పరుగు మంచిది....

మీరు1౦ నిమిషాలు పరుగు తీస్తే చాలు  బ్రెయిన్ ఫంక్షన్ వృద్ది  చెందుతుంది... జపాన్ లో నిర్వహించిన  ఒక పరిశోదనలో  ఒక పదినిమిషాల పాటు  పరుగు పెడితే మన బ్రెయిన్ మరింత చురుకుగా పనిచేస్తుంది. పరిశోధకులు నిర్వహించిన షార్ట్ రన్నింగ్ సెక్షన్స్ లో  మెదడు పనితీరులో నిర్వహణా పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ముఖ్యంగా శ్రద్ధ ఏకాగ్రత ప్లానింగ్ నిర్వహణ హృదయ స్పందన  హార్ట్ బీట్ పెరుగుతుంది. మనం పరుగుపెట్టడం ద్వారా రక్త ప్రవాహం బెటర్ మూడ్ వ్యాయామం కన్నా పరుగుపెట్టడం ద్వారా ఆరోగ్య లాభాలు ఉన్నాయని  అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఖర్చులేని లేనిదీ  అందరికీ అందుబాటులో  ఉన్నది కేవలం పరుగే అన్నది వాస్తవం. మనం పరుగుతీయడం ద్వారా కార్డియో  వ్యాస్క్యులర్ హెల్త్, వృద్ధి చెందడమే కాక కండరాలు శక్తివంతమౌతాయి.అలాగే ఎముకలు గట్టిపడతాయి. అదే పరుగు పెట్టడం ద్వారా మానసిక ఆరోగ్యం అభివృధికి  దోహదం చేస్తుంది. జపాన్ కు చెందిన కొంతమంది  టి సుబుబా  విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు 1౦ నిమిషాల పాటు పరుగులు తీస్తే మీ మూడ్ పనితీరు పద్దతులు మెరుగు  పడతాయి.  పరుగు పెట్టిన తరువాత శరీరంలో రక్త ప్రవాహం స్థాయి పెరిగిందని పరుగుపెట్టక ముందు పరుగు పెట్టిన తరువాత ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ప్రి ప్రోంట్ర ల్  కార్టెక్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అంశాన్ని గురించి  జనరల్ సైన్స్ లో ప్రచురించారు.   పరుగు ప్రభావం మెదడుపై  ఎలా పనిచేస్తుంది... మీ మెదడులో ఉండే సెన్సార్ ల ద్వారా సమాచారం సమాచారం అందించడం తో పాటు శరీరం సమతౌల్యం లో ఉంచుతుంది. పరుగుపెడుతున్నప్పుడు ప్రి ఫ్రంట్రల్  కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది.పరుగు పెట్టడం ద్వారా రక్త ప్రసారం మెరుగు పడుతుంది. అది మెదడు పనితీరు మేరుగుపడానికి దోహదం చేస్తుంది. మనం పరుగుపెడుతున్నప్పుడు మన తలను కిందికి పైకి ఆడిస్తూ ఉంటాం. అది జంతువుల లోను  జరుగుతుంది దీనివల్ల  సిరో టోనిక్  వ్రుదిచేందే అవకాశం ఉంది.  పరుగు విరామానికి వ్యత్యాసం ... ఒక నూతన పరిశోదనలో పరిశోధకులు మెదడు కార్య నిర్వహణ పనితీరు మూడ్ బాగుంటుంది. 1౦ నిమిషాలు  పరుగు తరువాత త్రేడ్ మిల్ తో పోల్చినప్పుడు బ్రెయిన్ పనితీరు మూడ్ తరువాత విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. స్టూప్ టాస్క్ ద్వారా కార్యనిర్వహణ సామర్ధ్యాన్ని పరిశీలించారు. అక్షరాలూ ఎర్రగాను నీలిరంగులో కనిపిస్త్సాయి. రక్త ప్రావాహం లో మార్పులు స్పెక్ట్రో స్కోపి నోనిన్విజివ్ ఇమే జింగ్ గా తీసుకుంటారు.  మెదడు ఎప్పుడై తే యాక్టి వేట్ అయ్యిందో ఆ ప్రాంతంలో రక్తం త్వరగా మారుతుంది దైమెంక్షనల్  మూడ్ స్కేల్ ద్వారా దీనిని కొలుస్తారు. పరుమంచిదే అని నిపుణులు సూచిస్తున్నారు.    

గోల్ఫ్ ఆడితే జీవితకాలం పెరుగుతుంది

గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక-     గోల్ఫ్ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌ World Golf Foundation అనే సంస్థ గోల్ఫ్‌ ఆటకీ ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు ఈ గోల్ఫ్‌ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్టుని ఆరంభించింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు... గోల్ఫ్‌ మీద ఇప్పటివరకూ జరిగిన ఐదేవేల పరిశోధనలను సమీక్షించారు. గోల్ఫ్‌ ఆడే సమయంలో వారిలో ఎన్ని కేలొరిలు ఖర్చవుతున్నాయి, వారు సగటున ఎంత దూరం నడవాల్సి వస్తోంది, వారి ఆరోగ్యం మీద ఆట ప్రభావం ఏమిటి... తదితర విషయాలను పరిశీలించారు.     జీవతకాలమే మెరుగుపడింది. పరిశోధకుల సమీక్షలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి. గుండెపోటు, పక్షవాతం, డయాబెటీస్‌, పేగు క్యాన్సర్ వంటి 40 రకాల తీవ్రమైన రోగాలను గోల్ఫ్‌ నివారించగలుగుతోందని తేలింది. ఒక పరిశోధనలో అయితే గోల్ఫ్‌ అడేవారి జీవితకాలం ఏకంగా ఐదేళ్లపాటు మెరుగుపడినట్లు బయటపడింది. ఇంతేకాదు! వయసుతో పాటు వచ్చే నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు... గోల్ఫ్‌ ఆటలో మాయమవుతున్నాయట. గోల్ఫ్‌ ఆటతో శరీరమే కాదు మనసు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంతో పాటుగా... ఆందోళన, మతిమరపు, క్రుంగుబాటు వంటి వ్యాధుల నుంచి దూరం కావడం జరిగిందట.     కారణం! గోల్ఫ్ ఆటలో ఆటగాళ్లు కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాలి. వారి బలమంతా ఉపయోగించి బంతిని కొట్టాల్సి ఉంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లలో గుట్టలని దాటుతూ, మైదానాలలో నడుస్తూ ఈ ఆటని ఆడాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు దాదాపు 6 నుంచి 13 కిలోమీటర్ల వరకూ నడుస్తారనీ, 500కి పైగా కేలొరీలను ఖర్చు చేస్తారని తేలింది. పైగా గోల్ఫ్‌ ఆటని వయసుతో సంబంధం లేకుండా ఏ వయసువారైనా ఆడవచ్చు. తమ ఓపికను బట్టి ఆటలో మార్పులు చేసుకోవచ్చు. ఈ కారణాలన్నింటి వలనా గోల్ఫ్‌ గొప్ప ఆరోగ్యాన్ని అందించే ఆటగా మారిపోయిందని పరిశోధకులు సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఐదుకోట్ల మందికి పైగా ఈ ఆటని ఆడుతున్నారనీ, భవిష్యత్తులో మరింత మంది ఈ ఆట పట్ల ఆసక్తి చూపుతారనీ భావిస్తున్నారు. - నిర్జర.

వయసు పరంగా చర్మంలో మార్పులు వస్తాయా??

