భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ మ్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటింగ్...
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మోహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ను ఎంచుకుంది. కాగా ఇప్పటివరకూ రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగగా మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇక రెండో మ్యాచ్ లో టీమిండియా గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.
టీం ఇండియా ఆటగాళ్లు:
మురళీ విజయ్, పార్థీవ్ పటేల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, కేకే నాయర్, అశ్విన్, జడేజా, యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ
ఇంగ్లండ్ టీం:
కుక్, హమీద్, రూట్, అలీ, బెయిర్స్టో, స్టోక్స్, బట్లర్, వోక్స్, రషీద్, బ్యాటీ, అండర్సన్