోసం పట్టుబడితే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు వినికిడి. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న షర్మిల అక్కడే పార్టీ పెద్దలను కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవాలని ప్రతిపాదించారని ఆమె సన్నిహిత నేతలు వివరించారు. ఏది ఏమైనా.. షర్మిలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మాత్రం ఖాయం.

తెలంగాణపై ఫోకస్ తో ఆ పార్టీకి ఫలితం ఉందా..?

మరి కొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది.  ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం. అభ్యర్థుల ఎంపికకు పరిగణనలోనికి తీసుకోవాలసిన అంశాలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటిని నిర్వహించింది. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిటీ సమావేశ మైంది. ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికలు జరగనున్న తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై అగ్రనేతలు తీశారు. రాష్ట్రాల్లో పరిస్థితులపై వచ్చిన సమాచారం ఆధారం గా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రావడంతో  ఎన్నికలను బీజేపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార బాధ్యత లను ఎక్కువగా జాతీయ నాయకత్వమే తీసుకుని వ్యూహత్మకంగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క మధ్యప్రదేశ్ వినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న  రాష్ట్రాలలో.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ లో అధికారం నిలుపుకోవడంతోపాటు గతంలో అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్,  రాజస్థాన్ లో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లలో హోరాహోరీగా ప్రత్యర్థి పార్టీలతో తలపడాల్సి రావొచ్చని సమావేశంలో నేతలు అన్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగినట్లు తెలిసింది. ఎన్నికల బరిలో దింపాల్సిన అభ్యర్థులను ముందే గుర్తించి ప్రకటిస్తే తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం తోపాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి తగినంత సమయం ఉంటుందని అన్నట్టు సమాచారం. సమయం దొరుకుతుం దని సమావేశం అభిప్రా య  పడితే ప్రత్యర్థి పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కమిటీ ఆరా తీసినట్లు తెలిసింది.  తెలంగాణ లో పాతుకు పోయిన బీఆర్ ఎస్.. జోష్ తెచ్చుకుని..పరుగులు పెడుతున్న  కాంగ్రెస్.. ల నడుమ.. బీజేపీ ..అధికార పీఠం ఎక్కుతోందా.. ప్రత్యర్థులను ఢీ కొట్టే దమ్ము ఉందా..? కాలమే సమాధానం చెబుతోంది.

తెలంగాణలో మళ్లీ బీఆరెస్సేనా? టైమ్స్ నౌ సర్వే ఏం చెబుతోంది?

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా ఎకఛత్రాధిపత్యంగా కొనసాగారు. మరో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర మైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోందన్న పరిశీలకుల విశ్లేషణ.  పార్టీలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అదే సమయంలో కాంగ్రెస్ గట్టిగా పుంజుకోవడం.. ఇక అధికారమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీలో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఐక్యత..ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాకుండా బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా వెలువడిన ఓ సర్వే.. బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ అది.. ప్రభుత్వాన్నికూలదోసే స్థాయిలో లేదని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైనప్పటికీ.. అది బీజేపీ స్థాయిని  గణనీయంగా తగ్గించగలిగిందే కానీ..  బీఆర్ఎస్ ను అధిగమించే స్థాయికి చేరుకోలేకపోయిందని సర్వే పేర్కొంది.  తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మరో సారి అధికారం చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ వెల్లడించింది.     అధికార బీఆరెస్స్ కు 38.4 శాతం మంది ప్రజల మద్దతు ఉందని.. ఆ తరువాత  కాంగ్రెస్ కు  29.9 శాతం, బీజేపీకి  24.3 శాతం,ఇతరులకు 7.4 శాతం ప్రజా మద్దతు ఉందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో  కూడా తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీఆరెస్స్ కు మద్దతుగా నిలుస్తారని సర్వే వెల్లడించింది.   వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో వెలువడిన టైమ్స్ నౌ సర్వే కాంగ్రెస్ తెలంగాణలో బలంగా పుంజుకుందనీ, అయితే అధికారం చేజిక్కించుకునేందుకు ఆ బలం సరిపోదనీ పేర్కొంది. అయితే.. రానున్న రోజులలో ప్రజా వ్యతిరేకత మరింత పేరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, అసమ్మతి, అసంతృప్తి వంటికి ఈ సారి కంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం చేకూర్చే అవకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.