మీలో వయస్సు వస్తున్న కొద్దీ మీ శరీరం లో ని చర్మం లో మార్పులు వస్తూ ఉంటాయి.  అలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? అన్న విషయం తెలుసుకుందాం. ఆక్నిక్  కెరటో సిస్ అనేది క్యాన్సర్ కు ముందు చర్మం పై వచ్చే పెరుగుదల. ముఖ్యంగా ఎండకు ఎక్కువగా ఉండడం వల్ల పెరుగుతుందని అందుకే   శాస్త్రీయంగా సోలార్  కేరటో సిస్ గా నామకరణం చేసారు.  దీనిలక్షణం  ఎలా ఉంటుంది. ఎర్రటి మచ్చలు,చారలు  చర్మం పై కొవ్వు పెరిగినట్లు లేదా ఎరుపు, గులాబి రంగులో ఉంటుంది.  ఈలక్షణా లు కలిగి ఉండి వృద్ధి ఎక్కడ వచ్చినా దీనికి కారణం అల్ట్రా వైలెట్ కిరణాలే అది వ్యక్తులు  చేసింది కాదు. చాలా సహజంగా స్కాల్ప్ పై చెవులు,మెడ, ముఖం పై పెదాలు,భుజాలు, లేదా  ముంజేతులు చేయి వెనుక భాగం లో శరీరంలోని ఇతర భాగాలలో ఎక్నిక్ కెర టోసిస్ వస్తుంది. దీనిని వైద్యపరిభాషలో కార్సినోమా గా మారే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు.  ఇది ఒకరకమైన చర్మ క్యాన్సర్ ప్రత్యేకంగా పెరుగుదల ఉంటె మీ సమీపం లోని  డెర్మ టాల జిస్ట్ ను సంప్రదించండి. అయాకాలాలలో వచ్చే సమస్యను బట్టి వివిదరకాల  క్రీములు లేదా శస్త్ర చికిత్స ద్వారా అంటే సర్జరీ పద్దతుల ద్వారా వాటిని తొలగించే లేదా నిలుపుదల చేయడం. లేదా ఫ్రీజ్ చేయడం కాల్చడం చేస్తారు. సేబార్ర్హెఇక్ కేరటో సిస్ శరీరం పై ఉన్న చర్మం పై ఆయా వయస్సులను బట్టి సేబార్ రేహేఇక్ కేరోటో సిస్ పెరుగుతుంది. దీనిరంగు చార, లేదా ఉదా రంగులో బ్రౌన్ రంగులో నల్లగా గుండె పై, తల పైన,వెనుక భాగం లో ముఖ్యంగా గుండెపై వచ్చిన  సేబార్ ర్హేఇక్  కేరటో సిస్ మైనం లాగా ఉంటుంది. ఇది చాలా సహాజంగా వస్తుంది. 5౦ సంవత్సరాలు పై బడిన వారిలో కుటుంబాల లో వస్తుంది.ఇవి పెరిగినట్లయితే మరిన్ని పెరిగే అవకాశం ఉంది. అయితే అవి ప్రమాదకరం కాదు. అలా కనిపించక పోవచ్చు.ఇలాంటి చర్మ సంబందిత సమస్యలకు  డ ర్మటా లజిస్ట్ సంప్రదించడం ద్వారా వాటిని తొలగిస్తారు. అయితే శరీరం పై వచ్చిన పెరుగుదల సేబోర్ ర్హేఇక్ కేరోటో సిస్ కదా ? దాని తీవ్రత ప్రభావం ప్రమాదకరమా? లేదా చర్మ క్యాన్సరా? అన్న విష యం తెలుసుకోవాలంటే నిర్ధారణ కావాలంటే బయప్సి చేయాల్సి వస్తుంది. మీరు బట్టలు వేసుకునే  టప్పుడు చర్మానికి రాసుకుని ఇబ్బంది పెడుతుంది. మీ సమీపం లో ఉన్న డే ర్మటా లజిస్ట్ వాటిని సర్జరీ ద్వారా తొలగిస్తారు. లేదా ఫ్రీజ్ చేస్తారు.లేదా లేజర్ చికిత్స చేస్తారు.  సోలార్ఎలాస్తో సిస్.... సోలార్ఎలాస్తోసిస్ దీర్ఘ  కాలం పాటు సూర్యరస్మి లో ఉన్నట్లయితే శారీరకంగా మార్పులు వస్తాయి. అంటే మీ చర్మం సాగిపోతుంది. దీనినే సోలార్ ఎలాస్తో సిస్ అంటారు. దీనికారణంగా ముఖంపై ముడతలు,కొన్నిరకాల చర్మం సాగిపోతుంది దీనినే   సోలార్ ఎలాస్తోలసిస్ అంటారు. దీనికారణం గా ముఖంపై ముడతలు కొన్నిరకాల గుంతలు ఏర్పడడం చూడవచ్చు. బంప్స్ వస్తాయి. శరీరం ముఖం ఎగుడు దిగుళ్ళు, గా తయారు అవుతాయి. చర్మం పసుపు రంగు వర్ణం లోకి మారుతుంది. ఎవరికైనా సోలార్ఎలాక్త్రోలసిస్ రావచ్చు. ఎవరైతే చాలా ఫెయిర్ గా అందమైన చర్మం ఫెయిర్ గా ఉండే అందమైన చర్మం పై వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.  పొగ తాగడం వల్ల చర్మం పాడై పోతుంది.చర్మం సోలార్ ఎలాస్త్రోలసిస్ కు దారి తీయవచ్చు. దీర్ఘ కాలంపాటు  సూర్య రస్మిలో ఉన్నట్లైతే చర్మం పై భయం కరమైన మార్పులు వస్తాయి. దీనికి చర్మ సంరక్షణ కు యంటి ఏ జింగ్  సహజంగా వాడతారు. బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సి రావచ్చు. ఆరకంగా మీ చర్మ సంరక్షణకు  చూసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.సోలార్ ఎలాస్త్రో సిస్ చికిత్సకు మీ దగ్గరలోని డ ర్మటా లజిస్ట్  చికిత్స చేస్తారు.లేజర్ తెరఫీ, ఫిల్లర్స్ బోటో క్స్  ఇంజక్షన్ లేదా ఇతర పద్దతులు. అవలంబిస్తారు.  వేరికోస్ వేయిన్స్.... వేరికోస్ వేయిన్స్ అంటే మీ రక్తనాళాలు వ్యకోచిస్తాయి,లేదా అవి మెలితిరిగి ఉండడం గమనించవచ్చు. దీనివల్ల రక్త  నాళాలలో రక్త ప్రసారం సరిగా జరగక  తీవ్ర ఒత్తిడికి గురిఅయి  కాళ్ళలో తీవ్రమైన నొప్పులు వస్తాయి. రక్త నాళాలు చర్మం బయటికి చొచ్చుకు వస్తాయి. హై బిపి వల్లే వేరికోస్ వేయిన్స్ వస్తాయి. కాళ్ళలో పిక్కలు, చీల మండల లో వేరికోస్ వేయిన్స్ బరువు పెరుగుతారు. స్త్రీలలో స్త్రీలలో ముఖ్యంగా  గర్భిణీ  గా ఉన్నవారు., వృద్ధులలో శరీరంలో శరీర వ్యాయామం లేనప్పుడు. దూమ పానం, లేదా కాళ్ళకు గాయం అయినప్పుడు. లేదా హార్మోన్ మార్పిడి జరిగినప్పుడు. లేదా నోటి ద్వారా ముఖ్యంగా గర్భానిరోడక మాత్రలు  వాడినప్పుడు వేరికోస్ వేయిన్స్ వస్తాయి. వేరికోస్ వేయిన్స్ వల్ల కాళ్ళలో తీవ్రమైన నొప్పి చర్మం రంగు మారిపోతుంది. చర్మం పై దద్దుర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీ కాళ్ళ నుండి గుండె వరకు 3 నుండి నాలుగు సార్లు ప్రతిరోజూ ఒత్తిడిని పుట్టించే సాక్స్ వేసుకోమని సూచిస్తారు. మీరు సాక్స్ వేసుకున్నప్పటికీ సమాస్య తీవ్రంగా ఉంటె ఇబ్బందిపెట్టే వేయిన్స్ కు ఇంజక్షన్  చేస్తారు. వేరికోస్ వేయిన్స్ చికిత్స కు స్క్లీరో తెరఫి, ధర్మల్ ఎబ్రేషన్ సర్జరీ చేస్తారు. స్పైడ ర్  వేయిన్స్... స్పైడ ర్  వేయిన్స్ వేరికోస్ వేయిన్స్ లో భాగమే. అయితే ఇది అత్యంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది.స్పైడర్  వేయిన్స్  తరచుగా కాళ్ళలో వస్తుంది. ముఖ్యంగా పా దాలు,చీల మండలు.వీటిని సూపర్ అఫిషియల్స్ అంటారు. మోకాళ్ళ కింద చర్మం పై ఎర్రగా,మంతపెడుతూ, ఉంటుంది. దురద పెడుతూ ఇతర సమస్యలతో  ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ఒత్తిడి కలిగించే సాక్స్ వేసుకోవచ్చు. అది మీకాళ్ళ పై స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వాటిని గుర్తించిన వెంటనే దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించండి. చికిత్సలో ఉన్న వివిధ రకాల పద్దతుల గురించి పూర్తిగా క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి.చికిత్స చేయించు కొండి. చర్మం పై దురద... శరీరంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ వల్ల వస్తుంది. వయస్సు రీత్యా శరీరంలో ఆయిల్ తగ్గిన ఫలితంగానే చర్మం ఎండిపోయి నట్లు పొడి బారిపోయి  ఉండడం వల్ల సమస్య  మరింత తీవ్రమౌతుంది. పొడి బారిన చర్మానికి ఏదైనా మోయిస్చరైజర్, సరిపోతుంది. ఇందు కోసం నీరు అధికంగా తాగాలి. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సబ్బులు, హ్యుమిడి ఫైర్లు వాడాలి. దీనివల్ల దురద తగ్గవచ్చు. మీకు పెర్ఫ్యుం గనక వాడే అలవాటు ఉంటె దురగ మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. మీరు కొన్ని వారాలుగా దురదా తో బాధపడుతున్నారా మీరు డాక్టర్ ను సంప్రదించండి. ఇది మరింత తీవ్రతరం కావచ్చు. లేదా కిడ్నీకి సంబంధించి,డయాబెటిస్,రక్త హీనత.లివర్ సమస్య కావచ్చు. ఈ సమస్యను గుర్తించి సత్వరం చికిత్స చేసుకోవడం అవసరం. సమాస్తాను ప్రాధమిక స్థాయిలో గుర్తించి చికిత్స తీసుకుంటే దీర్ఘకాలిక సంమాస్యగా మారకుండా ఉంటుంది. లెగ్ ఉల్సర్స్ / కాలిలో అల్సర్స్... మీ కాళ్ళలో  పండ్లు  ఏర్పడుతాయి. వాటిని  నిర్లక్ష్యం చేయద్దు. అలా బయటికి వచ్చిన పుండ్ల వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి అనారోగ్య  సమస్యల కు దారి తీయవచ్చు. డయాబెటిస్, వల్ల కాళ్ లో అల్సర్స్ రావచ్చు.  వేరికోస్ వేయిన్స్ వల్ల ధూమపానం, గర్భవతిగా ఉన్నప్పుడు, ఊబకాయం, ఒక వేళ మీ కాళ్ళలో అల్సర్స్ వస్తే  వైద్యులు లెగ్ అల్సర్స్  క్లినిక్ కు రెఫర్  చేయవచ్చు. లెగ్ అల్సర్స్ కు చికిత్స రోగి వయస్సు పై ఆధార పడి ఉంటుంది. లేదా రోగి పూర్తి ఆరోగ్యం,అల్సర్స్ కు గల కారణం బట్టి ఆధార పడిఉంటుంది. సాధారణం గా  మీగాయాన్ని మీరే శుభ్రం చేసుకోవాల్సి  ఉంటుంది. ఆప్రాంతంలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే కంప్రెషన్ తో కూడిన సాక్స్ లెగ్ అల్సర్స్ ఉన్నవారికి సర్జరీ చేయాల్సి రావచ్చు. కాంటాక్ట్ డెర్మటైటిస్... కాంటాక్ట్ డెర్మటైటిస్ లక్షణం  చ్గార్మాం పై ఎర్రగా ఉంటుంది. దద్దుర్లు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఎలర్జీ వల్ల చర్మం ఇరిటే టింగ్ గా ఉంటుంది. కాంటాక్ట్ డెర్మటైటిస్ ను రెండురకాలుగా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.  ఇరి టేట్  కాంటాక్ట్ డెర్మటైటిస్... ఈ సమస్య చాలా సహజనైనదని ఇతర దద్దుర్లు మాదిరి గానే ఉంటాయి. ఇది కొన్ని రకాల మొక్కల ద్వారా  షాంపూలు ఆల్కాహాల్, బ్లీచ్, డిటర్  జెంట్స్ ఇతర రాసాయనాలు, చర్మం పై ప్రతి చర్య జరిగి ఎలర్జీ గా మారుతుంది.  ఎలర్జీ కాంటాక్ట్ డెర్మటైటిస్... చర్మం యొక్క స్థితి ని బట్టి ఉదాహరణకు...విషపూరిత మైన మొక్కలు వ్యక్తి గత సంరక్షణ ఉత్పత్తులు కృత్రిమ ఆభరణాలు ఇతర రాసాయనాలు కావచ్చు. ఈ సమస్యకు చికిత్సలో భాగం గా ఎలర్జీ ని వృద్ధి చేసే వస్తువులను, సబ్బులు,చర్మం పై మోయిస్చరైజ్, సాధనాలు, క్రీములు, లోషన్లు మీ చర్మాన్ని రక్షిస్తాయి.  స్కిన్ కాన్సర్/ చర్మ క్యాన్సర్... స్కిన్ క్యాన్సర్ సహజమైన కండీషన్ గా నిపుణులు పేర్కొన్నారు. 7౦ సంవత్సరాల వయస్సు పై బడిన వారిలో ప్రతి ఐదుగురిలో చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. చర్మ క్యాన్సర్ కు ప్రాధాన కారణం సూర్యరశ్మి ని ఎదుర్కోవడమే. ఎవరైతే చాలా ఫెయిర్ గా ఉంటారో కాళ్ళు రంగులు రంగులు గా ఉంటాయి. ఎర్రటి జుట్టు ఉన్న వారిలో ఇది ప్రమాదకారిగా మారచ్చు. కొంత మందిలో చర్మ క్యాన్సర్ రావడానికి ఎక్కడైతే సూర్య రశ్మి చేరదో అంటే శరీరంలోని చంకలు, లోపలి భాగాలు లేదా జనటిక్స్ టాక్సిస్ క్యాన్సర్  వృధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యరస్మికి దూరంగా ఉంటూ సన్ స్క్రీన్ లోషన్స్ వాడండి. మేఘావృతంగా ఉన్నరోజుల్లో తనింగ్ బర్స్ ను చూదండి. చర్మ క్యాన్సర్ కు రకరకాల చికిత్సలు చేస్తారు. క్యాన్సర్ స్టేజి నిబట్టి క్యాసర్ సైజు ను బట్టి చికిత్సలు చేస్తారు. సోగ్గి స్కిన్ / కుంగి పోయిన చర్మం... మీ చర్మం కుంగి పోయింది బిరుసుగా ఉండే చర్మం. మీ మెడ మీద దవడ ఎముకల ప్రాంతాలాలో సహజంగా ఒడులుగా ఉంటుంది. చాలా మంది ఈ సమాస్యను టర్కీ నేక్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు.అంటే టర్కీ కోళ్ళ ను పోలి ఉండడం వల్ల ఆటపట్టిస్తూ ఉంటారు. వయస్సు రీత్యా చర్మం సాగి పోతుంది. సాగింగ్ కొవ్వు పదార్ధాలు పేరుకు పోయి దవడ క్రింది భాగం లో గడ్డం కింద సాగిపోతాయి. ఆప్రాంతంలో ముఖం అందవికారంగా తయారవుతూ ఉంటుంది. ఇక మెడ కండరాలు బలహీన పడతాయి. వర్టికల్  గా ఉండే బ్యాండ్స్  వాడాల్సి ఉంటుంది. మీ మెడ పై భాగాన ఉన్న ప్రాంతాన్ని సంరక్షించండి. మీ మెడను సూర్య రస్మికి దూరంగా ఉంచండి. సన్ స్క్రీన్ మోయిస్చ రైజర్స్ రాసుకోండి.మీరు మెడ దవడ, ప్రాంతలాలో వ్యాయామం చేయండి. ఆ ప్రాంతం లో గట్టి పడతాయి. సాగి పోయిన లేదా కుంగి పోయిన అంటే జీవం లేని చర్మం కాకుండా మరే ఇతర  సమస్యలు ఉంటె  డ ర్మటా లజిస్ట్,  సర్జన్ తో సర్జరీ అవసరం  లేకుండా చికిత్సలు ఉన్నాయేమో తెలుసుకోండి.  బ్రుసిన్స్ / అంటే గాయాలు... బ్రూస్ అంటే చర్మం పై గట్టిగా పేరుకు పోయిన లేదా మచ్చలు. గాటు, మీరు మీ టేబుల్ పై చేయిపెట్టినప్పుడు ఏదైనా గాయం అయినప్పుడు. లేదా రక్తనాళాల వద్ద గట్టిగా ఒత్తుకు పోయి రక్తం నల్లగా గడ్డకట్టి నప్పుడు. అదే మీరు గాయాల పాలై మీ శరీరం పై రక్తం గూడు కట్టుకున్నప్పుడు. కాలికి గాయమై ఆప్రాంతమంతా నల్లగా లేదా నీలపు రంగులో గడ్డ కట్టుకున్నప్పుడు. లేదా రక్త నాళాలు చర్మం కింది భాగం లో ఉన్నప్పుడు. చర్మం డ్యామేజ్ అయినప్పుడు రక్తం కారి నప్పుడు. ఆ చర్మం పై ఏర్రరంగులో,ఊకో చోటా నల్లగా, ఇంకోచోట,నీలపు రంగంలో మరక పది పోతుంది. సమస్య  ఉన్న వారిలో వృద్ధులలో బ్రూస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వయస్సు వల్ల చర్మం పల్చబడి పోవడం వల్ల లేదా శరీరంలో కొవ్వు తగ్గిపోవడం వల్ల  చాలా త్వరగా మచ్చలు,గాట్లు,ఏర్పడ తాయి. చాలా రకాల బ్రూస్ కావడానికి కారణం కేవలం చిన్న చిన్న గాయాలే,అదీ కాక ఏది ఏమైనా కొన్ని సమయాలలో చాలా తీవ్రంగా ఉండచ్చు. బ్లడ్ తిన్నర్స్, వల్ల మరకలు, మచ్చలు, పడచ్చు.మీకు భారీ సంఖ్యలో పెద్దపెద్ద మచ్చలు పడతాయి. అది రక్త శ్రావం కారణం కావచ్చు. అప్పడు తప్పని సరిగా మీరు డాక్టర్ ను సంప్రదించాల్సి రావచ్చు. స్కిన్ క్రాఫ్టింగ్, లేదా మీ ముఖం పై పడ్డ మచ్చను తీసివేయడానికి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి రావచ్చు. వ్రిన్ కిల్స్ / అంటే ముఖం పై ముడతలు.... ముఖ్యంగా ఈ మధ్య కాలం లో వయస్సు రీత్యా ముఖం పై ముడతలు, కంటి కింద చా రలు, మిమ్మల్ని ఆత్మన్యూనతా భావం తో ఉంటారు. వయస్సు వచ్చేసిందా అని భావిస్తూ దీనికోసం ఏమైనా చేయాలనే ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ముడతలు వయస్సు పెరుగుతున్న కొద్దీ  వస్తాయి. వయస్సు రీత్యా చర్మం పలుచబడి పోవడం మోయుస్చరైజర్ ను తక్కువగా కలిగి ఉంటుంది. దీనికారణం శరీరం లో తక్కువ శాతం ఆయిల్ ఉండడమే, ఆయిల్ దీనివల్ల శరీరానికి జరిగిన గాయం మానడానికి చాలా మెల్లగా  తగ్గుతూ ఉంటుంది. ముఖం పై ఉన్న కండరాల లో మార్పు వల్ల  రక రకాల  హావ భావాలు వస్తూ ఉంటాయి. ముడతల వల్ల చర్మం మరింత లోతుకు పోయి ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. పొగతాగడం సూర్యరస్మి కారణంగా ముఖం పై ముడతలు వస్తాయి.  మరి ముఖం పై వచ్చే ముడతలను ఏమిచేస్తారు. ప్రతి రోజూ మోయిస్చరైజ్ చేయండి. క్లింజర్స్ వాడండి. పోగాతాగాకండి,ఒక వేళ మీకు అలవాటు ఉంటె  మాని వేయండి. సూర్య  రాస్మికి దూరంగా ఉండండి.తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తేసన్ స్క్రీన్ లోషన్ ను వాడండి. ఎ మోస్చారైజర్ వాడాలి, ఏజింగ్ వ్రింకిల్ నివారణకు  ఏది యాంటి ఏజింగ్ కేర్ తీసుకోవాలి తెలుసుకోండి. మీ డెర్మటాలజిస్ట్ ను అవసరమైన పక్షం లో సంప్రదించండి. డాక్టర్ సలహా తీసుకోండి. ముఖంపై ముడతలు వచ్చాయని బాధ పడకండి. ముడతలను ఎదుర్కోడానికి శుద్ధంగా ఉండండి. మీ డర్మటా లజిస్ట్ ఫైల్లెర్ల గురించి  చర్చించండి. కెమికల్ పీల్స్ లేజర్ సర్ఫెసింగ్ సర్జరీ గురించి తెలుసుకోండి.  

మనకు పీచుపదార్థం ఎందుకు అవసరం??

మనిషి తీసుకునే ఆహార పదార్థంలో చాలా రకాలు ఉంటాయి. పిండి పదార్థాలు, ద్రవాలు, పీచు ఇలా పదార్థంలో అంతర్లీనంగా చాలా ఇమిడి ఉంటాయి. అయితే తీసుకునే ఆహారపదార్థాలలో పీచు అధికంగా ఉన్న ఆహారం చాలా మంచిదని, ఇది ఆరోగ్య వ్యవస్థను చాలా దృఢంగా ఉంచుతుందని అంటారు.  అయితే… ఆహార పదార్థాలలో వుండే పీచుపదార్థం అనేది మొక్కలకు సంబంధించిన భాగం అని చెప్పవచ్చు. ఈ పదార్థం మనుషులకు సంభవించే కొన్ని అతి ముఖ్యమైన తీవ్రవ్యాధులను  అరికట్టడంలో  చాలా బాగా సహపడుతుంది. పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణకోశంలో  చాలా త్వరగా ప్రయాణించగలుగుతాయి. అందువల్ల ఆహారంలోని ప్రమాదకరమైన పదార్థములు దేహంలో శోషణ చెందడానికి ఎక్కువ సమయం ఉండదు.  ఇంకా కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల, ద్రవ పదార్థాల వల్ల కలిగే పైత్య వికారాలను ఈ పీచుపదార్థం బంధించి ఉంచుతుంది. అందువల్ల ఆ పైత్య సంబంధ కారకాలు శరీరంలోకి శోషణ కావు. అంతేగాక మనం తీసుకునే ఆహారంలో దాసగి ఉండే కొలెస్ట్రాల్ నుండి క్రొత్త పైత్య క్షారాలు విడుదల అవుతాయి. ఈ క్షారాలు శరీరంలో కలవకముందే పీచుపదార్థంతో కలిసిపోయి వాటిద్వారానే బయటకు వెళతాయి.   శరీరంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే.. దానికి చక్కని ఉపాయం పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. పీచు పదార్థం కొలెస్ట్రాల్ కంటెంట్ ను శరీరంలో నుండి ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉంటుంది. అందుకే అధికబరువు ఇన్నవారిని పీచుపదార్థం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోమని సలహా ఇస్తుంటారు.  దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే తొందరగా కడుపు నిండిన ఫీల్ వస్తుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువగా సమయం పడుతుంది కాబట్టి ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇక రెండవది పీచుపదార్థం శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గిస్తుంది. పీచుపదార్థం కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల రక్తనాళాలు గట్టిపడి అవి  పూడుకుపోయే ప్రమాదాన్ని నివారిస్తుంది. కొవ్వును పెరగకుండా అదుపు చెయ్యటంలోను కొలెస్ట్రాల్ నుండి పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళని అరికట్టడంలోను పీచుపదార్థం ఎంతగానో సహాయ పడుతుంది. కొందరిలో వంశానుగతంగా  డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఈ డయాబెటిస్ ని పీచు పదార్థాలు అధిక శాతంలో గల ఆహారము తీసుకోవడం ద్వారా చాలావరకు నిరోధించటానికి అవకాశము ఉంటుంది.  కొందరికి ప్రేవులలో అధిక ప్రకంపనలు (వత్తిడిలు) జరగటంవల్ల అవి జారి హెర్నియా వ్యాధికి లోనవటం సంభవిస్తుంది.అదే పీచు పాడ్స్ర్తం పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే..  పీచుపదార్థం ప్రేవులలో సులువుగా ప్రయాణించడం ద్వారా ప్రేవులలో వత్తిడులను  అరికట్టడంలో తోడ్పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం.. భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని ఉత్పత్తిచేసే “కార్సినోజినిక్”లను శరీరంలో ఉత్పత్తి కాకుండా నిరోధించటానికి పీచుపదార్థాలు చాలా సహాయపడతాయి. జీర్ణకోశంలో ఆహారం ఎంత ఆలస్యంగా ప్రయానిస్తే అంత ఎక్కువగా ప్రేవులలో ఒత్తిడులు సంభవిస్తాయి. ఈ ఒత్తిడుల కారణంగానే కార్సినోజినిక్ లు పుట్టడం జరుగుతుంది. అందుకే.. కావలసినంత పీచుపదార్థం శరీరంలో ఉన్నప్పుడు జీర్ణంకోశంలోని ఆహారాన్ని త్వరితంగా ప్రయాణింపజేసి, ప్రేవుల మధ్య ఒత్తిడులు అరికట్టడంద్వారా క్యాన్సర్ కు  కారణమైన కార్సినోజినిక్ ల ఉత్పత్తికి విఘాతం కలిగించి క్యాన్సర్ వ్యాధిని నిరోధించగలుగుతుంది.  అందువల్ల మనుషులు తీసుకునే ఆహారంలో అధిక శాతం పీచులేక నార పదార్థం గల ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఆహారంలో పీచుపదార్థం పుష్కలంగా ఉండాలంటే బియ్యం గోధుమలు వగైరా ధాన్యాలను పొట్టు తీయకుండా పిండి పట్టించుకుని వాడుకోవాలి.  ధాన్యాలను ఎక్కువసార్లు కడగకూడదు. కొన్ని కూరగాయలు పచ్చిగా తినడానికి అనువుగా ఉంటాయి. అలాంటి కూరగాయలను పచ్చివిగా తినటం మంచిది. కూరగాయలను తప్పనిసరిగా ఉడికించవలసివస్తే మూతపెట్టి కొద్దిసేపు మాత్రమే ఉడికించాలి. కూరలను ఉడికించినప్పుడు ఆ నీటిని పారేయకుండా వాటిని సూపులు, రసం, చపాతీ పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులుగా వాడటం వంటి మార్గాల ద్వారా వాటిని కూడా ఆహారంగా సేవించే విధానం ఏర్పరచుకోవాలి. ఈ విధంగా క్రమపద్ధతిలో ఆహారాన్ని తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసినంత పీచుపదార్థం లభిస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

భారత్ కు కోవిడ్ వేవ్ ముప్పు ఉందా?

భారత్ కు మరో మారు కోవిడ్ మూడవ విడత ప్రమాదం పొంచిఉందా ?అంటే అవుననే అంటున్నారు నిపుణులు.దేశంలో పెరుగుతున్న xbb కేసులు ఇపట్టికే 9 రాష్ట్రాలలో ఒమేక్రాన్ కొత్త స్ట్రైన్ ఉన్నట్లు గుర్తించారు.దేశంలో 24 గంటలలో కోరోనా 16౦౦ కేసులు పెరిగాయని xbb స్ట్రైన్ గురించి మాట్లాడితే అక్టోబర్ 2౩ వ తేదివరకూ ౩8౦ కేసులు నమోదు అయ్యాయని. ఇది క్రమంగా పెరుగుతోందని xbb సోకిన వారి సంఖ్య తమిళనాడులో ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా నేడు కోరోనా ప్రమాదం పొంచి ఉందని. ఒమైక్రాన్ యొక్క కొత్తరూపం స్ట్రైన్ xbb తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది.సింగపూర్ నుండి భారత్ చేరిందని తమిళనాడులో అత్యదికకేసులు నమోదు అవుతున్నాయని మొత్తం 9 రాష్ట్రాలాలో ఇప్పటికే ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.జర్మనీకి చెందినా సంస్థ గ్లోబల్ ఇనిషిఏటివ్ ఇన్ఫ్లూయెంజా సమాకు సంబందించిన దాటా పంచుకుందని. కోరోనా వైరస్ లో వస్త్ర్హున్న మార్పులు పై దృష్టి పెటారు. భారత్ లో గతవారం xbb సబ్ వేరియంట్ ప్రభావం ఉన్నట్లు నిర్ధారించారు. తమిళనాడులో 175 కేసులు xbb వైరస్ విషయం లో తమిళనాడు ముందుఉందని.ఇప్పటికే 175 కేసులు నమోదు కాగా 1౦౩ కేసులు పశ్చిమ బెంగాల్ లో రెండవస్థానం లో ఉంది. xbbవేరియంట్ కేసులు పశ్చిమ బెంగాల్ లో నమోదు కవాదం విశేషం. కొన్ని రాష్ట్రాలాలో xbb మూడు రూపాలు... xbb కి మూడు సబ్ వేరియంట్స్ ఉన్నాయి. xbb.1,xbb.౩ రూపాలుగా గుర్తించారు. భారత్ లో లభించిన ౩8౦ కేసులలో అత్యధికంగా 68.4 2 కేసులు xbb2 సబ్ వేరియంట్ గా గుర్తించారు. ఇదే15% క్రేసులు xbb.2 2.౩6 కేసులు xbb.1గా గుర్తించారు.దేశంలోని 9 రాష్ట్రాలలో xbb వేరియంట్ విభిన్నమైన రూపాలలో ఉంటుందని ఇక వివిధరాస్త్రాలలో ఎంతమంది దీనిబారిన పడ్డారో చూదాం తమిళనాడు 175 పశ్చిమబెంగాల్ లో 1౦౩ ఓడిస్సలో ౩5 మహారాష్ట్రాలో21 డిల్లి18 పాండిచ్చేరి 16 కర్నాటక 9 గుజరాత్2 రాజాస్తాన్ 1 కేసు నమోదు అయినట్లు సమాచారం.xbbవేవ్ రూపం లో మున్చుకోస్తోందా?ఒమైక్రాన్ కొత్తరూపం xbb వస్తోందని డబ్ల్యు హెచ్ ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాదన్ మాట్లాడుతూ శరీరంలో రోగానిరోదకశక్తిని మోసం చేస్తూ వ్యక్తికి సంక్రమిస్తుందని.దీనితోపాటు. కొన్నిదేశాలలో కోరోనా కొత్తేవవే పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరోనా కొత్తేవేవ్ ౩౦౦ కు పైగా వేరియంట్లు ఉన్నాయని.ప్రపంచవ్యాప్తంగా xbb చాలా శక్తివంతమైనదని పేర్కొన్నారు.గతంలో మనం అత్యంత ప్రమాదకరమైన కోరోనా వేరియంట్లను చూసామని xbb యాంటి వేరియంట్ పై దాడిచేస్తుందని ఈ కారణంగా కొన్ని దేశాలాలో మళ్ళీ కోరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని దీనికితోడు ba5 ba1 పై దృష్టి పెట్టమని వివరించారు. రెండు వేరియంట్లు అత్యంత ప్రమాదకరమని అన్నారు.  

కీళ్ల ఆరోగ్యం కులాసాయేనా??

ఒకప్పుడు అరవై సంవత్సరాలు దాటినా ఆరోగ్యంగా ఉంటూ ఎన్నో పనులు చేసుకుంటూ చక్కని జీవితం సాగించేవారు. మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో ఇలాగే ఉండేది. అందుకే వారు ఇప్పటికీ 80,90 సంవత్సరాల వయసుకు చేరువ అయినా ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఉండగలుగుతున్నారు. అయితే వీరి మనవళ్లు, మనవరాళ్లు మాత్రం 40 సంవత్సరాలు కూడా పూర్తి కాకనే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా కీళ్ల సమస్యలు ఇప్పటి తరాన్ని చాలా వేధిస్తున్నాయి.  ఎముకలు శరీరంలో చట్రాన్ని ఏర్పరిస్తే, అందులో వున్న కీళ్ళు మనిషి కదిలేట్లు చేస్తాయి. రెండు లేక మూడు ఎముకలు కలిసే ప్రదేశాన్ని 'కీలు’ అంటామనే విషయం మనకు తెలిసిందే.. పుర్రెలో వున్న ఎముకల కలయిక తప్ప మిగతా కీళ్ళన్నీ కదిలేవే! కదిలించదగిన కీలులో ఎముకల అగ్రభాగములు పల్చని కార్టిలేజ్ తో కప్పబడి, నునుపైన ఉపరితల ప్రదేశాన్ని కలిగి వుంటాయి. వెన్నుపూసల మధ్య వుండే కార్టిలేజ్ ముక్కలు షాక్ అబ్సార్బర్స్ లాగా పనిచేస్తాయి. ఎముకలు కలిసే ప్రదేశంలో వాటిని ఫైబ్రస్ టిష్యూతో నిర్మింపబడిన తాళ్ళ వంటి లిగమెంటులు కలిసి వుండేట్లు చేస్తాయి. ఈ పొరపై నోవియల్ ఫ్లూయిడ్ అవే ద్రవపదార్థాన్ని  సృష్టిస్తుంది. అది కందెనలా తోడ్పడుతుంటుంది. అయితే చాలామందిలో ఉన్న ప్రశ్న.. కీళ్లు ఎందుకు అలా అరిగిపోతాయి?? చిన్న వయసులోనే కీళ్లు అరిగిపోవడం ఏంటి విచిత్రం కాకపోతే.. అనుకుంటూ వుంటారు.  90°కన్నా ఎక్కువగా మోకాల్ని బెండ్ చెయ్యడం మంచిదికాదు. ఇప్పుడంటే కొన్ని కొత్త ఇళ్లలో టాయిలెట్స్ అన్నీ వెస్ట్రన్ వెర్షన్ వచ్చాయి. కానీ చాలా ఇళ్లలో సాధారణ టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్ వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటూ వుంటాం. ఇలా ఎక్కువగా కూర్చోవటం మంచిదికాదు. మోకాలు కీలుని అంత ఎక్కువగా వంచి కూర్చోవటం వల్ల ఆ కీళ్ళు బాగా అరిగిపోతాయి. ఇలా ఎక్కువగా వాడడం వల్ల ‘జాయింట్స్ ఏజ్' బాగా పెరిగిపోతుంది. మనిషి వయసుతో సంబంధం లేకుండా జాయింట్స్ వయసు పెరిగిపోతుందన్న మాట! కొంతమంది ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఫలానా అతనికి యాభై సంవత్సరాలు దాటినా అరగలేదు, నా కీళ్ళు నలభై అయిదేళ్ళకే అంతగా అరిగిపోయాయేంటి అనుకుంటుంటారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం కీళ్ళు వాడకాన్ని బట్టి అరుగుతాయి కానీ వయసుని బట్టి కాదు. కాబట్టి ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే… కీళ్లు అనేవి వయసును బట్టి కాదు మనం చేసే పనులు, కీళ్లను ఉపయోగించే విధానం మీద ఆధారపడి అరుగుతాయి.  కీళ్లు బలంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి. కీళ్ల మీద మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిలుచుకోవడం, కూర్చోవడం, పరిగెత్తడం, నడవడం, పడుకోవడం ఇలా చేసే ప్రతి పనిలో కీళ్లు సౌకర్యవంతంగా ఉండే భంగిమ చూసుకోవాలి.  ఆహారం, జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ వీటిని సక్రమంగా ఉంచుకుంటే కీళ్ల ఆరోగ్యం కలుక్కుమనకుండా కులాసాగా ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద.

నిద్ర మీద శరాఘాతం ఇన్సోమ్నియా!!

కొందరు మానసిక చికాకులవల్ల, ఆలోచనలవల్ల నిద్ర పట్టడం లేదనుకుంటే మరి కొందరు పైకి ఏ కారణం లేకుండానే రోజుల తరబడి సరైన నిద్రపోకుండా గడిపేస్తారు. కొందరు రాత్రిళ్ళు గుడ్ల గూబల్లాగా కళ్ళు తెరచి గడియారం వంక చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నిరీక్షిస్తూ వుంటారు. ఇలాగే రోజులు, నెలలు, సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపే వ్యక్తులు ఎందరో వున్నారు. ఈ రకంగా నిద్ర పట్టకపోవడం కూడా ఒక వ్యాధే. దీనినే వైద్యభాషలో "ఇన్సామ్నియా" అంటారు. అసలు నిద్ర పట్టకపోవడాన్నీ, ఎవరికైనా నిద్రపట్టినా సరిగ్గా పట్టకపోవడాన్ని ఇన్సామ్నియాగా భావించవచ్చు.  సాధారణంగా పెద్దవాళ్ళు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు, పిల్లలు 10-11 గంటలు నిద్రపోతారు. చంటిపిల్లలు రోజుకు 18 గంటల వరకూ నిద్రిస్తారు. ఎవరికైనా సరే పడుకున్న గంట తరువాత మంచి నిద్ర పడుతుంది. తరువాత 4 గంటలకు ఆ నిద్ర తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ ఒక గంటలో ఆ నిద్ర తీవ్రత పెరుగుతుంది. అంటే ఎనిమిది గంటల పాటు వరసగా నిద్రపోయే వారికి మధ్యలో కొద్దిసేపు నిద్ర తీవ్రత తక్కువగా ఉండి త్వరగా మెలుకువ రావడానికి ఆస్కారం వుంది. ఏది ఏమైనా వయస్సుకు తగినంత నిద్రపోయేవారు. శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి వరసగా రెండు మూడు రోజులు నిద్ర లేకపోయేసరికి కళ్ళు మండడం, తలనొప్పి అనిపించడం, తలతిరగడం, ఒళ్ళు కూలడం, నరాల బలహీనత, అనవసరంగా ఆందోళన కలగడం లాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, శక్తి లేనట్లు అనిపించడం, ఆలోచనల్లో క్రమం లేకపోవడం, కనురెప్పలు బరువుగా మూసుకుని పోవడం, మాటలు తడబడడం, ఊరికినే కోపం, చికాకు కలగడం కూడా సహజమే. కాని నిద్ర రాని వ్యాధితో బాధపడే వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అటువంటి వ్యక్తులు సాధారణంగా న్యూరోటిక్ వ్యక్తులైనా అయి ఉంటారు, లేదా సైకోటిక్ వ్యక్తులయినా ఆయి వుంటారు. న్యూరోటిక్ వ్యక్తులలో మానసిక ఆందోళన, ఆలోచన, గందరగోళం, ఆవేశం ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి భయం, ఆదుర్దా ఉంటాయి. ఇటువంటి ఆందోళనలు, అంతులేని ఆలోచనలు ఉండడంతో నిద్ర పట్టదు. మరి కొందరు మానసిక రోగులకు సైకోసిస్ వల్ల భ్రమలు, భ్రాంతులతో మనస్సునకు స్థిమితం లేక నిద్ర పట్టదు. అలాగే నిరుత్సాహం (డిప్రషన్) వల్ల కూడా కొందరు రోజులతరబడి నిద్రపోకుండా గడిపేస్తూ ఉంటారు. అలాంటి వారు అనవసరంగా చికాకు పడడం, దేనిమీదా సరయిన ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ ముఖంలో ఏదో ఒక విచారము, నఖశిఖ పర్యంతం ఏదో రుగ్మత, నిరాశ, నిస్పృహ ఉండడం, వ్యక్తులతో దూరంగా మసలడం, ప్రతి దానికి తేలికగా అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి.  ఇలాంటి వ్యక్తులు కూడా నిద్ర రాని వ్యాధితో బాధపడడం సహజం. న్యూరోసిస్ గాని, సైకోసిస్ గాని, నిరుత్సాహంగాని మానసిక వ్యాధులే. ఈ మానసిక వ్యాధుల తీవ్రతను బట్టి అసలు నిద్ర పట్టకపోవడమా, కొద్దిగా నిద్రపట్టడమా లాంటివి ఆధారపడి వుంటాయి. డిప్రషన్ తో బాధపడే చాలామంది తాము ఫలానా కారణం వల్ల బాధపడుతున్నామని తెలుసుకోలేక నిద్రపట్టక పోవడం వల్లనే తక్కిన లక్షణాలన్నీ వున్నాయని భావిస్తారు. కాని నిద్ర పట్టకపోవడం కూడా డిప్రషన్ లో ఒక లక్షణమని గుర్తించరు.  నిద్ర రాకపోవడానికి మానసిక వ్యాధులు కారణమయిన పక్షంలో కాస్తో కూస్తో నిద్రను కూడా చెడగొట్టే ఇతర  స్థితులు సైతం "ఇన్సామ్నియా"కి దోహదం చేస్తాయి. కొందరికి నిద్రపట్టి పట్టగానే కాలో చెయ్యో అకస్మాత్తుగా ఎవరో పట్టుకొని గట్టిగా ఊపేసినట్లయి వెలుకువ వచ్చేస్తుంది. కొందరికి మొత్తం శరీరాన్నే కుదిపేసినట్లు అవుతుంది. ఇలా జరగడానికి నిద్రపోయే వ్యక్తిలో ముఖ్య మయిన నాడీ కేంద్రాలు కూడా విశ్రమిస్తే, చిన్న చిన్న నాడీ కేంద్రాలు స్వేచ్ఛ వచ్చినట్లయి ఒక్కసారిగా విచ్చలవిడిగా వ్యవహరించడమే కారణం. నిద్రపట్టక పోవడానికి తగిన మానసిక వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. మానసిక ఆందోళన, చికాకులు నిద్రపట్టకపోవడానికి కారణాలు అయిన పక్షంలో ట్రాన్క్విలైజర్స్, డిప్రషను అయితే అది పోవడానికి మందులు వాడితే మంచి ఫలికాలు కలుగుతాయి. సరైన చికిత్స పొందకుండా ఊరుకుంటే ఆ వ్యక్తిలో వృత్తి నైపుణ్యము తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా త్వరగా దెబ్బతింటుంది.   ◆నిశ్శబ్ద.

యమపాశం లాంటి క్షయకు చెక్ పెట్టండి ఇలా...

ఈ మధ్య కాలంలో విస్తృతం అవుతున్న ఆరోగ్య సమస్యలలో టిబి కూడా ఒకటి. దీన్నే క్షయ అని కూడా అంటారు. ఈ క్షయ వ్యాధి చూడడానికి సాధారణ దగ్గులా అనిపించి అయోమయానికి గురి చేస్తుంది. కానీ దీన్ని గురించి తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతక సమస్యగా  మారే అవకాశం ఉంటుంది.  ఇంతకూ ఈ క్షయ సమస్య ఎందుకు ఎలా వస్తుంది?? దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?? టిబి సోకిన వారికి చావే గతి అని అంటూ ఉంటారు చాలామంది. అది నిజమేనా లేక అపోహనా?? టిబి నయం అవుతుందా?? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే ఈ సమస్య గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఈ సమస్య నుండి ప్రతి ఒక్కరు తమని తాము కాపాడుకునేందుకు ఆస్కారం వుంటుంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… టి.బి ఎందుకు ఎలా వస్తుంది?? టి.బి అనే దాన్ని క్షయ అని కూడా అంటారు. ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వల్ల వచ్చే సమస్య. ఈ బాక్టీరియా సాధారణ వ్యక్తి పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశించి క్షయను కలుగజేస్తుంది. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. టిబి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి?? టిబి లేదా క్షయ వ్యాధి సోకిన వారి లక్షణాలు పైకి కనిపిస్తాయి. విపరీతమైన దగ్గు ఉంటుంది. ఈ దగ్గు కూడా కఫంతో కూడి ఉంటుంది. ఇది సుమారు మూడు వారాలకు పైగా ఉంటే వ్యాధి లక్షణంగా అనుమానించాల్సి ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, ఆయాసం, తేలికపాటి జ్వరం, శరీరం శుష్కించిపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దగ్గు క్రమంగా పెరిగితే రక్తంతో కూడిన కఫం పడే అవకాశం కూడా ఉంటుంది. టిబి సమస్యకు జాగ్రత్తలు ఏమిటి?? టిబి సోకిన వారు అది ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గుతో ఉంటారు కాబట్టి మాస్క్ ధరించాలి. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకూడదు. చల్లని వాతావరణానికి తిరగకూడదు. వైద్యులు సూచించిన మందులు వాడుతూ తమ వస్తువులను విడిగా ఉంచుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. టిబి సమస్య లేనివారు తమ చుట్టూ టిబి వ్యాధి వ్యాప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎక్కడంటే అక్కడ తినడం, తాగడం చేయకూడదు. బయట ప్రాంతాలలో ఉమ్మివేయకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు రద్దీ ప్రాంతాలలో తిరిగెటప్పుడు మాస్క్ ధరించాలి.  టిబి నయం అవుతుందా??  టిబి వ్యాధి గురించి పట్టించుకోకపోతే అది ప్రాణాంతకం అయినప్పటికీ దాన్ని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడితే ఆరు నెలలలోపు జబ్బు తగ్గిపోతుంది. కాబట్టి టిబి వస్తే ఇక చావే గతి అనే అపోహను వదిలేయాలి. క్షయ రోగానికి కేవలం ఇంగ్లీషు వైద్యం మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా వైద్యం అందుబాటులో ఉంది. ఏ రకం వైద్యం అయినా వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడితే టిబి నయమవుతుంది. చలి మరియు వర్షా కాలంలో ఈ సమస్య మరింత విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి.                                    ◆నిశ్శబ్ద.

ఆకుకూరలు ఎందుకు ముఖ్యం?? క్యాల్షియం ఎందుకు అవసరం??

మనం రోజువారీ తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఎంతో ముఖ్యమైనవి. అయితే చాలామంది ప్రస్తుతం పట్టణాల్లో నివశిస్తున్నవారు అందుబాటులో లేవనే కారణంతో ఆకుకూరలు సరిగా తీసుకోవడం లేదు. కొందరు ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని ఆకుకూర మొక్కలు పెంచుకుని అప్పుడప్పుడు వాటిని తింటూ ఉంటారు. అవి ఎంతో ఆరోగ్యకరమే కాకుండా రసాయనాలు లేనివి కాబట్టి పలితాలు కూడా బాగా ఇస్తాయి. కానీ అసలు ఆకుకూరలు తిననివారు చాలామంది ఉంటారు.   అసలు ఆకుకూరలు ఎందుకు తీసుకోవాలి?? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? వంటివి వివరంగా తెలిస్తే వాటిని ఆహారంలో తప్పకుండా తినడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. నిజానికి ఆకుకూరల ప్రాధాన్యత చిన్నప్పటి నుండి పాఠాలలో చదువుకుని తెలుసుకుంటూనే ఉన్నాం, విటమిన్స్ మొదలైన అంశాలలో మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకుంటుంటాం కానీ ఆరోగ్యం గురించి మాట్లాడుకునే సమయంలో మళ్ళీ వాటిని వివరంగా చర్చించుకోవాలి. లేకపోతే మన మొండి బుర్రలు ఆరోగ్యం గురించి భయంతో ఉండవు.  ఆరోగ్యానికి ఆకుకూరలు రోజు తినాలి వీటిలో కూరగాయల కంటే రెట్టింపు పోషక విలువలు, మాంసకృత్తులు ఉంటాయి. చాలామంది పాలకూర, టమాట కలిపి వండుకునే విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ రెండింటిని అప్పుడప్పుడు సందేహం లేకుండా వండుకుని తినచ్చు.   ఆకు కూరలను మొక్కల నుండి కోసిన తరువాత ఒకటి రెండు రోజులు నిలువ ఉంచుకోవచ్చేమో కానీ వాటిని చిన్నగా తరిగి నిలువ ఉంచకూడదు. అలా నిలువ ఉంచితే వాటిలో ఉండే పోషక విలువలు పోతాయి.   చాలామంది క్యాల్షియం తక్కువ ఉందని, ఐరన్ తక్కువ ఉందని టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా టాబ్లెట్లు ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి.  అందుకే వీటిని ఆకుకూరల నుండి పొందవచ్చు.  ఆకు కూరలతో చాలామంది పొడికూరలు చేస్తుంటారు. ఆకుకూరలు ఫ్రై చేసి చేసే ఈ పొడికూరలలో పోషకాలు ఏమి ఉండవు. ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు నశిస్తాయి. అలాగే ఆకుకూరలతో చింతపండు ఎక్కువ జతచేయకూడదు   తోటకూరను పెరుగు కలిపి నూనె లేకుండా వండుకోవచ్చు, అలాగే గోంగూరను  పాలు కలిపి వండుకోవచ్చు  అయితే నూనె లేకుండా వండాలి. ఇలా చేస్తే  రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యం కూడా.  పప్పులను కూరగాయలతో లేదా ఆకుకూరలతో కలిపి వండుకోవాలి. దీనివల్ల రుచి మాత్రమే కాదు రెండింటి వల్ల పోషకాలు సమతుల్యంగా ఉంటాయి.  ఆకు కూరలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మద్యాహ్న సమయంలో తినాలి. ఆకుకూరలను పప్పులతో కలిపి వండినప్పుడు వాటిని  సాయంత్రం(లేదా రాత్రి) సమయంలో  తింటే గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. ఆకుకూరలు అన్నింటిలో "ఎ" విటమిన్ పుష్కలంగా ఉంటుంది.  ఎన్నో చోట్ల విరివిగా పెరిగే చెట్లు మునగచెట్లు.  వీటికి ప్రత్యేక నీటి వసతి, సంరక్షణ అవసరం లేదు. వాటికవే పెరుగుతాయి. వీటి నుండి లభించే మునగాకును ప్రతిరోజు వంటలలో వాడవచ్చు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో అధికమొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు.  ఆకు కూరలలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని విరివిగా వాడితే మహిళలకు  జట్టు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు, కరివేపాకు బాగా వాడాలి.  ఆకుకూరలు బాగా వాడితే బాలింతలకు మంచిది. వీటివల్ల బాలింతలకు పాలు బాగాపడతాయి. ఆకుకూరలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం టాబ్లెట్లు వాడితే అనర్థాలు కలుగుతాయి. అదే  సహజంగా లభించే క్యాల్షియం ద్వారా మన శరీరానికి ఎలాంటి అనర్థముండదు. కిడ్నీలో రాళ్లురావు.   మనకు అవసరమైన ఐరన్ కూడా  పండ్లలో కంటే ఆకు కూరలలోనే ఎక్కువగా ఉంటుంది. పాలకూర, శనగపిండి, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం అన్ని కలిపి నూనె లేకుండా వెయించి బజ్జీల్లాగా తినవచ్చు. గోధుమలు, పాలిష్ చేయని బియ్యం వంటి వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకుంట పూర్తి స్థాయిలో కాల్షియం అందుతుంది. ఒకసారి తీసుకున్న పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు సుమారు 300 మిల్లీల కాల్షియాన్ని అందిస్తాయి.  క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన వాలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం శరీరంలో వచ్చే వ్యాధి కారక క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి క్యాల్షియాన్ని శరీరానికి సరిపడా అందివ్వాలి.                                      ◆నిశ్శబ్ద.  

కిడ్నీ ఫెయిల్యూర్ ను కనిపెట్టచ్చు ఇలా….

ఈమధ్య కాలంలో చాలామంది విషయంలో తరచుగా వినబడుతున్న మాట కిడ్నీ ఫెయిల్యూర్. శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం అయిన కిడ్నీలు దెబ్బతినడం అంటే ఆరోగ్యానికి చాల పెద్ద ముప్పు వచ్చినట్టే. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి?? అది ఎలా వస్తుంది?? దాన్ని ఎలా నిర్ధారిస్తారు వంటి విషయాలు తెలుసుకుంటే… కిడ్నీ ఫెయిల్యూర్ అంటే…. మూత్రపిండాలలోని నెఫ్రాన్లు వడపోత పోయగలిగే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు దానిని మూత్ర పిండాలు వైఫల్యం చెందడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు.  ఈ సమస్య హఠాత్తుగానూ జరగవచ్చు లేదా ఏళ్ళ తరబడి లక్షణాలేమీ కనిపించక పోయినా... చివరికి ఎప్పుడో బైటపడవచ్చు. హఠాత్తుగా కిడ్నీ ఫెయిల్యూర్ అయితే దానికి మూత్రపిండాలపైన బలమైన దెబ్బలు తగలడం కాని, విపరీతమైన రక్తస్రావం కావడం కానీ, విషపదార్ధాలను తీసుకోవడం కానీ కారణం అయి ఉంటుంది. అలాగే చాలా రకాల మందులకు మూత్రపిండాల మీద దుష్ప్రభావాన్ని చూపించే గుణం ఉంది. మూత్రపిండాలకు మందుల నుండి ప్రమాదం అంటూ ఉంటే అది 'ఓవర్ ది కౌంటర్' మందుల నుంచే ఉంటుంది. ఈ మందుల్లో చాలా వరకూ జ్వరాన్ని, నొప్పిని తగ్గించేవే ఉంటాయి. యాసిన్, ఎసిటెమైనోఫిన్, బబుబ్రూఫెన్ మొదలైన మందులన్నీ మూత్రపిండాల పై దుష్ప్రభావాన్ని చూపించేవే. మూత్రపిండాల వ్యాధితో బాధపడే వాళ్లు కానీ, అవి వచ్చే అవకాశాలు ఉన్నవాళ్లు గానీ ఈ మందులను ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. ఎంతోకాలం నుంచి మూత్రపిండాల వైఫల్యం కొనసాగుతున్నట్లైతే దానికి హై బీపీ కాని, షుగర్ కాని కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మధుమేహంలో గ్లూకోజ్ కణజాలాలకు అందకుండా రక్తంలోనే ఉండిపోయి మూత్ర పిండాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. హై బీపీలో మూత్రపిండాలలో ఉండే కేశ సాదృశ్యమైన రక్తనాళాలు నష్ట పోయి వడపోత దెబ్బతింటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు:  మూత్రపిండాల వ్యాధుల్లో, ముఖ్యంగా మూత్రపిండాల వైఫ్యలం మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం తర్వాత అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. నలతగా అనిపిస్తుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దురదగా ఉంటుంది. మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. కానీ, మూత్రం తక్కువగా వస్తుంది. ఆకలి ఉండదు. కడుపులో తిప్పుతున్నట్లుగా, వికారంగా అన్పిస్తుంటుంది. కాళ్ళు, చేతులు వాపులు వస్తాయి. ముఖం ఉబ్బుతుంది. శరీరమంతా మొద్దుబారినట్టు, తిమ్మిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి నిర్ధారణ :  రక్తంలో క్రియాటినిన్, యూరియా నైట్రోజెన్ అధిక మోతాదులో ఉన్నా,  మూత్రంలో ప్రొటీన్  ఎక్కువగా పోతున్నా, మూత్రపిండాల వ్యాధి బారిన పడినట్లు గ్రహించాలి. క్రియాటినిన్ అనేది కండరాల విధి నిర్వహణలో వెలువడే వ్యర్థ పదార్థం. అలాగే యూరియా నైట్రోజెన్ అనేది శరీరంలో ప్రొటీన్ వినియోగం తర్వాత రక్తంలోకి విడుదలయ్యే వ్యర్థ పదార్థం. ఈ రెండు పదార్థాలను మూత్రపిండాలు వడపోయ లేకపోవడంతో అవి రక్తంలోనే పేరుకుపోతాయి. అందుబాటులో ఉన్న నిర్దారణ మార్గాలు:-  అల్ట్రాసౌండ్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ వంటి పరీక్షలను చేయడం వల్ల మూత్రపిండాలలో వ్యాధి పెరుగుదలను కనిపెట్టే అవకాశం ఉంది.  కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మధుమేహం కానీ, హైబీపీ వంటివి ఉంటే వాటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ప్రోటీన్ వాడకాన్ని తగ్గిస్తే మూత్రపిండాల పై ఒత్తిడి తగ్గు తుంది.. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించాలి, ఆహారంలో ఉప్పు వాడకం కూడా తగ్గిస్తే చాలా మంచిది.                                    ◆నిశ్శబ్ద.

మంచి నిద్రకు ముచ్చటైన మార్గాలు ఇవిగో!

ఆరోగ్యకరమైన మంచి నిద్ర అందరికీ ఇష్టమే.. అయితే ఈమధ్య కాలంలో నిద్ర కూడా యాంత్రికం అయిపోయింది. మరబొమ్మలాగా అలా పడుకోవడం, అలారం మొగగానే లేచి పనులలోకి జారుకోవడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. అయితే మంచి నిద్ర ఇక ఎవరికీ సాధ్యం కాదేమో అనుకుంటే పొరపాటు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అంటారు- నాకు మూడు గంటల నిద్ర అయినా లక్షణంగా సరిపోతుంది అని. కానీ కొంతమంది మాత్రం 7 నుండి 8 గంటలు నిద్రపోయిన నిద్రసరిపోలేదు అని వాపోతుంటారు. దీనికి కారణం ఏమిటంటే… పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. నిద్ర అనేది మనిషికి పూర్తి వ్యవస్థను ఒక ట్రాన్స్ లోకి పంపినట్టు ఉండాలి. అది ఎలాగుంటుంది అంటే శరీరం ఒక శవ స్థితికి వెళ్ళిపోతుంది. కానీ ప్రస్తుతం అందరూ నిద్రపోయే తీరు ఎలాగుంటుంది అంటే అందరిదీ కోడి నిద్ర. నిద్రపోతున్నాం అనేమాటే కానీ చీమ చిటుక్కుమన్నా, లైటు చటుక్కున వెలిగినా లేచి కూర్చుంటారు. మరి ఎలా??  గొప్పవారికి సాధ్యమైనట్టు  కొద్దిసేపటి నిద్ర మన దేశానికి సరిపడిన శక్తిని, విశ్రాంతిని ఎలా ఇస్తుంది అని అనుకుంటారు చాలామంది. అయితే సుఖమైన నిద్ర కొద్దిసేపు అయినా ఎంతో శక్తిని శరీరంలోకి విడుదల చేస్తుంది.  అద్భుతమైన నిద్రకోసం కొన్ని అమేజింగ్ చిట్కాలున్నాయి… ఈ మాత్రం మాకు తెలియదా అంటారు కొందరు. కానీ మంచి నిద్రకు మొదటి చిట్కా సమయపాలన. ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరం ఆ సమయానికి విశ్రాంతి స్థితిలోకి వెళ్లడం అలవాటు పడుతుంది. శరీరం ఇలా అలవాటు పడితే ఇతర అవాంతరాల ప్రభావానికి లోనవ్వదు. హాయిగా నిద్రపోవచ్చు.  రాత్రిపూట పండుకునేముందు చాలామందికి చల్లగా ఏమైనా తాగాలని అనిపిస్తుంది. అయితే ఈ చల్లటి పానీయాలను త్రాగకూడదు.  చల్లని పానీయాలు జీర్ణం అవడానికి చాలా శక్తి ఖర్చు అవుతుంది.  ఇంకా కొందరికి నిద్రపోయే ముందు టీవీ చూడటం, పాటలు వినడం వంటి అలవాటు ఉంటుంది. అయితే అది చాలా తప్పు. నిద్రపోవడానికి అరగంట ముందే అన్నిటినీ బంద్ చేయాలి. మొబైల్ ఫోన్ కూడా దూరంగా పెట్టి పడుకోవాలి.  నిద్రపోయేవారికి కొందరికి తలకింద చాలా ఎత్తుగా ఉన్న దిండ్లు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా ఎత్తైన దిండ్లు పెట్టుకోకూడదు. నిద్రకు ఆహారానికి దగ్గర సంబంధం ఉంటుంది. చాలామంది ఫుల్ గా తింటే ఎక్కువ శక్తి వస్తుందని బాగా నిద్ర పడుతుందని అంటారు. కానీ రాత్రి పూట ఎక్కువ తినకూడదు. కడుపు కాస్త తేలికగా ఉండాలి. దీనివల్ల శరీరం కూడా తేలికగా ఉండి మంచి నిద్ర వస్తుంది. అంతేనా శరీరంలో జరిగే క్రియలు కూడా అస్తవ్యస్తం కావు. అదే ఎక్కువ తింటే శరీరంలో క్రియలు వేగంగా ఉంటాయి. దానివల్ల నిద్ర సరిగా పట్టదు.  ఈ చిట్కాలు పాటిస్తే అందరికీ సుఖవంతమైన నిద్ర సొంతమవడం ఖాయం.                                       ◆నిశ్శబ్ద.

ఇలా చేస్తే జుట్టు పెరుగుతుందా ?...

  యోగా శరీరానికి వ్యాయామం మేకాడు శరీర దారుడ్యానికి,మానసికంగా ఒత్తిడిని తట్టుకునేందుకు దోహదం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మన ముఖాన్ని అందంగా ఉంచేందుకు యోగా ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు. యోగా చేస్తే జుట్టు పెరుగుతుందా సహజపద్దతిలో జుట్టు పెరగాలంటే ఈ యోగాసనాలు వేస్తే జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది అని అంటున్నారు నిపుణులు.మీరు ఎన్నిరకాల ఉపాయాలు ప్రయోగించి నప్పటికీ జుట్టు రాలిపోవడం. పెరగడం ఆగిపోయిందా. అయితే మీకు చెప్పాల్సింది ఒకటే మీరు 5 రకాల యోగ ఆసనాలు వేస్తే మీజుట్టును అన్నిరకాల సమస్యలనుండి మీకు ఉపసమనం కలిగించడం లో సహాయ పడుతుంది. జుట్టు రాలిపోవడం... స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే వారికురులు అంటే వారికి ప్రేమకలగడం సహజం.ప్రతి ఒక్కరికీ అందమైన మెరిసే జుట్టు ఉండాలని అది గాలికి అలా ఊగుతూ ఉంటె ఇంకాబాగుంటేనే ఇష్టపడతారు. కానీ నేటి జీవితంలో మనం అనుసరిస్తున్న జీవన శైలి కారణం గానే జుట్టు ఊడిపోవడం రాలిపోవడం. సహజమై పోయింది.ప్రజలు తమ అందమైన సిరోజాలకోసం ప్రజలు అత్యంత ఖరీదైన షాంపూలు కన్దీషనర్లు, వాడుతున్నారు. దీనికి తోడు మరిన్ని మందులు తీసుకుంటున్నారు.అయినప్పటికీ జుట్టు పై ఎలాంటి ప్రభావం ఉండడం లేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేసారు.మీకు కొన్ని యోగా ఆసనాలు చూపిస్తాం దీనివల్ల దీనివల్ల మీజుట్టు రాలిపోకుండా ఊదిపోకుండా అలాగే దట్టంగా ఒత్తుగా నిగనిగలాడుతూ సిల్కీగా మెరుస్తూ ఉంటుంది  జుట్టు పెరగడానికి 5 యోగాసనాలు ఇవే... వజ్రాసనం... వజ్రసనాన్నితండర్ బోల్డ్ పోజు గా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం ద్వారా మనశరీరంలో ఉన్న పంచేంద్రియాలు బలంగా ఉంచుతాయి.దీనివల్ల జుట్టులో ఉన్న మూలాలకు సరాసరి పోషకాలు లభిస్తాయి. మనజుట్టు పగిలిపోవడం రాలిపోవడం ఊడిపోవడం వంటివి సహజంగా జరుగుతాయి. వజ్రాసనం వేయడం ద్వారా ఒత్తిడి,సమస్యల నుండి దూరంగా ఉండేందుకు సహకరిస్తుంది. అధోముఖ ఆసనం.. ఈ ఆసనం వేసినప్పుడు కుక్క ను పోలిన భంగిమలో శరీరాన్ని వంచుతారు. ఈ యోగ ఆసనం ద్వారా మనం ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది దీనివల్ల సమయానికి ముందుగానే వచ్చేబాల మెరుపు,తెల్లజుట్టు రాకుండా నివారించ వచ్చు.ఈ యోగా అసనం ద్వారా మన జుట్టును సహజమైన రంగు సజీవంగా ఉంచేందుకు సహాయ పడుతుంది అదీకాక మన స్కాల్ప్ లో రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. శీర్షాసనం... ఈ ఆసనం వేయడం ద్వారా మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోవడం బట్టతల వచ్చే అవకాశం ఉంది.ఈ ఆసనం వేయడం ద్వారా జుట్టు తెల్ల బడడం మళ్ళీ జుట్టు మొలవడం జరుగుతుంది. పవన ముక్తాసనం... మన శరీరంలో ఉన్న గాలిని బయటకు వదిలి పెట్టేందుకు ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం మన శరీరంలో ఉన్న పంచెంద్రియలాను బలంగా ఉంచుతుంది. దీనివల్ల జుట్టు పెరగడం సాధ్యమౌతుందని ఈ ఆసనం సాధన చేయడం ద్వారా జుట్టుకు సరైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఊష్ట్రాసనం... ఈ ఆసనం ఒంటె ఆకారాన్ని పొలిఉంటుందని ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా మెదడులో రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుందని దీనివల్ల జుట్టు రాలడం పగిలి పోవడం తగ్గిపోతాయి. జుట్టులో మెరుపు వస్తుందని యోగసాధకులు అంటున్నారు.                                        

ఆరోగ్యం సంరక్షణ అందరికీ కావాలి!

మనిషి జీవితానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. కానీ ఆరోగ్యం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతోందిప్పుడు. ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటికి వైద్యం చేయించుకోవాలి అంటే డబ్బులేనిది పని జరగదు. దీనివల్ల ఆరోగ్యం అనేది దిగువ వర్గాల వారికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఆరోగ్య భద్రత కొందరికి మాత్రమే పరిమితం అవుతోంది. దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆరోగ్య సంరక్షణ అనేది ఒకరికి మాత్రమే పరిమితమైన, పరిమితమవ్వాల్సిన అంశం కాదు. మనిషి ఆరోగ్యం ఎంత బాగుంటే, అంత ఆరోగ్యవంతమైన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ని ప్రకటించింది.  ఇంతకూ ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఎప్పుడు మొదలయ్యింది?? దీని సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఏమిటి?? వంటి విషయాలలోకి వెళితే… యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే!! ఎన్నో విషయాలకు ప్రాముఖ్యత ఇస్తూ వాటి గురించి అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి వాటికి సంబంధించి దినోత్సవాలను నిర్వహిస్తోంది. వాటిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కూడా ఒకటి. దీన్ని 2017 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.  యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత!! ప్రపంచ వ్యాప్తంగా మాకూ ఆరోగ్య సంరక్షణ కావాలి అని గొంతెత్తి చెప్పలేని పరిస్థితులలో చాలామంది  ఉన్నారు. వారందరూ పేదరికమనే వృత్తంలో చిక్కుకుపోయి కనీస ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతున్నారు. వారి పక్షాన నిలబడి వారికీ ఆరోగ్య సంరక్షణ అవసరమే అనే విషయాన్ని వ్యాప్తం చేయడమే ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత.  మనిషికి ఉన్న హక్కులలో భాగంగా ఆరోగ్యాన్ని పొందడం కూడా ఒకటి అని అందరూ గుర్తించేలా చేయడం. అన్ని దేశాలలో ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కనీస అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కొన్ని ఇతర సంస్థలు కలిసి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ని నిర్వహిస్తాయి.  దీని ప్రణాళికలు ఏమిటంటే… యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే  2015 సంవత్సరంలో డవలప్మెంట్ గోల్స్ లో చేర్చబడింది. ఆ సందర్భంగా 17 లక్ష్యాలను అందులో పొందుపరిచింది. వాటిని 2030 సంవత్సరానికల్లా సాధించే దిశగా నిర్ణయం తీసుకుంది. వాటిలో పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలితో అలమటించే వారి సంఖ్యను తగ్గించడం. అందరికీ ఆరోగ్యం సాధ్యమయ్యేలా చేయడం, లింగ సమానత్వంతో సరిపోయేలా విద్య, ఇతర అవసరాలు అందేలా చేయడం. అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, అవసరమైన వనరుల లభ్యతతో పాటు, ఆర్థిక వృద్ధి, పరిశ్రమల వృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధికి తగ్గట్టు అందరి జీవితాల్లోనూ అభివృద్ధి మొదలైనవి ప్రణాళికగా రూపొందించబడ్డాయి. అందరికీ న్యాయం, అందరి మధ్య ఆరోగ్యకరమైన శాంతి వాతావరణం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి. ఇలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే రోజున జరిగే కార్యక్రమాలు ప్రజల జీవితంలో ఆరోగ్య ప్రాధాన్యత గురించి, ఆరోగ్య సంరక్షణ గురించి వ్యాప్తం చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత, ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తే ఈ రోజు ప్రాముఖ్యతను నిజం చేసినవారం అవుతాము.                                     ◆నిశ్శబ్ద.

భారత్ లో 75% హైపర్ టెన్షన్ వల్ల మరణాలు లాన్సెట్!

భారత్ లో 75% కి పైగా మరణాలు హై బిపి నియంత్రణ లేకపోవడమేనని  లాన్సేట్ 2౦ 16-2౦2౦ మధ్యలో నిర్వహించిన సర్వేలో వివరాలను ఒక జర్నల్ లో ప్రచురించింది.75% రోగులు భారత్ లో హైపెర్ టెన్క్షన్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని నియంత్రించడం సాధ్యం కాక పోవదానికి గల కారణాల పై పరిశీలన వివరాలను లాన్సేట్ వెల్లడించింది.బి పి నియంత్రణ లేక పోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయి 2౦19-2౦2౦ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. హైపర్ టేన్క్షణ్ పురుషులలో 24% స్త్రీలలో 21% గా నమోదు అయ్యింది. ఈమేరకు 2౦15-2౦21 నాటికి ఈ గణాంకాలు 19 % గాను 11% గాను చేరింది.హై పర్ టెన్క్షణ్ కు సిస్టోలిక్ <14౦ ఎం ఎం డియా స్టోలిక్ <9౦ నియంత్రణకు వాడుతున్నారు.దక్షిణ తూర్పు ఆశియా ప్రాంతాలలో లాన్సేట్ నిర్వహించిన పరిశోదన లో కేరళ రాష్ట్ర్రానికి చెందిన పరిశోధకులు చేరడం తో బిపి నివారణకు 2౦౦1-2౦ 2 2 లో మద్ష్య భారత్ లో ప్రభుత్వ కృషి అవగాహన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్నప్పటికీ హై బి పి వ56% నుండి 25 % పెరిగింది భారత్ లో 4 గురు పెద్ద వాళ్ళలో ఒకరికి హై బిపి నియంత్రణ సాధ్యం కావడం లేదని కార్డియో సమస్యలు మరణాలకు కారణమని 1/౩ వంతు మరణాలు సి వి డి అంటే కార్డియో వాస్క్యులర్ డిసీజ్ హై బి పి మరణాలు సంభవిస్తున్నాయని తిరువనంత పురం ప్రభుత్వ వైద్య కళాశాల కు చెందిన డాక్టర్ ఆల్తాఫ్ అలీ పరిశోదనలో వెల్లడించారు.ఈ పరిశోదన ౩4- 51 రకాల అంశాల పై పరిశోదనలు నిర్వహించడం గమనార్హం. 21  పరిశోదనలలో బప్ ని నియంత్రించడం లో పురుషులకంటే స్త్రీలు 41% గా అంచనా వేసారు.గ్రామీణ ప్రాంతాలలో మహిళలు 12%గా ఉన్నారని, 2౦21-2౦ నాటికి స్త్రీపురుషులలో 18% మాత్రమే నియంత్రణ సాధ్య మయ్యిందని.జీవనశిలి ఇతర సమస్యల వల్ల బి పి నియంత్రణ సాధ్యం కాలేదని పరిశోధకులు గుర్తించారు.బిపి నియంత్రించక పోవడం వల్ల మిలియన్ల ప్రజలు రానున్న యువతరం ప్రాణాలు కాపాడుకోవచ్చు. బిపి నియంత్రణ అవగాహన అభివృద్ధి మదింపు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పరిశోదనలో వెల్లడించారు.  

వాతావరణంలో ఉష్ణోగ్రతలో మార్పులు వైరస్ వ్యాప్తికి సహకరిస్తుందా ?

వాతవరణం లో ఊహించని విధంగా ఉష్ణోగ్రతలలో వస్తున్న హెచ్చు తగ్గుల వల్ల వైరస్ లు పెరుగుతున్నాయని అదీ ఎక్కువగా దాదాపు పక్షం రోజుల పాటు ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు.కొందరు ఈ వైరస్ ను కోవిడ్ అనుకుని పరీక్షించగా అది కోవిడ్ కాదని తేలడం తో ఊపిరి పీల్చుకున్నారు.ఇది సాధారణ వైరస్ మాత్రమే అని సహజంగా ప్రతి సంవత్చరం వస్తుందని నిపుణులు తెలిపారు.రాయ పూర్ కలకత్తా  వాసులను చుట్టుముట్టాయని అయితే ఈ వైరస్ కోవిడ్ లక్షణాలకు సగ్గర దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు.జ్వరం,దగ్గు, ఒళ్ళు నొప్పులు డయేరియా ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వాతావరానం లో అనూహ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారం రోగులుగా గమనిస్తున్నట్లు ఈ వైరస్ వారం రోజుల పాటు చాలా యాక్టివ్ గా ఉంటుందని ఇది సహజమైన వైరస్ గా పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల దగ్గు వస్తుందని అందుకోసం యాంటి బాయిటిక్స్ వాడాలని సూచిస్తున్నారు.వైరస్ లలో రైనో వైరస్,హ్యూమన్ మెటా నీమో వైరస్, ఎడినో వైరస్, ఇంఫ్లూఎంజా వైరస్ లు కీలక మైనవని డాక్టర్లు అంటున్నారు.అయితే వైరస్ ను గుర్తించడం కష్టంపరీక్షలు చేస్తే తప్ప వైరస్ గుర్తించడం సాధ్యం కాదు అవి చాలా తక్కువే ఉంటాయని నిపుణులు అంటున్నారు.కొన్ని సందర్భాలలో కోవిడ్ పోజిటివ్ అయి ఉండవచ్చని సందేహం ఉంటె పరీక్షించుకోడం అవసరం.కోవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్నప్పటికీ ఎవరికీ పోజిటివ్ రాలేదు. గత 15 రోజుల్లో కొంత మంది పిల్లలో ఎడినో వైరస్ ఉన్నట్లు గుర్తించారు.కోవిడ్ లక్షణాలు దగ్గర దగ్గర గా ఉండచ్చు అది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అది తీవ్ర తరం కవాచ్చు చాలామంది రైనో వైరస్ వేరియంట్లు ఇంఫ్లూఎంజా కారణంగా జ్వరం 4 నుండి 5 రోజుల పాటు ఉంటుంది అని కిమ్స్ ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు, డాక్టర్ పాపారావు పీర్లేస్ ఆసుపత్రికి చెందిన మైక్రో బయాలజిస్ట్ భాస్కర్ నారాయణ చౌదరి అన్నారు. ఈ వైరస్ ప్రభావం వల్ల సవాల్ప జ్వరం తీవ్రమైన దగ్గు దీని సహజమైన లక్షణం గా డాక్టర్ ఆర్ ఎన్ టాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ కార్డియోక్ సైన్స్ దర్వెన్ పంజా మాట్లాడుతూ అప్పర్ రేస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రైనో వైరస్ వల్ల వస్తుంది అని ఇంఫ్లూ ఎంజా వైరస్ తరచూ గా వస్తూ ఉంటుందని వారం రోజులకు పైగానే ఈ సమస్య ఉంటుందని టాగూర్ విశ్లేషించారు.వాతావరణం లో ని ఉష్నోగ్రతలలో వచ్చే హెచ్చు తగ్గులు  మార్పులు వల్ల వైరస్ వృద్ధి చెందుతుంది అతిగా గనక యాంటి బాయిటిక్స్ వాడితే విరేచనాలు అవుతాయాని అంటున్నారు నిపుణులు. సహజమైన వైరస్ ల వల్ల ఇలాంటి లక్షణాలు మీకు 5 రోజులు ఉంటుంది.65 సంవత్స్చారాలు పై బడిన 12 సంవత్చారాల లోపు వారిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.ఇన్ఫెక్షన్ అత్యంత ప్రమాదకరమైనది సత్వరం గుర్తించి యాంటి బాయిటిక్స్ చికిత్చ చేయడం ద్వారా ఆసుపత్రిలో చేరకుండా నివారించవచ్చు.ఒక్కోసారి యాంటి బాయిక్స్ వికటించే అవకాశం ఉంది అత్యవసర చికిత్చకూడా అవసరం కావచ్చు అని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శాంతనూ రాయ్ అన్నారు.ప్రాధమిక స్థాయిలో గుర్తించి తక్షణం చికిత్చ అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడ వచ్చు. లేదా చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రామాదానికి దారితీయవచ్చు.

యువకులలో కార్డియాక్ అరెస్ట్ లు ఎందుకు పెరుగుతున్నాయి!

యువకులలో నానాటికి కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనుండి ఎలా బయట పడాలి అన్నదే సదేహంగా మారుతోంది.ఒక ఆశ్చర్య కరమైన ఘటన లలో ప్రాణాలు కోల్పోతున్న అంశాలను నిసితం గా  పరిశీలించినప్పుడు.కొన్ని విషయాలు ఇలా జరిగాయి.ఇటీవలే యు పి లో తన మిత్రులతో కలిసి రోడ్డు పై నడుస్తూ నడుస్తూ కుప్ప కూలి పోయిన ఘటన నేడు చర్చనీయ అంశంగా మారింది.ఆశ్చర్యం కలిగించే మరో అంశం విస్మయం కలిగిస్తోంది. వధువు వరుడుకీ వరమాల వేస్తూ అక్కడే కుప్ప కూలిపోయింది.చనిపోయింది.ఈ ఘటన లక్నో లో ని మలిహాబాద్ కేంద్రం లో వధూ వరులు స్టేజి పై ఒకరి కొకరు ఎదురుగా నిలబడ్డారు వరుడు వశువు శివానికి వరమాల వేసాడు వరుడు. ఇక శివాని వంతు వచ్చింది ఆమె వరుడికి వరమాల వేస్తూ ఉండగానే స్టేజి పై కుప్పకూలిపోయింది.వధువును వెంటనే ఆసుపత్రికి తరలించిన అక్కడ ఆమె మరణించి నట్లు ప్రకటించారు. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించిందని ఇంత తక్కువ వయసులో కార్డియాక్ అరెస్ట్ కు గురైందని తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ ఇది మొదటిది మాత్రం కాదు పెళ్ళిలో స్నేహితుడి పెళ్ళిలో నృత్యం చేస్తూ ఒక యువకుడు కుప్ప కూలిన సంఘటన మరో యువకుడిని బలితీసుకుంది. ఇలాంటి ఘటనలు ఎన్నోజరిగాయి అతి పిన్న వయస్సులో మిత్రుదుని కోల్పోయిన వాళ్ళు. తమ సహోదరిని సహచరులను కోల్పోయిన వారి ఘటనలు కోకొల్లలు.యువకులలో కార్డియాక్ అరెస్ట్ వంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన సి డి సి అంచనా ప్రకారం 25 సం వత్చరాల లోపు ఉన్న యువకుకులు 25,౦౦౦ మంది కార్డియాక్ అరెస్ట్ తోనే మరణించారని నివేదిక లో పేర్కొన్నారు.అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి దాని నుండి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి  కార్డియాక్ అరెస్ట్... కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే గుండెకు అవసరమైన రక్తం సరఫరా అందనప్పుడు. అప్పుడు గుండె చప్పుడు ఆగిపోతుంది.అది మనకు ఏమాత్రం సంకేతం అందదు. కార్డియాక్ అరెస్ట్ వెంటనే వ్యక్తి ఉన్న చోటే కుప్పకూలిపోతాడు గుండేనొప్పి, ఊపిరి తిత్తులలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం కుటుంబం లో ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ చరిత్ర ఇలాంటి లక్షణాలు ఉంటె వాటిపై దృష్టి పెట్టాలి.లేదంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సకాలంలో గుర్తించి దీనికి చికిత్చ చేయించాలి. కార్డియాక్ అరెస్టుకు కారణాలు ఏమిటి ? కార్డియాక్ అరెస్టుకు కారణం ఒక వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది ౩5 సం వయస్సు పై బడిన వారిలో సహజంగా కార్డియాక్ అరెస్ట్ కరోనరీ ఆర్ట్ట్రీ డిసీజ్ కి కారణం గా చెబుతున్నారు యువకులలో కార్డియాక్ అరెస్ట్ కు కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.అసహజమైన జీవన శైలి,నేటి ఆధునిక సమాజం లో ఒత్తిడి, ఆహార విహారం శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలు ధూమపానం మధుమేహం,ఊబకాయం  ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం మరో కారణం గా  నిపుణులు పేర్కొన్నారు. హైపెర్ కార్డియాక్ మయోపతి... ఇది గుండె సంబంధిత సమస్యలలో అత్యంత క్లిష్టమైనది గుండెలోని కండరాలు రక్త నాళాలలో వాపులు వస్తాయి. కరోనరీ ఆర్టరీ అబ్నా నార్మాల్టీ స్... చాలా మందిలో కోరో నరీ ఆర్టరీ లో అసమాన్యం గా కలిసి ఉండడం గమనించవచ్చు గుండెలోని కండరాలు రక్త ప్రసారం పూర్తిగా తగ్గిపోతుంది ఈ రకంగా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది కార్డియాక్ అరెస్ట్ కు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. లాంగ్ క్యుటి సిండ్రోం... ఈ రకమైన గుండె ఆర్టరీ జనరిక్ అని అంటారు అనుకోకుండా గుండె చప్పుడు పెరిగిపోతుంది. బుగుడా సిండ్రోం... వంశ పారం పర్యంగా సాధారణంగా వచ్చే లయను బాదిస్తుంది. గుండె అసామాన్యంగా గుండె కండరాలు వాపులు వంటివి యువకులలో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించవచ్చు. కుటుంబ చరిత్ర... ఒకవేళ మీ కుటుంబం లో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన చరిత్ర ఉంటె మీ డాక్టర్ వద్దకు వెళ్లి స్క్రీనింగ్ చేయించుకోవడం మరి కార్డియాక్ అరెస్ట్ కు ప్రాత్యామ్నాయం ఏమిటి ?అన్నది తెలుసుకోవాలి అనుకోకుండా వచ్చే మృత్యువునుండి రక్షింప బడతారు. డిఫ్రీ బ్రీటర్ లేదా సి డి ఆశ... దీఫ్రి బ్రీ లెటర్ నేడు అన్ని చోట్లా అందుబాటులో ఉంది అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణం రక్షించడం లో పనికి వస్తుంది.కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే ఒక డిఫ్రీబ్రిలేతర్ సాధారణ గుండె చప్పుడు తెలుసుకునేందుకు అనుకోకుండా రక్త ప్రసారం కరెంట్ షాక్ కొట్టినట్లు పనిచేస్తుంది. దీనికి  తోడు స్చూళ్ళు కళాశాలలు ఆఫీసులో సి పి అర్ ఇచ్చే విధంగా శిక్షణ అందరికీ ఇవ్వాలి. అప్రమత్తం చేసే సంకేతం... కార్డియాక్ అరెస్ట్ నుండి ప్రాణం రక్షించేందుకు అప్రమత్తంగా ఉండడం అవసరం దీనిని అర్ధం చేసుకోవడం సత్వరం వైద్య సహాయం తీసుకోవడం అవసరం.దీనివల్ల ప్రాణం రక్షింప బడాలి యువకులలో అనుకోకుండా వాచ్చే కార్డియాక్ అరెస్ట్ మరణాలకు పెద్ద కారణంగా చెప్ప వచ్చు.అందులోనూ ఒత్తిడి పెంచే క్రీడలు కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం మరింత పెంచుతుంది. దీని కోసం మీరు మీ డాక్టర్ ను సంప్రదించండి. మీరు పడుకున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ రావచ్చు.కార్డియాక్ అరెస్ట్ లో ప్రమాదం ఎక్కువ డాక్టర్ సలహా అవసరం మిమ్మల్ని మీరు రక్షించు కునే పద్దతులను తప్పనిసరిగా డాక్టర్ తో మాట్లాడాలి. జీవన శైలి లో మార్పులు... మీరు ఎంచుకునే జీవనశైలి ని ఎంపిక చేసుకోవడం ద్వారా మీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండే విధంగా ఉండద్తం సమయానికి చకప్ చేయించుకోవడం గుండె సంబందిత స్క్రీనింగ్ చేయించడం ద్వారా అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించ వచ్చు.మీ అప్రమాత్తతే మీ గుండెకు శ్రీరామ రక్ష. 

గుజరాత్ లో xbb కోవిడ్ వేరియంట్!

గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ జీనోమ్ సీక్వెన్స్ ను పరిశీలించిన పరీక్షించింది ఎనాలసిస్ చేసిన తరువాత 1౦౦ సీక్వెన్స్ ల లోనూ 45 కేసులలో x బి బి కేసులు ఉన్నాయని దీనిని అనుసరించి 2౦%బిఏ .2 1౦ 19%బి ఏ .2. 75, 16 %ఇతర వైరస్ లు ఉన్నట్లు గుర్తించారు.బిఏ 2. 75 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ కోవిడ్ కేసులలో మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. అంటే xbb బి ఏ 2.1౦ మరియు బిఏ2.7 నేడు కనీసం లో కనీసం కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి.రాష్ట్రం లో తక్కువ స్థాయిలో నమోదు కావడాన్ని దృష్టిలో ఉంచుకుని వేరియంట్ తనరూపాం మర్చుకోదాన్ని గమనించారు. ఆరు నెలలుగా 198 తక్కువ కేసులు నమోదు కావడాన్ని గమనించ వచ్చు.రాష్ట్రం లో ౩౩ జిల్లాలలో 14 జిల్లాలలో ౦%14 %నుండి 1౦ %కన్నా తక్కువ కేసులు నమోదు అవుతునాయి.బి ఎన్1 ,బి ఎం 1.1 ,బి ఎల్1 , 1౦౦ సీక్వెన్స్ ఎనాలసిస్ లో 45 %కేసులు xbb బిఏ 2.1౦ 22 %,బి ఏ 2.1౦19% బి ఏ 2.75 16 %ఇతర వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు x bb సబ్వేరియంట్ భారత్లో అక్టోబర్ వచ్చిందని చాలా రాష్ట్రాలలో నమోదు అవుతున్నాయని కొన్ని క్రేసులు వైరల్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రిలో చేరుతూ ఉన్న వారిసంఖ్య తక్కువే అని డాక్టర్లు  అంటున్నారు.                 

అల్జీమర్స్ ను గుర్తించేందుకు మూత్ర పరీక్ష!

మన మూత్రంలో ఏర్పడే యాసిడ్ లెవెల్స్ గణనీయంగా పెరగడం వల్ల అల్జీమర్స్ వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వారితో పోల్చినప్పుడు నియంత్రణ ప్రాధమిక స్థాయిలో జ్ఞాపక శక్తి కోల్పోవడం  గ్రూప్ ఫార్మకా యాసిడ్ మూలంగా కాగ్నేటివ్ అత్యంత సున్నితమైన బయో మార్కర్ ద్వారా ప్రాధమిక స్థాయి వ్యాధిగా అల్జీమర్స్ ను గుర్తించ వచ్చు. చాలా చిన్న మూత్ర పరీక్షన్ ద్వారా అసలు అల్జీమర్స్ ఉందొ లేదో నిర్ధారణ చేయవచ్చు. అల్జీమర్స్ వ్యాధి పెద్ద సమస్యాత్మకం కాదు.పరిశోదన చేస్తున్న శాస్త్రజ్ఞుల  అభిప్రాయం ప్రకారం యురినరీ ఫార్మిక్ యాసిడ్ చాలా సున్నితమైన మార్కర్ గా పెర్కొన్నారు.చివరికి పరిశోదన ద్వారా శాస్స్త్రజ్ఞుల తేల్చిన నిజం ఏమిటి అంటే చాలా మంది రోగులను  పరీక్షించి అల్జీమర్స్ ఏస్థాయిలో ఉందొ తీవ్రత ఎంత ఉందొ ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఇతరులను గుర్తించడం లో ఎలా ప్రవర్తిస్తున్నారు వారి మానసిక పరిస్థితి ఏమిటి.వివిదరకాల మూత్రం వాటిలో బయో మార్కర్లు గుర్తించడం కీలకం. ఫార్మిక్ యాసిడ్ మెటబాలిక్ ఉత్పత్తులు... మూత్రం లో ఫార్మిక్ యాసిడ్ లెవెల్స్ గణనీయం గా పెరగడాన్ని గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న వారిలో అల్జీమర్స్,ఆరోగ్య నియంత్రణ ప్రాధమిక స్థాయిలో జ్ఞాపక శక్తి కోల్పోవడం జ్ఞానం కోల్పోవడం వంటి మార్పులు వస్తాయి.ఫార్మిక్ యాసిడ్ ఒక సున్నితమైన బయో మార్కర్ గా ఉంటుంది.ఉల్చింగ్ న్యూరో సైన్స్ లో అక్జీమర్స్ వ్య్యాది పై చేసిన పరిశోదన వివరాలను ప్రచురించారు.అల్జీమర్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వృద్ధి చెందితే కొన్నేళ్ళు ఉంటుంది ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి క్షీణించడం వంటి సమస్య్స లు వస్తాయి. ఈ వ్యాధికి ముందు ఇర్రివర్సబుల్ డిమ్నీషియా బ్జేల్ అంటారు. ఇది చికిత్చకు సరైన సమయం అల్జీమర్స్ వ్యాధి వయస్సు మళ్ళిన వాళ్ళలో వస్తుంది.ప్రస్తుతం నిర్దారణకు గాను పొజిషన్ టోమోగ్రఫీ బ్రెయిన్ స్కాన్, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.లేదా రేడియేషన్ బయో మార్కర్ పరీక్ష చేయాల్సి ఉంటుంది.ఈపరీక్ష ద్వారా అల్జీమర్స్ వచ్చిందో లేదో తెలుస్తుంది. రక్త నమూనాల లంబార్ పంక్చర్ ద్వారా సెరిబ్ర ఫైరాల్ ఫ్లూయిడ్ రోగులలో ఉంటుంది.574 మంది ప్రయోగం లో పాల్గొన్నారని అందుకు ఆరోగ్య వంతులు సాధారణ స్థితిలో నే ఉన్నారు.జ్ఞాపక శక్తి లో వారిలో వస్తున్న మార్పులు వ్యాధి పెరుగుదలను గుర్తించారు.శాస్త్రజ్ఞులు మూత్రం లో వచ్చే యురినరీ ఫార్మిక్ లెవెల్స్ పరీక్షించగా రక్తం తో కూడిన అల్జీమర్స్ లెవెల్స్ బయో మార్కర్ ఉండవచ్చని దీనిద్వారా అల్జీమర్స్ ఏ స్థాయిలో ఉందొ ఆ వ్యక్తిలో లక్షణాలు ఎలా ఉంటాయో గుర్తించారు. యురినరీ ఫార్మిక్ యాసిడ్ ద్వారా అల్జీమర్స్ ను సత్వరం గుర్తించవచ్చని పరిశోదన రచయితలు పేర్కొన్నారు.                   

మహారాష్ట్ర మహిళల్లో 52౦౦౦ మందిలో క్యాన్సర్ !

మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ మాతా సురక్షిత్ తార్ ఘర్ సురక్షిత్ కార్యక్రమం లో భాగంగా గత రెండు నెలలుగా మహారాష్ట్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలాలో ఆరోగ్యకేంద్రాలలో 18 సం వత్చారాలు పై బడిన మహిళల లో శారీరక మానసిక పరిస్థితుల ను తెలియచేస్తుంది 4,౦1,86,717 మంది మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించారు ఇందులో ౩౦ సం వత్సరాలు పై బడిన 1.5 మంది స్త్రీలలో 52,568 మందిని నట్లు వారికి వక్షోజాల్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా మరికొంత మందికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని వారిలో ఏ ఏ క్యాన్సర్ లు ఉన్నాయో ఈ స్థాయిలో గుర్తించడం అవసరం అని ఈ రోగులకు రాష్ట్ర ప్రభుయ్హ్వం అవసరమైన చికిత్చకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.స్క్రీనింగ్  సమయంలో వచ్చిన రేపోర్ట్ ఆధారంగా మరికొంత మందిలో నోటి క్యాన్సర్ ఊపిరి తిత్తుల క్యాన్సర్ ప్రాధమిక స్థాయిలో ఉన్నట్లు వాటికి సరైన చికిత్చ చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.  ఈ కార్యక్రమం లో స్వచ్చంద సంస్థలు క్యాన్సర్ ఆసుపత్రులు చికిత్చలో పాల్గొనాలని ఇందులో మహిళలు తల్లులు వారి  బి ఎం ఐ ఆదారంగా రక్తం,మూత్ర పరీక్షలు ,డయాబెటిస్,హిమాగ్లోబిన్ శాతం ఎంత ఉందొ పరీక్షిస్తున్నారని ఈ నెల చివరి నాటికి ముగుస్తుందని ఆరోగ్యశాఖ అధికారి అనిరుద్ధ దేశ్ పాండే వెల్లడించారు.వీరిలో చాలా మందికి క్యాన్సర్ తో పాటు ఇతర నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ కూడా ఉంది ఉండవచ్చని క్యాన్సర్ సమస్యలు కూడా ఉన్నాయని చాలాకేసులను ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్చ సాధ్యమని అన్నారు. కొందరిలో నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు ఉన్నా లక్ష్సణాలు లేవని అయితే వారు ఆరోగ్యంగా ఉన్నారని వారి పై వ్యాధి వారి శరీరం పై చాలా ఆలస్యంగా ప్రభావం చూపుతుందని రోగులకు మరిన్ని పరీక్షలు చేయడం ద్వారా అవసరమైన చికిత్చ,లేదా శాస్త్ర చికిత్చ కు కూడా వెనుకడ బోనని అధికారులు వెల్లడించారు.